వన్ నేషన్, వన్ ఎలక్షన్ బిల్లు ప్రవేశపెట్టిన కేంద్రం.. త్వరలో JPCకి..

Spread the love

New Delhi | పార్లమెంట్‌లో తొలిసారిగా ఇ-ఓటింగ్ తర్వాత ఏకకాల ఎన్నికల(One Nation One Election Bill) కు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లును లోక్‌సభ (Lok Sabha)లో ప్రవేశపెట్టారు. ప్రవేశ తీర్మానం మెజారిటీతో ఆమోదించబడింది. తీర్మానానికి అనుకూలంగా 269 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 198 ఓట్లు పోలయ్యాయి. బిల్లు ఇప్పుడు జేపీసీకి పంపబడుతుంది.

కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ వ‌న్ నేష‌న్‌, వ‌న్ ఎల‌క్ష‌న్ – రాజ్యాంగ సవరణ బిల్లుతోపాటు ఒక సాధారణ బిల్లుల‌ను పెట్టారు. అయితే జ‌మిలి ఎన్నిక‌ల బిల్లు తీవ్ర చర్చకు దారితీసింది. బిల్లును వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. విపక్షాలు ఈ బిల్లును రాజ్యాంగ మౌలిక నిర్మాణానికి విరుద్ధమని దుయ్యబట్టారు. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి మనీష్ తివారీ ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని అభివర్ణించారు. 7వ షెడ్యూల్‌కు మించిన ప్రాథమిక నిర్మాణాన్ని మార్చలేమని, ఈ బిల్లు రాజ్యాంగంపై దాడి అని ఆయన అన్నారు. వెంటనే బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అలాగే ఇతర ప్రతిపక్షాలు బిల్లు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని ఇదే వైఖరిని పునరుద్ఘాటించాయి. ఎస్పీ నేత ధర్మేంద్ర యాదవ్, టీఎంసీకి చెందిన కల్యాణ్ బెనర్జీ, డీఎంకేకు చెందిన టీఆర్ బాలు, ఏఐఎంఐఎంకు చెందిన అసదుద్దీన్ ఒవైసీలు బిల్లును వ్యతిరేకించిన వారిలో ఉన్నారు.

బిల్లును వ్యతిరేకించిన పార్టీలు

మొత్తం 15 పార్టీలు బిల్లును వ్యతిరేకించాయి.
కాంగ్రెస్
TMC
డిఎంకె
శివసేన (UBT)
NCP (SCP)
SP
AIMIM

బిల్లుకు మద్దతు ఇచ్చిన పార్టీలు

మొత్తం 32 పార్టీలు బిల్లుకు మద్దతు ఇచ్చాయి.

  • బీజేపీ
  • టీడీపీ
  • శివసేన
  • YSRCP
  • JDU
  • BRS
  • ఏఐఏడీఎంకే

‘రాష్ట్ర శాసనసభలు కేంద్రం దయతో లేవు’: కళ్యాణ్ బెనర్జీ

కేంద్ర‌ ప్రభుత్వంపై కళ్యాణ్ బెనర్జీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాజ్యాంగం ప్రాథమిక నిర్మాణమైన‌ ఫెడరలిజం లక్షణానికి ఈ బిల్లు వ్యతిరేకమని అన్నారు. రాష్ట్ర శాసనసభలు కేంద్రం దయలో లేవని ఆయన ప్రభుత్వంపై మండిపడ్డారు. అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ, రాజ్యాంగ విరుద్ధమైన బిల్లును నేను వ్యతిరేకిస్తున్నాను. ఈ బిల్లు ప్రాంతీయ పార్టీలను అంతం చేస్తుంది అని అన్నారు.

జేపీసీ డిమాండ్‌ను సమర్థించిన అమిత్ షా

అయితే, టీడీపీ, శివసేన తదితర బీజేపీ మిత్రపక్షాలు జమిలి ఎన్నికల (One Nation One Election Bill) బిల్లుకు మద్దతు పలికాయి. వైఎస్సార్‌సీపీ వంటి పార్టీలు కూడా బిల్లుకు మద్దతు పలికాయి. మరోవైపు బిల్లును జేపీసీకి పంపాలన్న డిమాండ్ కూడా తెరపైకి వచ్చింది. ఈ డిమాండ్లపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందిస్తూ, కేబినెట్‌లో బిల్లు ఆమోదం పొందేందుకు బిల్లును జెపిసికి పంపడానికి పిఎం మోడీ కూడా అంగీక‌రించార‌ని అన్నారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లులు కేబినెట్‌లోకి వచ్చినప్పుడు, దీనిని పార్లమెంట్ జాయింట్ కమిటీకి సూచించాలని ప్రధాని మోదీ అన్నారు. ప్రతి స్థాయిలో దీనిపై సవివరమైన చర్చ జరగాలని ఆయన అన్నారు.

కాగా “ఒక దేశం ఒక ఎన్నికల మొట్టమొదటిసారిగా ఇ-ఓటింగ్, పేపర్ స్లిప్‌ల ఓటింగ్ నిర్వ‌హించారు. బిల్లుకు అనుకూలంగా ఎక్కువ ఓట్టు వ‌చ్చాయి. ఎట్ట‌కేల‌కు బిల్లును చివరకు లోక్‌సభలో ప్రవేశపెట్టారు. కొత్త పార్లమెంటు భవనంలో లోక్‌సభలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ విధానాన్ని ఉపయోగించడం ఇదే తొలిసారి.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి.  అలాగే మా  గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్)ఫేస్ బుక్,  వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

🇮🇳 జాతీయ ప్రయోజనాలే పరమావధిగా.. 🇮🇳

వందేభారత్ డిజిటల్ సైన్యంలో చేరండి!

Leave a Comment

భారతదేశంలోని ప్రసిద్ధి చెందిన శ్రీకృష్ణ దేవాలయాలు ఇవే.. Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది.. మీ ఇంట్లో ఈ చిట్కాలతో జలుబు, దగ్గు ను వదిలించుకోండి..