KCR | కాళేశ్వరం కమిషన్ ముందుకు కేసీఆర్‌

Kiran Podishetty

June 11, 2025

Spread the love

Kaleshwaram Commission Inquiry | తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి (BRS) అధ్య‌క్షుడు కల్వ‌కుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) మంగళవారం ఉదయం హైదరాబాద్‌లోని BRK భవన్‌లో PC ఘోష్ కమిషన్ ముందు హాజరయ్యారు.
2014 నుంచి 2023 వరకు రాష్ట్రంలో అధికారంలో ఉన్న BRS ప్రభుత్వానికి కేసీఆర్ మానస పుత్రిక‌గా భావించే కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ (KLIP) నిర్మాణంలో అవకతవకలకు సంబంధించి వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌పై ఈ ప్యానెల్ దర్యాప్తు చేస్తోంది.

కమిషన్ ముందు కేసీఆర్ హాజరవుతన్న నేపథ్యంలో హైదరాబాద్ బీఆర్‌కే భవన్ వ‌ద్ద పెద్ద సంఖ్య‌లో పార్టీ కార్య‌క‌ర్త‌లు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ, “కాళేశ్వరం ప్రాజెక్టులో దాదాపు 100 భాగాలు ఉన్నాయని, ప్రాజెక్టులోని రెండు బ్యారేజీలు కుంగిపోయాయని తెలిపారు. నిజం త్వ‌ర‌లో బయటపడుతుందన్నారు. కాంగ్రెస్ సర్కారు చేస్తున్న ఈ వేధింపులకు తెలంగాణ ప్రజలు సరైన సమయంలో తగిన గుణ‌పాఠం చెబ‌తారు. ఇది కాంగ్రెస్, బీజేపీ చేసిన దుష్ప్రచారం మాత్రమే” అని కేటీఆర్ అన్నారు. 100 జన్మలు ఎత్తినా కూడా రేవంత్ రెడ్డి కేసీఆర్ స్థాయిని చేరుకోలేడు” అని కేటీఆర్‌ అన్నారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి.  అలాగే మా  గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్)ఫేస్ బుక్,  వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

🇮🇳 జాతీయ ప్రయోజనాలే పరమావధిగా.. 🇮🇳

వందేభారత్ డిజిటల్ సైన్యంలో చేరండి!

Leave a Comment