
India-Pakistan ceasefire announced : భారత్, పాక్ మధ్య ఉద్రికత్తల నడుమ కీలక పరిణామం చోటుచేసుకుంది. భారత్ – పాకిస్తాన్ అన్ని సైనిక చర్యలను నిలిపివేయడానికి ఒక అవగాహనకు వచ్చాయి. ఇది ఈరోజు ప్రకారం 17:00 గంటల నుంచి అమలులోకి వస్తుంది. ఈమేరకు భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ (Jaishankar) కాల్పుల విరమణ ఒప్పందాన్ని ధ్రువీకరించారు, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ దృఢమైన వైఖరిని ఆయన పునరుద్ఘాటించారు.
“భారతదేశం అన్ని రూపాల్లో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దృఢమైన రాజీలేని వైఖరిని నిరంతరం కొనసాగిస్తోంది. అది అలాగే కొనసాగుతుంది” అని జైశంకర్ అన్నారు. కాల్పుల విరమణ ఉద్రిక్తతలను తగ్గించే దిశగా ఒక అడుగును సూచిస్తున్నప్పటికీ, న్యూఢిల్లీ తన ఉగ్రవాద వ్యతిరేక విధానంలో అప్రమత్తంగా ఉందని హైలైట్ చేశారు.
India Pakistan Tensions : పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్(POK), పాకిస్తాన్ (Pakistan) పంజాబ్ ప్రావిన్స్లోని కొన్ని ప్రాంతాలలో ఉగ్రవాద మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని భారత సైనిక చర్య “ఆపరేషన్ సిందూర్” నేపథ్యంలో ఈ కాల్పుల విరమణ జరిగింది. ఈ ఆపరేషన్ జైష్-ఎ-మొహమ్మద్, లష్కరే-ఎ-తోయిబా అగ్ర నేతలతో సహా 100 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు సమాచారం. పాకిస్తాన్ ప్రతీకార దాడులతో ప్రతిస్పందించింది, ఫలితంగా రెండు వైపులా ప్రాణనష్టం జరిగింది.
ఈ ప్రకటన వెలువడిన కొద్దిసేపటికే మీడియాతో మాట్లాడిన విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, “పాకిస్తాన్ డీజీఎంఓ ఈ మధ్యాహ్నం 3:35 గంటలకు భారత డీజీఎంఓకు ఫోన్ చేశారు. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6.00 గంటల నుంచి భూమిపై, గాలిలో, సముద్రంలో కాల్పులు, సైనిక చర్యలను ఇరుపక్షాలు నిలిపివేయాలని ఒప్పందం కుదిరింది. దీనిని అమలులోకి తీసుకురావడానికి రెండు వైపులా సూచనలు ఇవ్వబడ్డాయి. మే 12న మధ్యాహ్నం 12.00 గంటలకు మళ్లీ చర్చలు ఉంటాయి.” అని అన్నారు.
ఇదిలా ఉండగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం వహించినందుకు క్రెడిట్ పొందారు. కాల్పుల విరమణ (India Pakistan Ceasefire,) ను మధ్యవర్తిత్వం చేయడంలో అమెరికా దౌత్య ప్రయత్నాలు కీలకమైనవని పేర్కొన్నారు. “అమెరికా మధ్యవర్తిత్వం వహించిన సుదీర్ఘ రాత్రి చర్చల తర్వాత, భారతదేశం, పాకిస్తాన్ తక్షణ ఒప్పందం కుదుర్చుకున్నాయని ప్రకటించడానికి నేను సంతోషంగా ఉన్నాను. రెండు దేశాలకు అభినందనలు.” అని పేర్కొన్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.