Home Trending News జనరల్ క్లాస్ రైలు ప్రయాణికులకు శుభవార్త: కొత్త ఎక్స్‌ప్రెస్ రైళ్లలో 10 జనరల్ కోచ్‌లు

జనరల్ క్లాస్ రైలు ప్రయాణికులకు శుభవార్త: కొత్త ఎక్స్‌ప్రెస్ రైళ్లలో 10 జనరల్ కోచ్‌లు

0
17
vande bharat Metro
vande bharat
Spread the love

Indian Railways introducing New Amrit Bharat Express | భారతీయ రైల్వే 12,000 కంటే ఎక్కువ రైళ్లతో ప్రతిరోజూ మిలియన్ల కొద్దీ ప్రయాణికులకు సేవలు అందిస్తోంది. అయితే కొన్నేళ్లుగా దేశంలోని అన్ని రైల్వేస్టేష‌న్ల‌ (railway stations)ను ఆధునికీక‌రించ‌డ‌మే కాకుండా ప్ర‌యాణికుల‌కు మెరుగైన సౌక‌ర్యాలు క‌ల్పిస్తోంది. మ‌రోవైపు కొత్త రైళ్లను కూడా ప్రవేశపెడుతోంది. గత 10 సంవత్సరాలలో వందే భారత్, తేజస్, హమ్‌సఫర్, అమృత్ భారత్ వంటి అనేక రైళ్లు పట్టాలెక్కాయి. అయితే ఇండియ‌న్‌ రైల్వే ఇప్పుడు పేద మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌యాణికుల కోసం ఎక్కువ దూరం కూర్చొని సౌక‌ర్య‌వంతమైన ప్ర‌యాణం అందించే రైళ్ల‌ను ప్ర‌వేశ‌పెట్టాల‌ని యోచిస్తోంది.

ఎక్స్ ప్రెస్ రైళ్లలో 10 స్లీపర్ , 10 జనరల్ కోచ్‌లు

10 నెలల పాటు అమృత్ భారత్ రైళ్లను ప్యాసింజర్ ఆపరేషన్లలో విజయవంతంగా పరీక్షించిన తర్వాత, మరో 50 రైళ్లను అందుబాటులోకి తీసుకురావాల‌ని నిర్ణయించినట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwini vaishnav) పార్లమెంట్‌కు తెలిపారు. “అమృత్ భారత్ రైలు పేరుతో కొత్త రైలును అభివృద్ధి చేశారు. అమృత్ భారత్ రైలు పూర్తిగా నాన్-ఎసి రైలు.. 22 కోచ్‌లలో 20 ప్రయాణీకుల కోసం, రెండు పార్శిల్స్ కోసం కేటాయించారు. వీటిలో 10 స్లీపర్ కోచ్‌లు, 10 జనరల్ కోచ్‌లు. ఆటోమేటిక్ కప్లర్‌లు, మెరుగైన సీట్లు, ఛార్జింగ్ పాయింట్‌లు, కొత్త టాయిలెట్ డిజైన్‌లతో వస్తున్నాయని తెలిపారు.

అత్యాధునిక సాంకేతికతను కలిగి ఉన్న అమృత్ భారత్ సేవలు, కుదుపులు లేని ప్రయాణం కోసం సెమీ-పర్మనెంట్ కప్లర్‌లు, క్షితిజ సమాంతర స్లైడింగ్ విండోస్, ఫోల్డబుల్ స్నాక్ టేబుల్, బాటిల్ హోల్డర్‌లు, మొబైల్ హోల్డర్‌లు మొదలైన అధునాతన ఫీచర్‌లతో ఈ సంవత్సరం ప్రారంభంలోభారతీయ రైల్వే (IR) ప్రవేశపెట్టింది.

అమృత్ భారత్ రైలులో ఫీచర్లు..

అమృత్ భారత్ రైలు అనేది ఎయిర్ కండిషన్ లేని కోచ్‌లతో కూడిన LHB పుష్-పుల్ రైలు. మెరుగైన యాక్సిలరేషన్ కోసం ఈ రైలు రెండు చివర్లలో లోకోలను కలిగి ఉంటుంది. దీని రన్నింగ్ మెకానిజం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ మాదిరిగానే ఉంటుంది. అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రయాణీకులకు అందమైన, ఆకర్షణీయమైన సీట్లు, మెరుగైన లగేజీ రాక్‌లు, తగిన మొబైల్ హోల్డర్‌లతో కూడిన మొబైల్ ఛార్జింగ్ పాయింట్‌లు, LED లైట్లు, CCTV, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ వంటి మెరుగైన సౌకర్యాలను అందిస్తుంది.

ప్రస్తుతం నాలుగు అమృత్ భారత్ రైళ్లు సర్వీసులో ఉన్నాయి. అవి

  • 15557/58 దర్భంగా–ఆనంద్ విహార్ (టి) ఎక్స్‌ప్రెస్
  • 13433/13434 మాల్దా టౌన్ – సర్ ఎం.విశ్వేశ్వరయ్య టెర్మినస్ (బెంగళూరు) ఎక్స్‌ప్రెస్.

ఢిల్లీ ( new delhi railways station ) నుండి దర్భంగా వంటి సుదూర మార్గాలలో నడిచే సాధారణ ఎక్స్‌ప్రెస్ రైలుకు జనరల్ క్లాస్ ప్రయాణికులకు రెండు నుంచి మూడు కోచ్‌లు అందుబాటులో ఉంటాయి. అయితే, అమృత్ భారత్ రైళ్లతో, ఒక్కో రైలుకు 10 జనరల్ క్లాస్ కోచ్‌లు, 10 స్లీపర్ కోచ్‌లు ఉన్నాయి.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి.  అలాగే మా  గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్)ఫేస్ బుక్,  వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

🇮🇳 జాతీయ ప్రయోజనాలే పరమావధిగా.. 🇮🇳

వందేభారత్ డిజిటల్ సైన్యంలో చేరండి!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here