Tuesday, February 18Thank you for visiting

BJP | బిజెపి పార్టీ విస్త‌ర‌ణ కార్య‌క్రమాలు షురూ.. దేశవ్యాప్తంగా 768 కార్యాలయాలు

Spread the love

BJP Offices | భార‌తీయ జ‌న‌తా పార్టీని విస్తరించేందుకు అగ్ర‌నాయ‌క‌త్వం క‌స‌ర‌త్తు చేస్తోంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా బిజ‌పీని 768 పార్టీ కార్యాలయాలను ఏర్పాటు చేయాలని యోచిస్తోందని, వాటిలో ఇప్ప‌టికే 563 సిద్ధంగా ఉన్నాయని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా (BJP president JP Nadda ) శనివారం వెల్ల‌డించారు. పనాజీ సమీపంలోని గోవా బీజేపీ ప్రధాన కార్యాలయ నిర్మాణానికి ఆయ‌న‌ శంకుస్థాపన చేశారు. అనంత‌రం జ‌రిగిన స‌మావేశంలో ప్రసంగించారు.

గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ (Goa Chief Minister Pramod Sawant) మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ శంకుస్థాపన చేశారు. బిజెపి దేశవ్యాప్తంగా 768 కార్యాలయాలను ఏర్పాటు చేస్తుంది. 563 పార్టీ కార్యాల‌యాలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. గోవాలోని బిజేపి ప్రధాన కార్యాలయం పనాజీ శివార్లలో రాజధాని నగరాన్ని ఓల్డ్ గోవాకు కలిపే హైవేకి సమీపంలో ఉంటుంది. డిసెంబర్ 2026 నాటికి కొత్త భవనం సిద్ధమవుతుందని సావంత్ చెప్పారు.

READ MORE  MSP | వరి, జొన్న, పత్తి సహా 14 పంటలకు మద్దతు ధర పెంపు.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..

“కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రభుత్వం, పార్టీ సంస్థకు సంబంధించి అనేక కీల‌క‌ నిర్ణయాలు తీసుకున్నారు” అని నడ్డా అన్నారు. ప్రతి రాజధాని నగరంలో బీజేపీ ప్రధాన కార్యాలయాన్ని, ప్రతి జిల్లాలో పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం ప్రధాని మోదీ, షా తీసుకున్న ముఖ్య‌ నిర్ణయాల్లో ఒకటని ఆయన అన్నారు.

BJP Offices “పార్టీ 768 కార్యాలయాలను నిర్మించాలని నిర్ణయించుకుంది. వాటిలో 563 ఇప్పటికే పూర్తయ్యాయి, అయితే 96 కార్యాలయాల్లో పని జరుగుతోంది” అని జెపి నడ్డా వివ‌రించారు. 2014 లోక్‌సభ ఎన్నికలకు ముందు 2013 జూన్‌లో గోవాలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం జరిగిందని నడ్డా గుర్తు చేసుకున్నారు.

READ MORE  DMRC QR Ticket | శుభవార్త! ఢిల్లీ మెట్రో ప్రయాణికులు ఇప్పుడు స్మార్ట్‌ఫోన్‌లలో మ‌ల్టిపుల్ జ‌ర్నీ QR టిక్కెట్‌లను బుక్ చేసుకోవచ్చు

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని జాతీయ కార్యవర్గ సమావేశం తీర్మానించిందని, ఆ సమావేశం తర్వాత పార్టీ కార్యకర్తలు కష్టపడి పనిచేశారని, దాని కారణంగానే 2014లో నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని ఆయన అన్నారు. అనంత‌రం ఫడ్నవీస్ విలేకరులతో మాట్లాడుతూ, బీజేపీ నాయకుడిగా ఇది తనకు గర్వకారణమని అన్నారు. ‘ఏ బీజేపీ నాయకుడికైనా పార్టీ కార్యాలయం ఇల్లు లాంటిదని, తన ఇంటికి శంకుస్థాపన చేసేటప్పుడు అదే ఆనందాన్ని అనుభవిస్తాను’ అని ఆయన అన్నారు.

READ MORE  Mahakumbh 2025 : కుంభమేళాను సందర్శిస్తున్నారా? ఈ ఐదు తీసుకురావ‌డం మర్చిపోవద్దు..

Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన వార్తల కోసం హరితమిత్ర ను సందర్శించండి.

తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు, ఫేస్ బుక్,  ఎక్స్ (ట్విట్టర్) లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

భారతదేశంలోని ప్రసిద్ధమైన 10 శైవక్షేత్రాలు అత్యాధునిక హంగులతో చర్లపల్లి రైల్వే టెర్మినల్ చూశారా?