Home National మహిళ ఘాతుకం.. నిద్రపోనివ్వకుండా ఏడ్చినందుకు రెండేళ్ల గొంతుకోసి చంపిన అత్త

మహిళ ఘాతుకం.. నిద్రపోనివ్వకుండా ఏడ్చినందుకు రెండేళ్ల గొంతుకోసి చంపిన అత్త

0
3
Madhya Pradesh
Spread the love

Madhya Pradesh : మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ నగరంలో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళ తనను నిద్రపోనీయకుండా ఏకధాటిగా ఏడుస్తోందని విసుగు చెంది.. తన రెండేళ్ల మేనకోడలిని కొట్టింది. అంతటితో ఆగకుండా పసిపాప గొంతుకోసి చంపింది.
ఈ సంఘటన మధ్యప్రదేశ్ (Madhya Pradesh) జబల్ పూర్ నగరంలోని హనుమంతల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీవ్ నగర్ ప్రాంతంలో సోమవారం జరిగింది. పోలీసులు నిందితురాలిని అరెస్టు చేసినట్లు మంగళవారం తెలిపారు.
బాధితుడు మహ్మద్ షకీల్ కుమార్తె మధ్యాహ్నం నుంచి కనిపించకుండా పోయిందని హనుమంతల్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ ఎం ద్వివేది తెలిపారు. కుటుంబ సభ్యులు బాలిక కోసం వెతికినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులను ఆశ్రయించారని తెలిపారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా తప్పిపోయిన బాలిక గురించి ఎలాంటి క్లూ లభించలేదని ద్వివేది తెలిపారు.

తరువాత, పోలీసులు ఆమె తండ్రి ఇంటిలో పసిబిడ్డ కోసం వెతకడం ప్రారంభించగా, సోఫా సెట్ కింద ఆమె మృతదేహాన్ని కనుగొన్నట్లు అతను చెప్పాడు. షకీల్ తన తోబుట్టువులతో కలిసి ఒకే ఇంట్లో నివసిస్తున్నాడు.
సోమవారం మధ్యాహ్నం, చిన్నారి తన అత్త గదికి వెళ్లింది. ఇద్దరూ కలిసి భోజనం చేశారనీ, తర్వాత నిందితురాలు నిద్రకు ఉపక్రమించింది. పాపను తన తల్లి వద్దకు వెళ్లమని చెప్పింది. కానీ ఆ చిన్నారి
గది నుంచి బయటకు వెళ్లకుండా మారం చేయడంతో ఆమె అత్త చెంపపై కొట్టింది. దీంతో బాలిక ఏడుపు ప్రారంభించిందని, దీంతో కోపంతో అత్త గొంతు కోసి హత్య చేసి మృతదేహాన్ని సోఫా సెట్‌లో దాచిపెట్టిందని పోలీసులు తెలిపారు. నిందితురాలిని అరెస్టు చేసి హత్య కేసు నమోదు చేసినట్లు పోలీసు అధికారి తెలిపారు.

Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో, WhatsApp లోనూ సంప్రదించవచ్చు.

🇮🇳 జాతీయ ప్రయోజనాలే పరమావధిగా.. 🇮🇳

వందేభారత్ డిజిటల్ సైన్యంలో చేరండి!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here