హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ బస్సులో ప్రయాణించే మహిళా ప్రయాణికులకు (టీఎస్ఆర్టీసీ) కీలక సూచనలు చే సింది. మహిళలు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్య పథకాన్ని(TSRTC Free Travel) వినియోగించుకోవాలంటే ఒరిజినల్ గు ర్తింపు కార్డు తప్పనిసరి అని పేర్కొంది. గుర్తింపు కార్డులో ప్రయాణికురాలి ఫొటో, అడ్రస్ స్పష్టంగా కనిపించాలని సూచించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు జారీ చేసే ఏ ఒరిజినల్ ఐడీ కార్డైన ఈ పథకానికి వర్తిస్తుందన్నారు. అయితే పాన్ కార్డులో అడ్రస్ లేనందున అది ఉచిత ప్రయాణానికి చెల్లుబాటు కాదని టీఎస్ ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. ఒరిజినల్ గుర్తింపు కార్డులు చూపించాలని ఎన్నిసార్లు చెబుతున్నా.. ఇప్పటికీ కొందరు స్మార్ట్ ఫోన్లు, ఫొటో కాపీలు, కలర్ జిరాక్స్ కాపీలు చూపిస్తున్నట్లు టీఎస్ ఆర్టీసీ యాజమాన్యం దృష్టికి వచ్చింది. దీని కారణంగా సిబ్బంది ఇబ్బందులు పడుతుండడంతోపాటు ప్రయాణ సమయం కూడా పెరుగు తున్నది. దీంతో ఇతర ప్రయాణికులకు అసౌకర్యం కలు గుతోంది. మహిళా ప్రయాణికులందరూ ఒరిజనల్ గుర్తింపు కార్డును చూపించి జీరో టికెట్ ను పొందాలని ఆర్టీసీ తెలిపింది. ఒరిజినల్ గు ర్తింపు కార్డు లేకుంటే ఖచ్చితంగా డబ్బు చెల్లించి టికెట్ తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. మహాలక్ష్మి పథకం తెలంగాణ ప్రాంత మహిళలకు మాత్రమే వర్తిస్తుం దని పేర్కొంది. ఇతర రాష్ట్రాల మహిళలు ఛార్జీలు చెల్లించి టికెట్ తీసుకుని సహకరించాలని టీఎస్ఆర్టీసీ కోరింది.
జీరో టికెట్ ఉండాల్సిందే..
” ఉచిత ప్రయాణమే కదా.. జీరో టికెట్ ఎందుకు తీసుకోవడం.. అని కొందరు సిబ్బందితో వాగ్వాదాలు చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. జీరో టికెట్ల జారీ ఆధారంగానే ఆ డబ్బును ఆర్టీసీ సంస్థకు ప్రభుత్వం రీయింబర్స్మెంట్ చేస్తుంది. జీరో టికెట్ లేకుండా ప్రయాణిస్తే, సంస్థకు నష్టం వాటిల్లుతుంది. కాబట్టి ప్రతీ మహిళా ప్రయాణికురాలు జీరో టికెట్ను తీసుకోవాలి. ఒక వేళ టికెట్ తీసుకోకుండా ప్రయాణిస్తే.. అది చెకింగ్ సమయంలో గుర్తిస్తే సిబ్బంది ఉద్యోగం భవితవ్యం ప్రమాదంలో పడుతుంది. అలాగే సదరు వ్యక్తికి రూ.500 జరిమానా విధించే చాన్స్ ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతీక్కరూ తప్పనిసరిగా టికెట్ తీసుకుని సహకరించాలని కోరుతున్నాం” – టీఎస్ఆర్టీసీ
సంక్రాంతికి ప్రత్యేక బస్సులు
సంక్రాంతి పండుగ సందర్భంగా సొంత ఊళ్లకు వెళ్లే ప్రజల కోసం టీఎస్ ఆర్టీసీ ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తోంది. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు 4,484 ప్రత్యేక బస్సులను నడుపనుంది. అందులో 626 సర్వీస్ లకు ముందస్తు రిజర్వేషన్ ఫెసిలిటీ కల్పించింది. ఈనెల 15 వరకు ఈ ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయి. మహాలక్ష్మి పథకం నేపథ్యంలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా సంక్రాంతి పండుగకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని సంస్థ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. హైదరాబాద్ లో రద్దీగా ఉండే ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఆరాంఘర్, ఎల్బీనగర్ క్రాస్ రోడ్స్, కేపీహెచ్బీ, బోయిన్పల్లి, గచ్చిబౌలి ఏరియాల్లో ప్రత్యేక బస్సులను నడుపుతున్నామని ఆయన చెప్పారు.
న్యూస్ అప్ డేట్స్ కోసం వాట్సప్ చానల్ లో చేరండి
ఆయా ప్రాంతాల్లో ప్రయాణికుల కోసం షామియానాలు, పండల్స్, కుర్చీలు, ప్రజా సమాచార వ్యవస్థ, తాగునీటి వసతి, మొబైల్ టాయిలెట్లను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రతీ రద్దీ ప్రాంతం వద్ద ఇద్దరు డీవీఎం ర్యాంక్ అధికారుల ను ఇన్ ఛార్జ్ లు గా నియమించామన్నారు. అలాగే రద్దీకి తగినట్లుగా ప్రత్యేక బస్సులను ఇన్ ఛార్జ్ లు అందుబాటులో ఉంచుతారని వివరించారు. సంక్రాంతికి ఆంధ్రప్రదేశ్ లోని వివిధ ప్రాంతాలకు ప్రత్యేక బస్సులను టీఎస్ ఆర్టీసీ నడుపుతోందని, ఏపీ కి షెడ్యూల్ సర్వీసులు యథావిధిగా నడుస్తాయని సజ్జనార్ స్పష్టం చేశారు. సంక్రాంతికి బస్సు టికెట్ ధరల పెంపు ఉండబోదని, గతంలో మాదిరిగా నే సాధారణ ఛార్జీలతోనే ప్రత్యేక బస్సు సర్వీస్లను నడుపుతున్నట్లు తెలి పారు. సంక్రాంతికి నడిపే పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డిన రీ, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లోనూ మహిళల కు ఉచిత బస్సు సదుపా యం అమలులో ఉంటుందని స్పష్టం చేశారు. మహిళలు విధిగా జీరో టికెట్లను తీసుకొని ప్రయాణించాలని సజ్జనార్ సూచించారు.
ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..