నేటి నుంచి శనివారం వరకు నాంపల్లి సమీపంలో ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్: నాంపల్లిలోని నుమాయిష్ గ్రౌండ్స్లో గురువారం సాయంత్రం 6 గంటల నుంచి శనివారం అర్ధరాత్రి వరకు చేప ప్రసాదం (chepa mandu) పంపిణీ సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు.
MJ మార్కెట్ నుండి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వైపు వచ్చే ట్రాఫిక్ను అవసరాన్ని బట్టి GPO అబిడ్స్ -నాంపల్లి స్టేషన్ రోడ్డు వైపు మళ్లిస్తారు. MJ బ్రిడ్జి, బేగంబజార్ ఛత్రి నుంచి నాంపల్లి వైపు వెళ్లే ట్రాఫిక్ను అలస్కా వద్ద దారుసలాం, ఏక్ మినార్ తదితర ప్రాంతాలకు అవసరమైన ప్రాతిపదికన మళ్లిస్తారు. పిసిఆర్ జంక్షన్ నుండి నాంపల్లి వైపు వెళ్లే వాహనాలను ఎఆర్ పెట్రోల్ పంప్ వద్ద బిజెఆర్ విగ్రహం వైపు అవసరాన్ని బట్టి మళ్లిస్తారు.
నాలుగు చక్రాల వాహనాల (ఫోర్ వీలర్స్) పై నాంపల్లి వైపు నుంచి వచ్చే వారు తమ వాహనాలను గృహ కల్ప, గగన్ విహార్, చంద్ర విహార్ వద్ద పార్క్ చేసి చేప ప్రసాదం chepa mandu కోసం అజంతా గేట్/గేట్ నెం.2 ఎగ్జిబిషన్ గ్రౌండ్ వైపు కాలినడకన వెళ్లాలి. ఎంజే మార్కెట్ నుంచి నాలుగు చక్రాల వాహనాల్లో వచ్చే వారు నాంపల్లిలోని ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బోర్డ్తో పాటు ఎంఏఎం బాలికల జూనియర్ కళాశాలలో తమ వాహనాలను పార్క్ చేయాలి.
MJ మార్కెట్ నుండి బస్సులు/వ్యాన్లలో వచ్చే వ్యక్తులు గాంధీ భవన్ బస్టాప్లో దిగాలి. నాంపల్లి నుండి వచ్చే బస్సులు/వ్యాన్లు గృహ కల్ప బస్టాప్లో దిగి, చేప ప్రసాదం కోసం అజంతా గేట్/గేట్ నెం.2 ఎగ్జిబిషన్ గ్రౌండ్ వైపు కాలినడకన వెళ్లాలి .
ఎంజే మార్కెట్ నుంచి ద్విచక్ర వాహనాలపై వచ్చే వారు తమ వాహనాలను భీమ్రావ్ బడా పార్కింగ్ ఏరియాలో పార్క్ చేయాలి. నాంపల్లి నుండి ద్విచక్ర వాహనదారులు వాహనాలను ప్రధాన రహదారికి ఎడమ వైపున పార్క్ చేయాలి / గృహ కల్ప నుండి బిజెపి కార్యాలయానికి మధ్య ద్విచక్ర వాహనాలకు కేటాయించారు.
Electric Vehicles అప్డేట్ల కోసం హరితమిత్రను చూస్తూ ఉండండి, తాజా తెలుగు వార్తల కోసం మా వందేభారత్ వెబ్ సైట్,
టెక్ వార్తల కోసం టెక్ ఈనాడును సందర్శించండి