Home Telangana TGSRTC | ఆర్టీసీలో చిల్లర డబ్బులకు చెక్.. టికెటింగ్ విధానం మరింత ఈజీ

TGSRTC | ఆర్టీసీలో చిల్లర డబ్బులకు చెక్.. టికెటింగ్ విధానం మరింత ఈజీ

0
9
TSRTC
TGSRTC-Bus
Spread the love

TGSRTC హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో టిక్కెట్ల కొనుగోలుకు డిజిటల్ పేమెంట్ విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమ‌లుచేయాల‌ని టీజీఎస్ ఆర్టీసీ యోచిస్తోంది. హైదరాబాద్‌లో ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ సిస్టమ్ (AFCS) కింద డిజిటల్ చెల్లింపులు. టచ్-అండ్-గో విధానంతో టికెటింగ్‌ను మ‌రింత సుల‌భ‌త‌ర‌మ‌వుతుంది. రాష్ట్రంలోని ఇతర ప్రదేశాలలో దీనిని అందుబాటులోకి తీసుకురావడానికి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ పథకం కింద జారీ చేయబడిన టిక్కెట్లను జీరో-ఫేర్ టిక్కెట్లుగా పిలుస్తారు.

దీనికోసం ప్రత్యేక యంత్రాలను కూడా ఏర్పాటు చేస్తామని రవాణా, బీసీ సంక్షేమ శాఖ‌ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్లుగా, కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి ఉచిత ప్రయాణ పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తోంది. ఇటీవలే, TGSRTC ఔటర్ రింగ్ రోడ్ కారిడార్ అంతటా ఎలక్ట్రిక్ బస్సులను మోహరించాలని యోచిస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. ఆర్టీసీ 191 కోట్ల జీరో-ఫేర్ టిక్కెట్లను జారీ చేసిందని, దీనివల్ల మహిళలకు దాదాపు రూ.6,300 కోట్లు ఆదా అయిందని ఆయన అన్నారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి.  అలాగే మా  గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్)ఫేస్ బుక్,  వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

🇮🇳 జాతీయ ప్రయోజనాలే పరమావధిగా.. 🇮🇳

వందేభారత్ డిజిటల్ సైన్యంలో చేరండి!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here