Home Telangana New Railway Lines | మూడు కొత్త లైన్ పనుల కోసం దక్షిణ మ‌ధ్య రైల్వే...

New Railway Lines | మూడు కొత్త లైన్ పనుల కోసం దక్షిణ మ‌ధ్య రైల్వే క‌స‌ర‌త్తు

0
1
Amaravati Railway line
Amaravati Railway
Spread the love

New Railway Lines | తెలంగాణలో కొత్త రైల్వేపనులను ముందుకు నడిపించేందుకు దక్షిణ మధ్య రైల్వే కసరత్తు చేస్తోంది. మనోహరాబాద్-కొత్తపల్లి, అక్కన్నపేట్-మెదక్, భద్రాచలం-కొవ్వూరు కొత్త లైన్లతో సహా తెలంగాణ ప్రభుత్వం నుంచి మూడు కీలక రైల్వే ప్రాజెక్టులకు భూమి వాటా కోసం దక్షిణ మధ్య రైల్వే (SCR) కొంతకాలంగా వేచి చూస్తోంది.

కొత్తపల్లి – మనోహరాబాద్ లైన్

151.36 కి.మీ పొడవైన మనోహరాబాద్-కొత్తపల్లి ప్రాజెక్టుకు ₹2,780.78 కోట్ల అంచనా వ్యయం (భూమి ధర మినహాయించి), రాజన్న సిరిసిల్లలో దాదాపు 15.3 హెక్టార్ల అటవీ భూమికి అటవీ అనుమతులు పెండింగ్‌లో ఉన్నాయని రైల్వే సీనియర్ అధికారులు తెలిపారు. సిద్దిపేట నుంచి మరో ఐదు హెక్టార్లు, రాజన్న-సిరిసిల్లలో 42.4 హెక్టార్లు, కరీంనగర్ జిల్లాల నుంచి 38.2 హెక్టార్లు ప్రైవేటు భూమిని సేకరించాల్సి ఉంది. రైల్వే పనుల కోసం సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాల నుంచి మొత్తం 1,073.7 హెక్టార్లు కావాల్సి ఉండగా ఇప్పటికే దాదాపు 973 హెక్టార్ల భూమిని సేకరించారు.

తెలంగాణ ప్రభుత్వం ఉచితంగా భూమిని అందించనుండగా రూ.1,160.48 కోట్ల ప్రాథమిక వ్యయ అంచనా ప్రకారం ఈ ప్రాజెక్ట్ వ్యయం-భాగస్వామ్య ప్రాతిపదికన చేపట్టింది. సవరించిన అంచనా బడ్జెట్ ప్రకారం.. ₹1,411.79 కోట్లు కాగా ఈ వ్యయంలో తెలంగాణ ప్రభుత్వం వాటా సుమారు ₹926.93 కోట్లు, ఇందులో ఇప్పటి వరకు ₹416 కోట్లు జమ చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం జమ చేయాల్సిన మిగిలిన మొత్తం ₹511.20 కోట్లు అని రైల్వే అధికారులు తెలిపారు.

17.2 కి.మీ అక్కన్నపేట-మెదక్ ప్రాజెక్ట్ కోసం, రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్ట్ వ్యయంలో 50%  నిధులు కేటాయించడంతోపాటు భూమి సేకరణ చేపట్టి ఇవ్వాలి. ఈ ప్రాజెక్ట్ యొక్క సవరించిన వ్యయం ₹205.68 కోట్లు, ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా ₹102.84 కోట్లు, ఇందులో ₹98. 87 కోట్లు మాత్రమే ప్రభుత్వం డిపాజిట్ చేసినట్లు సమాచారం. 3.87 కోట్ల బాకీ మొత్తాన్ని విడుదల చేయాల్సి ఉంది.

New Railway Lines : కాజీపేట-విజయవాడ, మర్పల్లి-కోహీర్, వలిగొండ-రామన్నపేట్, మానోపాడ్-అలంపూర్ రోడ్డు, గుండ్లపోచంపల్లి-బోలారం, నవీపేట్-బాసర్, జాన్కంపేట్-బోధన్, కోసాయి విభాగాల్లో ఉన్న లెవెల్ క్రాసింగ్‌ల వద్ద రోడ్డు అండర్ బ్రిడ్జిలకు కూడా SCR అనుమతి కోరుతోంది.

భద్రాచలం కొవ్వూరు లైన్

ఇక మూడవ పెండింగ్ లో ఉన్న కొత్త లైన్ ప్రాజెక్ట్ 151-కిమీ భద్రాచలం-కొవ్వూరు లైన్.  ఇది తెలంగాణ మీదుగా 46 కి.మీ ఉంది. ఈ  రైల్వే లైన్ మొత్తం వ్యయం ₹1,022.87 కోట్లు కాగా, రైల్వే ఖర్చు ₹511.5 కోట్లు.  రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు ₹387.21 కోట్లు, భూ సేకరణ ఖర్చు ₹124.22 కోట్లు.

కాజీపేట-విజయవాడ మూడో లైన్‌కు 6.3 హెక్టార్లతో సహా ఖమ్మం జిల్లాలో దాదాపు 52.9 హెక్టార్ల భూమి (మొత్తం 59.2 హెక్టార్లు) కోసం మరో రెండు ప్రాజెక్టులకు భూమి అవసరమని రైల్వేశాఖ సీనియర్ అధికారులు తెలిపారు. రెండవది బీబీనగర్-గుంటూరు డబ్లింగ్ ప్రాజెక్టు కోసం యాదాద్రి-భువగిరి నుంచి 20.30 హెక్టార్లు, మొత్తం 61.04 హెక్టార్లు, నల్గొండ జిల్లా నుంచి 40.74 హెక్టార్లు ఇంకా సేకరించాల్సి ఉంది. అంతేకాకుండా, తిమ్మాపూర్, జాన్కంపేట్, మక్తల్ సెక్షన్‌లలో ఎలక్ట్రిక్ ట్రాక్షన్‌లో పూర్తి రైళ్లను తీసుకెళ్లడానికి టిజి ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ తన సబ్ స్టేషన్‌లను వేగవంతం చేయాలని రైల్వే అధికారులు ఎదురుచూస్తున్నారు.


Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన వార్తల కోసం హరితమిత్ర ను సందర్శించండి.

తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు, ఫేస్ బుక్,  ఎక్స్ (ట్విట్టర్) లో జాయిన్ కండి.

🇮🇳 జాతీయ ప్రయోజనాలే పరమావధిగా.. 🇮🇳

వందేభారత్ డిజిటల్ సైన్యంలో చేరండి!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here