Home Crime Shimla Mosque | హిందువుల నిరసనల తర్వాత సిమ్లాలో మసీదు అక్రమ నిర్మాణాల కూల్చివేతలు షురూ..

Shimla Mosque | హిందువుల నిరసనల తర్వాత సిమ్లాలో మసీదు అక్రమ నిర్మాణాల కూల్చివేతలు షురూ..

0
7
Shimla Mosque
Shimla Mosque
Spread the love

Himachal Pradesh | హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలోని సంజౌలి ప్రాంతంలో గత నెలలో హిందూ సమాజంలో తీవ్ర ఆగ్రహానికి కారణమైన మసీదు (Shimla Mosque ) కు సంబంధించిన‌ అనధికార అంతస్తులను మునిసిపల్ కమీషనర్ ఆదేశాల ఆధారంగా కూల్చివేసింది. అక్టోబర్ 16 ఆర్డర్ తర్వాత సోమవారం (అక్టోబర్ 21) కూల్చివేత ప్రారంభమైంది. సంజౌలీ మసీదు కమిటీ కూల్చివేత కోసం హిమాచల్ ప్రదేశ్ వక్ఫ్ బోర్డు నుంచి అనుమతి కోరింది. అనుమతి పొందిన తర్వాత, కమిటీ కూల్చివేతను ప్రారంభించింది, దీనికి కమిటీ స్వయంగా నిధులు సమకూరుస్తుందని ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వర్గాలు తెలిపాయి.

కూల్చివేతకు వక్ఫ్ బోర్డు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చిందని సంజౌలీ మసీదు (Shimla Mosque ) కమిటీ అధ్యక్షుడు ముహమ్మద్ లతీఫ్ ధృవీకరించారు. బ‌య‌టి నుంచి ఆర్థిక సహాయం లేకుండానే కమిటీ ఖర్చులను భరిస్తోందని, కూల్చివేత పూర్తి కావడానికి రెండు నెలలు పట్టవచ్చని ఆయన పేర్కొన్నారు. కమిటీ తమ ప్రణాళిక గురించి జిల్లా పరిపాలన, పోలీసు సూపరింటెండెంట్ మరియు సిమ్లా మున్సిపల్ కార్పొరేషన్‌కు తెలియజేసింది. సెప్టెంబరు 12న, కమిటీకి చెందిన ప్రతినిధి బృందం అనధికార అంతస్తులను స్వచ్ఛందంగా కూల్చివేయడానికి ప్రాతినిధ్య ప్రతిపాదనను సమర్పించిందని లతీఫ్ పేర్కొన్నారు.

వివాదాస్పద మసీదులోని మూడు అనధికార అంతస్తులను కూల్చివేయాలని సిమ్లా మున్సిపల్ కమిషనర్ అక్టోబర్ 5న ఆదేశించారు. ఈ మసీదు మొదట్లో ఒకే అంతస్థుల భవనంగా ఉంది. అయితే వక్ఫ్ బోర్డు ఈ భూమిపై యాజమాన్యం ఉందని పేర్కొంంది. కానీ సరైన అనుమతులు లేకుండా ఐదు అంతస్తులు నిర్మించారు.

ఈ క్రమంలో మసీదులోని మూడు అక్రమ అంతస్తులను లక్ష్యంగా చేసుకుని సిమ్లా మున్సిపల్ కమిషనర్ అక్టోబర్ 5న కూల్చివేయాలని ఆదేశించారు. వక్ఫ్ బోర్డు భూమి తమదేనని వాదించగా, స్థానికులు దీనిని వ్యతిరేకించారు. ఈ భూమి రాష్ట్ర రెవెన్యూ శాఖకు చెందినదని, మసీదు విస్తరణ వ‌ల్ల‌ తమకు ఇబ్బందులు ఎదురువుతున్నాయ‌ని పేర్కొన్నారు. గత నెలలో సిమ్లాలో హిందూ సంఘాలు, స్థానికులు భారీ ఆందోళ‌న‌లు చేప‌ట్టారు. మసీదును కూల్చివేయాలని డిమాండ్ చేశారు. నిరసనకారులు, “జై శ్రీరామ్” మరియు “హిందూ ఏక్తా జిందాబాద్” వంటి నినాదాలు చేస్తూ మసీదు వైపు కవాతు చేశారు, పోలీసు బారికేడ్లను ఛేదించి, లాఠీ ఛార్జ్ చేయ‌గా ఈ ఘర్షణలో దాదాపు 10 మంది గాయపడ్డారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి.  అలాగే మా  గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్)ఫేస్ బుక్,  వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

🇮🇳 జాతీయ ప్రయోజనాలే పరమావధిగా.. 🇮🇳

వందేభారత్ డిజిటల్ సైన్యంలో చేరండి!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here