Friday, January 9Welcome to Vandebhaarath

Trending News

trendingnews trending, trendingnow, trendingtopics, india, trendingmemes latestnews, trendingfashion, breakingnews, fashion, trendingvideo trendings, trendingpost, trendingdances, trendingstyle #trendingtopics #viral #bollywood #currentaffairs #dailynews #trendingvideos #trendingpku #follow #trendingatsephora #celebrity #bollywoodnews #love #newsupdate #worldnews

కోల్‌కతాలో ఈడీ వర్సెస్ మమతా బెనర్జీ: ఐ-ప్యాక్ దాడుల వద్ద ఉద్రిక్తత..
Trending News

కోల్‌కతాలో ఈడీ వర్సెస్ మమతా బెనర్జీ: ఐ-ప్యాక్ దాడుల వద్ద ఉద్రిక్తత..

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో గురువారం (జనవరి 8) హైడ్రామా చోటుచేసుకుంది. టీఎంసీ వ్యూహకర్త ప్రతీక్ జైన్.. ఐ-ప్యాక్ (I-PAC) కార్యాలయాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) జరిపిన దాడులు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. స్వయంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రంగంలోకి దిగి ఈడీ అధికారులతో వాగ్వాదానికి దిగడం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది.రాజకీయ వ్యూహాల కోసమే దాడులు: మమత ఆగ్రహంప్రతీక్ జైన్ నివాసం నుండి బయటకు వచ్చిన మమతా బెనర్జీ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ కేంద్రంపై నిప్పులు చెరిగారు. "పార్టీ హార్డ్ డిస్క్‌లు, అభ్యర్థుల జాబితాలు, భవిష్యత్ వ్యూహాలను దొంగిలించడమే ఈ దాడుల వెనుక ఉన్న అసలు ఉద్దేశం. ఇది ఈడీ పనినా లేక అమిత్ షా ప్లానా?" అని ఆమె ప్రశ్నించారు. ఇది చట్ట అమలు కాదని, కేవలం ప్రతిపక్షాల సమాచారాన్ని సేకరించే ప్రతీకార చర్య అని ఆమె ఆరోపించారు.'న్యాయాన్ని అడ్డుకుంటున్నారు' : బీజ...
Delhi Turkman Gate | ఢిల్లీ తుర్క్‌మాన్ గేట్ వద్ద బుల్డోజర్ల గర్జన: అర్థరాత్రి అస‌లేం జ‌రిగింది?
Trending News

Delhi Turkman Gate | ఢిల్లీ తుర్క్‌మాన్ గేట్ వద్ద బుల్డోజర్ల గర్జన: అర్థరాత్రి అస‌లేం జ‌రిగింది?

న్యూఢిల్లీ: ఢిల్లీలోని చారిత్రాత్మక తుర్క్‌మాన్ గేట్ (Delhi Turkman Gate ) వద్ద మంగళవారం అర్థరాత్రి భారీ ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఫైజ్-ఎ-ఇలాహి మసీదు సమీపంలోని అక్రమ కట్టడాలను తొలగించేందుకు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (MCD) చేపట్టిన బుల్డోజర్ ఆపరేషన్ రణరంగాన్ని తలపించింది.Turkman Gate : అర్ధరాత్రి ఏం జరిగింది?స్థానిక ప్రజలకు అసౌకర్యం కలగకుండా అధికారులు ఈ ఆపరేషన్‌ను అర్థరాత్రి ప్లాన్ చేశారు. అయితే అది ఘర్షణకు దారితీసింది. మంగళవారం రాత్రి 12:00 గంటల ప్రాంతంలో తుర్క్‌మాన్ గేట్ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. దాదాపు అరగంట తరువాత, 12:30 గంటల ప్రాంతంలో, మున్సిపల్ కార్పొరేషన్ 32 బుల్డోజర్లు, 50 డంప్ ట్రక్కులు, 200 మందికి పైగా కార్మికులతో సంఘటనా స్థలానికి చేరుకుంది. అధికారుల‌ ప్రణాళిక ప్రకారం, బుల్డోజర్లను రాత్రి 1 గంటలకు నడపాలి, కానీ ఈ సమయంలో ఆ ప్రాంతంలో జనసమూహం గుమిగూడడం ప్రారంభమైంది. ...
భారతదేశపు తొలి ‘వందే భారత్ స్లీపర్’ రైలు వచ్చేస్తోంది
Trending News

భారతదేశపు తొలి ‘వందే భారత్ స్లీపర్’ రైలు వచ్చేస్తోంది

ముంబై: భారతీయ రైల్వే రంగంలో సరికొత్త విప్లవం రాబోతోంది. ప్రయాణికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వందే భారత్ స్లీపర్ (Vande Bharat Sleeper) రైలుపై కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసింది. దేశంలోనే మొట్టమొదటి స్లీపర్ వెర్షన్ రైలు అస్సాంలోని గౌహతి మరియు పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా (హౌరా) మధ్య నడవనుంది.ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రారంభం కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ మెగా ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని రకాల పరీక్షలు, భద్రతా ధృవీకరణలు విజయవంతంగా పూర్తయ్యాయి. రాబోయే 2-3 రోజుల్లో ఈ రైలు ప్రారంభ తేదీని అధికారికంగా ప్రకటించనున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ ప్రతిష్టాత్మక రైలును జెండా ఊపి ప్రారంభించనున్నారు.180 కి.మీ వేగంతో హై-స్పీడ్ ట్రయల్ సక్సెస్ ఇటీవలే రాజస్థాన్‌లోని కోటా-నాగ్డా సెక్షన్‌లో ఈ రైలు యొక్క తుది ట్రయల్స్ నిర్వహించారు. రైల్వే సేఫ్టీ కమి...
బంగ్లాదేశ్‌లో ఆగని రక్తపాతం: మరో హిందువు దారుణ హత్య! – Mymensingh attack
Trending News

బంగ్లాదేశ్‌లో ఆగని రక్తపాతం: మరో హిందువు దారుణ హత్య! – Mymensingh attack

మయమన్‌సింగ్‌ జిల్లాలో సెక్యూరిటీ గార్డు కాల్చివేత.. పొంచి ఉన్న ముప్పువరుస హత్యలతో వణికిపోతున్న మైనారిటీలు.దీపూ చంద్ర దాస్, అమృత్ మండల్ తర్వాత తాజాగా బజేంద్ర బిశ్వాస్ బలి.ప్రమాదవశాత్తు జరిగిందంటున్న నిందితుడు.. దర్యాప్తులో పోలీసులు.Mymensingh attack : బంగ్లాదేశ్‌లో హిందువులే లక్ష్యంగా జరుగుతున్న దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. అల్లర్లు, ఘర్షణలతో అట్టుడుకుతున్న దేశంలో మైనారిటీల భద్రత గాలిలో దీపంలా మారింది. దీపూ చంద్ర దాస్, అమృత్ మండల్ అనే హిందూ యువకుల హత్యోదంతాలు మరవకముందే.. తాజాగా బజేంద్ర బిశ్వాస్ (42) అనే మరో హిందువు ప్రాణాలు కోల్పోయాడు.ఏం జరిగింది?మయమన్‌సింగ్ జిల్లాలోని ఒక ప్రైవేట్ కర్మాగారంలో బజేంద్ర బిశ్వాస్ సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వర్తిస్తున్నాడు. సోమవారం సాయంత్రం సుమారు 6.45 గంటల సమయంలో, అతడి సహోద్యోగి నోమన్ మియా జరిపిన కాల్పుల్లో బిశ్వాస్ అక్కడికక్కడే...
Rahul Gandhi | కాంగ్రెస్‌లో ‘సంస్థాగత’ చిచ్చు:  దిగ్విజయ్ సింగ్‌పై రాహుల్ గాంధీ సెటైర్లు: “నువ్వు అల్లరి చేశావు”
Trending News

Rahul Gandhi | కాంగ్రెస్‌లో ‘సంస్థాగత’ చిచ్చు: దిగ్విజయ్ సింగ్‌పై రాహుల్ గాంధీ సెటైర్లు: “నువ్వు అల్లరి చేశావు”

బిజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ సంస్థాగత బలాన్ని ప్రశంసించిన దిగ్విజయ్నష్టనివారణ చర్యల్లో దిగ్గీ రాజా.. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో హాట్ టాపిక్న్యూఢిల్లీ, డిసెంబర్ 29: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశానికి ముందు సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ చేసిన కొన్ని వ్యాఖ్యలు పార్టీలో రాజకీయ తుఫానును రేపాయి. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ (RSS) సంస్థాగత నిర్మాణాన్ని ఆయన బహిరంగంగా ప్రశంసించడంపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఆదివారం తనదైన శైలిలో స్పందించారు.ఏం జరిగింది?కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన టీ విరామ సమయంలో రాహుల్ గాంధీ, దిగ్విజయ్ సింగ్‌లు ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ఆయనతో కరచాలనం చేస్తూ నవ్వుతూ.. "నిన్న నువ్వు అల్లరి చేశావు" (You misbehaved yesterday) అని వ్యాఖ్యానించారు. దిగ్విజయ్ సింగ్ అంతకుముందు రోజు సోషల్ మీడియాలో బీజే...
MGNREGA పేరు మార్పుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం: కొత్త పేరు ‘PBGRY’
National, Trending News

MGNREGA పేరు మార్పుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం: కొత్త పేరు ‘PBGRY’

ప్రపంచంలోనే అతిపెద్ద ఉపాధి హామీ పథకానికి కొత్త రూపంగ్రామీణ భారతదేశ ఆర్థిక బలాన్ని బలోపేతం చేయడమే లక్ష్యం.న్యూఢిల్లీ, డిసెంబర్ 12: గ్రామీణ భారతదేశ ఆర్థిక బలాన్ని బలోపేతం చేసేందుకు ఉపాధికి హామీ క‌ల్పించేందుకు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MNREGA) పేరు మార్చే ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ పథకానికి కొత్త పేరును ఖరారు చేసింది.MNREGA కొత్త పేరు ఏమిటి?MNREGA పథకాన్ని ఇప్పుడు "పూజ్య బాపు గ్రామీణ రోజ్‌గార్ యోజన" (PBGRY) గా పిలవనున్నారు. ఈ మార్పు గ్రామీణ ఉపాధి హామీ పథకాలపై ప్రభుత్వ దృష్టిని, ప్రాధాన్యతను మరోసారి ప్రతిబింబిస్తుంది.కాగా MNREGA ప్రపంచంలోనే అతిపెద్ద ఉపాధి హామీ పథకాలలో ఒకటి. దీనిని 2005లో అప్పటి కేంద్ర ప్రభుత్వం మన్మోహన్ సింగ్ ప్రారంభించారు. ఈ పథకాన్ని గతంలో కేవలం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (NREGA) అని పిలిచే...
Macaulay |మెకాలే సంకెళ్లు తెంచుకుందాం: PM మోదీ పిలుపు!
National, Trending News

Macaulay |మెకాలే సంకెళ్లు తెంచుకుందాం: PM మోదీ పిలుపు!

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయోధ్య రామమందిరంలో పవిత్ర జెండాను ఎగురవేసిన సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. 1835 నాటి లార్డ్ మెకాలే ప్రవేశపెట్టిన ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ యాక్ట్ 200వ వార్షికోత్సవానికి ముందు, ఆ 'బానిసలుగా ఉన్న భారతీయ విద్యావ్యవస్థను పూర్వ‌వైభ‌వం తీసుకురావవానికి ప్రతి భారతీయుడు 10 సంవత్సరాల ప్రతిజ్ఞ తీసుకోవాలని ఆయన కోరారు.ఈసంద‌ర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, "1835 నాటి ఇంగ్లీష్ విద్యా చట్టం ద్వారా మెకాలే మన ఆత్మవిశ్వాసాన్ని విచ్ఛిన్నం చేశాడు. భారతీయ విద్యావ్యవస్థను చెత్తబుట్టలో పడేశాడు. పాశ్చాత్య విద్యావ్యవస్థను అవలంబించాలని మనల్ని నమ్మించింది," అని అన్నారు. వలసవాద మనస్తత్వం యొక్క సంకెళ్ల నుండి బయటపడాలని, తద్వారా 2047 నాటికి 'అభివృద్ధి చెందిన భారతదేశం' కలను సాధించవచ్చని ఆయన ఉద్ఘాటించారు.రాముడి విలువలు, మానసిక బానిసత్వం"రాముడు ఒక సంపూర్ణ విలువల వ్యవస్థను కలిగి ఉన్నాడు. ప్రత...
Delhi Blast | ఢిల్లీలో భారీ పేలుడు: ఎర్రకోట మెట్రో సమీపంలో 8 మంది మృతి – రాజధానిలో రెడ్ అలర్ట్
National, Trending News

Delhi Blast | ఢిల్లీలో భారీ పేలుడు: ఎర్రకోట మెట్రో సమీపంలో 8 మంది మృతి – రాజధానిలో రెడ్ అలర్ట్

Delhi Blast | న్యూదిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ మరోసారి భయాందోళనకు గురైంది. సోమవారం సాయంత్రం ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నంబర్ 1 సమీపంలో కారులో జరిగిన భారీ పేలుడు సంభ‌వించి ప‌ది మంది అక్కడికక్కడే మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అగ్నిప్రమాదంలో పలు వాహనాలు దగ్ధమయ్యాయి. పేలుడు తర్వాత రాజధానిలో హై అలర్ట్ ప్రకటించి, భద్రతా దళాలను కీలక ప్రాంతాల్లో మోహరించారు. గాయపడిన వారిని లోక్ నాయక్ జయప్రకాశ్ (LNJP) ఆసుపత్రికి తరలించారు.దర్యాప్తు వేగవంతం – ఫోరెన్సిక్ బృందాలు రంగంలోకిసాయంత్రం 6 గంటల సమయంలో ఢిల్లీ అగ్నిమాపక శాఖకు పేలుడు సమాచారం అందింది. వెంటనే ఏడు అగ్నిమాపక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి.ఒక అధికారి తెలిపిన ప్రకారం “ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో కారులో పేలుడు సంభవించడంతో మూడు నుంచి నాలుగు వాహనాలు మంటల్లో చిక్కుకున్నాయి,” అని పేర్కొన్నారు.పేలుడు...
Sambhajinagar | ఔరంగాబాద్ రైల్వే స్టేషన్‌కు ఛత్రపతి శంభాజీనగర్‌గా పేరు మార్పు
Trending News, తాజా వార్తలు

Sambhajinagar | ఔరంగాబాద్ రైల్వే స్టేషన్‌కు ఛత్రపతి శంభాజీనగర్‌గా పేరు మార్పు

మహారాష్ట్రలోని ఔరంగాబాద్ రైల్వే స్టేషన్ పేరును ఛత్రపతి సంభాజీనగర్ స్టేషన్‌ (Sambhajinagar Railway Station ) గా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని అప్పటి ప్రభుత్వం ఔరంగాబాద్ నగరాన్ని అధికారికంగా ఛత్రపతి శంభాజీనగర్‌గా పేరు మార్చింది. గతంలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పేరు మీద ఉన్న ఈ నగరానికి మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు శంభాజీ స్మార‌కార్థం ఈ పేరు పెట్టారు. పేరు మార్పును ముందుగా ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని MVA ప్రభుత్వం ప్రారంభించింది. బిజెపి నేతృత్వంలోని మహాయుతి ప్రభుత్వం అక్టోబర్ 15న ఔరంగాబాద్ రైల్వే స్టేషన్ పేరును మార్చడానికి గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిందని శనివారం ఓ అధికారి తెలిపారు.అయితే ఔరంగాబాద్ రైల్వే స్టేషన్ 1900లో ప్రారంభ‌మైంది. దీనిని హైదరాబాద్ 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ నిర్మించారు. ఈ రైల్వే స్టేషన్ కాచిగ...
Bareilly Volence : బరేలీ హింసకు పోలీసుల రియాక్ష‌న్‌.. రంగంలోకి బుల్డోజర్
Trending News

Bareilly Volence : బరేలీ హింసకు పోలీసుల రియాక్ష‌న్‌.. రంగంలోకి బుల్డోజర్

Bareilly Volence : ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో సెప్టెంబర్ 26న శుక్రవారం ప్రార్థనల తర్వాత చెలరేగిన హింసకు సంబంధించి పోలీసులు కీలక చర్యలు తీసుకున్నారు. మౌలానా తౌకీర్ రజా అల్లుడిని పోలీసులు అరెస్టు చేశారు. మొహ్సిన్ రజాను అరెస్టు చేయడంతో పాటు, బరేలీ పోలీసులు అతని రిసార్ట్‌ను కూడా సీజ్ చేశారు.బరేలీ హింసపై పోలీసుల దర్యాప్తు సాగుతున్న కొద్దీ, విస్తుగొలిపే విషయాలు బయటపడుతున్నాయి. హింసలో పాల్గొన్న ఇతర వ్యక్తులపై పోలీసు చర్యలు కొనసాగుతున్నాయి. బరేలీ హింసకు ప్రధాన కుట్రదారుడు మౌలానా తౌకీర్ రజా అనుచ‌రుల‌పై పోలీసులు నిఘా వేసి చర్యలు తీసుకుంటున్నారు. బరేలీ పోలీసులు మౌలానా అల్లుడు మొహ్సిన్ రజాను అరెస్టు చేశారు. అతని రిసార్ట్‌ను సీజ్ చేశారు. మొహ్సిన్ అక్రమ ఆస్తులపై కూడా సీఎం యోగి బుల్డోజర్ చర్య (Bulldozer Action) చేపట్టారు.మౌలానా మొహ్సిన్ రజా ఆస్తిని బుల్డోజర్ ద్వారా కూల్చివేశారు. సెప్టెంబర్ 26న అల...