Trending News

ఆ నగరంలో ఆటో డ్రైవర్లు తమ ప్రయాణికులకు 30శాతం డిస్సౌంట్ ఇస్తున్నారు. ఎందుకో తెలుసా..

Spread the love

గుజరాత్‌లోని సూరత్‌లోని సుమారు 1,000 మంది ఆటో-రిక్షా డ్రైవర్లు ఆదివారం  తమ వినియోగదారులకు డిస్కౌంట్ ఆఫర్ ను అందిస్తున్నారు. ఆటో రిక్షా డ్రైవర్ల ఈ ఉదారతకు కృతజ్ఞతలు తెలిపిన గుజరాత్ ఎమ్మెల్యే పూర్ణేష్ మోడీ  మాట్లాడుతూ.. సూరత్ లో  “1,000 మంది ఆటో-రిక్షా డ్రైవర్లు ప్రధాని మోదీ పుట్టినరోజు (Pm Modi Birthday)న 30 శాతం తగ్గింపును ప్రకటించారు. అలాగే ప్రధాని మోదీ 73వ పుట్టినరోజున 73 మంది ఆటో-రిక్షా డ్రైవర్లు 100 శాతం తగ్గింపును అందిస్తున్నసందర్భంగా వారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను” అని బీజేపీ నేత అన్నారు. auto-drivers discounts to passengers

వెయ్యి మంది డ్రైవర్లు 30 శాతం తగ్గింపుతో పాటు, 73 మంది ఆటో-రిక్షా డ్రైవర్లు 100 శాతం తగ్గింపును అందించి మోదీపై తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఫలితంగా ఈ రోజు వారి ప్రయాణికులకు ఉచిత రైడ్‌లను అందిస్తారు.
ప్రధానమంత్రి పుట్టినరోజున, బిజెపి ‘సేవా పఖ్వారా’ (Sewa Pakhwara) అనే రెండు వారాల కార్యక్రమాన్ని ప్రారంభిస్తుంది, ఈ సందర్భంగా సభ్యులు రక్తదాన శిబిరాలు, స్వచ్ఛత డ్రైవ్‌లు, వైద్య శిబిరాలు వంటి సంక్షేమ కార్యక్రమాలలో పాల్గొంటారు.

ఇదిలా ఉండగా, ప్రధానమంత్రి మోడీ తన పుట్టినరోజున, తన ప్రభుత్వం ప్రతిష్టాత్మక పథకం “PM విశ్వకర్మ” ను ప్రారంభించనున్నారు, ఈ సందర్భంగా కళాకారులు, హస్తకళాకారులు, సంప్రదాయ చేతివృత్తులవారికి రుణసాయం అందించనున్నారు.

🇮🇳 జాతీయ ప్రయోజనాలే పరమావధిగా.. 🇮🇳

వందేభారత్ డిజిటల్ సైన్యంలో చేరండి!

Kiran Podishetty

కిర‌ణ్ పొడిశెట్టి వందేభారత్ లో కొన్నేళ్లుగా న్యూస్ కంటెంట్ ప్రొవైడ్ గా ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ముఖ్యంగా జాతీయం, అంత‌ర్జాతీయ అంశాల‌తోపాటు టెక్నాల‌జీ, లైఫ్‌స్టైల్‌ కు సంబంధించిన తాజా వార్తల‌ను అందిస్తుంటారు. జర్నలిజంలో ఆయ‌న‌కు 17 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి, సాక్షి స‌హా వివిధ ప్ర‌ముఖ‌ ప‌త్రిక‌ల్లో సీనియ‌ర్‌ స‌బ్ఎడిట‌ర్‌గా ప‌నిచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *