Posted in

Sikkim flash floods : సిక్కింలో వరద బీభత్సం.. 23 మంది. ఆర్మీ జవాన్లు గల్లంతు.. కొట్టుకుపోయిన రోడ్లు, వంతెనలు

Sikkim flash floods
Spread the love

Sikkim flash floods : ఈశాన్య రాష్ట్రమైన సిక్కింలో ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. 23 మంది ఆర్మీ జవాన్లు గల్లంతయ్యారు. అనేక చోట్ల రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి. ఉత్తర సిక్కింలో భారీ వర్షాలతో తీస్తా నది నీటి మట్టం ఒక్కసారిగా పెరిగి ఆకస్మిక వరదలు సంభవించాయి. వరద నీటిలో కొట్టుకుపోవడంతో 23 మంది ఆర్మీ సిబ్బంది గల్లంతైనట్లు సమాచారం. బుధవారం రాత్రి సిక్కింలోని లాచెన్ లోయలో తీస్తా నదిలో ఆకస్మిక వరద రావడంతో 23 మంది ఆర్మీ సిబ్బంది గల్లంతైనట్లు అధికారులు తెలిపారు.

ఉత్తర సిక్కింలోని లొనాక్ సరస్సు ప్రాంతంలో అకస్మాత్తుగా కుండపోత వర్షాలు కురవడంతో ఈ వరద ఏర్పడింది, దీని కారణంగా తీస్తాలో నీటి మట్టాలు అకస్మాత్తుగా పెరిగాయి. చుంగ్తాంగ్ డ్యామ్ నుంచి నీటిని విడుదల చేయడం వల్ల పరిస్థితి మరింత తీవ్రమైంది. దీనివల్ల దిగువకు 15-20 అడుగుల ఎత్తు వరకు నీటి మట్టం పెరిగింది.

సింగ్టామ్ సమీపంలోని బర్దంగ్ వద్ద పార్క్ చేసిన ఆర్మీ వాహనాలు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి. గల్లంతైన సిబ్బంది ఆచూకీ కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఆకస్మిక వరద లాచెన్ లోయ వెంబడి ఉన్న అనేక ఆర్మీ స్థావరాలకు కూడా నష్టం కలిగించింది. పూర్తి స్థాయిలో నష్టాన్ని అంచనా వేసేందుకు యత్నాలు జరుగుతున్నాయి.

నది పొంగి ప్రవహించడంతో తీస్తా నదిపై ఉన్న సింథమ్ ఫుట్ బ్రిడ్జి కూలిపోయింది. పశ్చిమ బెంగాల్‌లోని జల్‌పైగురి అధికారులు ముందుజాగ్రత్త చర్యగా నది దిగువ పరీవాహక ప్రాంతం నుండి ప్రజలను తరలించడం ప్రారంభించారు. సిక్కిం ప్రభుత్వం రాష్ట్రంలో హై అలర్ట్ ప్రకటించింది. తీస్తా నదికి దూరంగా ఉండాలని ప్రజలను కోరింది.


Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో, WhatsApp లోనూ సంప్రదించవచ్చు.

Whatsapp

కిర‌ణ్ పొడిశెట్టి వందేభారత్ లో కొన్నేళ్లుగా న్యూస్ కంటెంట్ ప్రొవైడ్ గా ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ముఖ్యంగా జాతీయం, అంత‌ర్జాతీయ అంశాల‌తోపాటు టెక్నాల‌జీ, లైఫ్‌స్టైల్‌ కు సంబంధించిన తాజా వార్తల‌ను అందిస్తుంటారు. జర్నలిజంలో ఆయ‌న‌కు 17 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి, సాక్షి స‌హా వివిధ ప్ర‌ముఖ‌ ప‌త్రిక‌ల్లో సీనియ‌ర్‌ స‌బ్ఎడిట‌ర్‌గా ప‌నిచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *