Friday, April 17, 2026
National

సికింద్రాబాద్ నుంచి మరో  భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్

Spread the love

మాతా వైష్ణో దేవి కి ప్రత్యేక రైలును ప్రవేశపెట్టిన దక్షిణ మధ్య రైల్వే

హైదరాబాద్: భారత్ గౌరవ్ రైలుకు ప్రయాణికుల నుంచి పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తుండడంతో దక్షిణ మధ్య రైల్వే (SCR) ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) తాజాగా  మాతా వైష్ణో దేవి, హరిద్వార్, రిషికేశ్  దర్శనం కోసం పర్యాటక ప్యాకేజీని ప్రకటించింది.

కొత్త  భారత్ గౌరవ్ రైలు (bharat gaurav tourist train) సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలలో స్టాప్‌లతో ఉత్తర భారతదేశంలోని ముఖ్యమైన  చారిత్రక ప్రదేశాలను కవర్ చేస్తుంది . 8 రాత్రులు, 9 రోజుల ప్యాకేజీ వైష్ణో దేవి ఆలయ దర్శన ఏర్పాటును కూడా కవర్ చేస్తుంది. అయితే, కటారా నుంచి ఆలయానికి పోనీ లేదా డోలీ లేదా హెలికాప్టర్ సర్వీస్ ద్వారా వెళ్లాలనుకునే పర్యాటకులు వారి స్వంతంగా బుక్ చేసుకోవాలి.
ఈ రైలు ద్వారా ప్రయాణికులకు వసతి, ఆహారం వంటి ఏర్పాట్లు చేసుకోవడంలో ఇబ్బందులను  తొలగిస్తుంది.

మరిన్ని వివరాల కోసం IRCTC వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు: http://www.irctctourism.com లేదా సంప్రదించండి – 9701360701 లేదా 8287932228 లేదా 9110712752 ఫోన్ నంబర్లకు కాల్ చేయవచ్చు.

హరిద్వార్, రిషికేష్‌తో మాతా వైష్ణోదేవి – bharat gaurav tourist train

పర్యటన ప్రయాణం – సికింద్రాబాద్ – ఆగ్రా – మధుర – బృందావన్ – కత్రా (వైష్ణోదేవి) – హరిద్వార్ – రిషికేశ్ – సికింద్రాబాద్.
పర్యటన తేదీ – జూన్ 10 మధ్యాహ్నం 12 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి
వ్యవధి – 8 రాత్రులు/9 రోజులు (జూన్ 10 నుండి 18 వరకు)

బోర్డింగ్ / డి బోర్డింగ్ స్టేషన్లు – సికింద్రాబాద్, కాజీపేట్, పెద్దపల్లి, రామగుండం, సిర్పుర్కాగజ్ నగర్, బల్హర్షా, వార్ధా, నాగ్పూర్.

ఒక్కరికి ధర (GSTతో సహా):

– ఎకానమీ కేటగిరీ (SL): రూ. 15,435.
– స్టాండర్డ్ కేటగిరీ (3AC): రూ. 24,735.
– కంఫర్ట్ కేటగిరీ (2AC): రూ. 32,480.


Electric Vehicles అప్‌డేట్‌ల కోసం హరితమిత్రను చూస్తూ ఉండండి, తాజా తెలుగు వార్తల కోసం మా వందేభారత్ వెబ్ సైట్,

టెక్ వార్తల కోసం టెక్ ఈనాడును సందర్శించండి

🇮🇳 జాతీయ ప్రయోజనాలే పరమావధిగా.. 🇮🇳

వందేభారత్ డిజిటల్ సైన్యంలో చేరండి!

Kiran Podishetty

కిర‌ణ్ పొడిశెట్టి వందేభారత్ లో కొన్నేళ్లుగా న్యూస్ కంటెంట్ ప్రొవైడ్ గా ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ముఖ్యంగా జాతీయం, అంత‌ర్జాతీయ అంశాల‌తోపాటు టెక్నాల‌జీ, లైఫ్‌స్టైల్‌ కు సంబంధించిన తాజా వార్తల‌ను అందిస్తుంటారు. జర్నలిజంలో ఆయ‌న‌కు 17 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి, సాక్షి స‌హా వివిధ ప్ర‌ముఖ‌ ప‌త్రిక‌ల్లో సీనియ‌ర్‌ స‌బ్ఎడిట‌ర్‌గా ప‌నిచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *