Home » Lok Sabha Elections Key contests : మొద‌టి ద‌శ పోలింగ్‌ ప్రారంభం.. 102 సెగ్మెంట్ల‌లో ప్రముఖుల జాబితా ఇదే..
Lok Sabha Elections Key contests

Lok Sabha Elections Key contests : మొద‌టి ద‌శ పోలింగ్‌ ప్రారంభం.. 102 సెగ్మెంట్ల‌లో ప్రముఖుల జాబితా ఇదే..

Spread the love

Lok Sabha Elections Key contests 2024 |  18వ లోక్‌సభ ఎన్నికల 2024 మొదటి దశ ఏప్రిల్ 19న శుక్రవారం న జరగనుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య పండుగలో 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 లోక్‌సభ నియోజకవర్గాల ఓటర్లు పాల్గొంటారు. తమిళనాడులో మొత్తం 39, రాజస్థాన్‌లో 12, ​​ఉత్తరప్రదేశ్‌లో 8, మధ్యప్రదేశ్‌లో 6, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, అస్సాంలలో ఒక్కొక్కటి 5, బీహార్‌లో 4, పశ్చిమ బెంగాల్‌లో 3, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, మణిపూర్‌లో 2 చొప్పున‌, త్రిపుర, ఛత్తీస్‌గఢ్, పుదుచ్చేరి, అండమాన్, నికోబార్ దీవులు, లక్షద్వీప్, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం, జమ్మూ కాశ్మీర్‌లలో ఒక్కో స్థానానికి ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. అన్ని సీట్ల ఫలితాలు జూన్ 4న వెల్లడికానున్నాయి.

తమిళనాడులో..

Lok Sabha Elections Key contests | తొలి దశ ఎన్నికల పోరులో పలువురు కీలక అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అందులో ముఖ్యంగా తమిళనాడులో ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) దయానిధి మారన్, టీఆర్ బాలు, ఎ.రాజా, కనిమొళి కరుణానిధి, కాంగ్రెస్ అభ్యర్థులు మాణికం ఠాగూర్, కార్తీ పి. చిదంబరం, ఎస్ జోతిమణి, విజయ్ వసంత్ ఎన్నికల బరిలో ఉన్నారు. భారతీయ జనతా పార్టీ (బిజెపి) నుంచి కె అన్నామలై, ఎల్.మురుగన్, తమిళిసై సౌందరరాజన్, టిఆర్ పారీవేందర్, పొన్ రాధాకృష్ణన్, నైనార్ నాగేంద్రన్ కూడా దక్షిణాది రాష్ట్రం నుంచి కాషాయ పార్టీ నుంచి బ‌రిలో ఉన్నారు. కాగా 2019లో తమిళనాడు నుంచి బీజేపీ ఒక్క సీటు కూడా పొందలేకపోయింది. ఇతర ముఖ్యమైన అభ్యర్థులలో టీటీవీ దినకరన్ (AMMK), ఓ పన్నీర్ సెల్వం (స్వతంత్ర), K కృష్ణసామి (AIADMK), J జయవర్ధన్ (AIADMK), దురై వైకో (MDMK), తోల్ తిరుమావళవన్ (VCK) ఉన్నారు.

READ MORE  Congress | అయోధ్యకు వెళ్లినందుకు వేధించారు. అందుకే కాంగ్రెస్ కు రాజీనామా చేశా..

రాజస్థాన్ లో..

రాజస్థాన్‌లో బీజేపీకి చెందిన అర్జున్ రామ్ మేఘవాల్, రావ్ రాజేంద్ర సింగ్, రాంస్వరూప్ కోలీ, దేవేంద్ర ఝఝరియా, జ్యోతి మిర్ధా వంటి కీలక అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ నుంచి గోవింద్ రామ్ మేఘ్వాల్, రాహుల్ కస్వాన్, బ్రిజేంద్ర సింగ్ ఓలా, ప్రతాప్ సింగ్ ఖచరియావాస్ ఉన్నారు. రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్ పార్టీ (ఆర్‌ఎల్‌పి) హనుమాన్ బేనివాల్ కూడా పోటీలో ఉన్నారు.

ఉత్తరప్రదేశ్ లో..

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ఏప్రిల్ 19న సహరాన్‌పూర్, ముజఫర్‌నగర్, రాంపూర్, మొరాదాబాద్‌తో సహా 8 స్థానాలతో మొదటి దశలో పోలింగ్ జ‌ర‌గ‌నుంది. ఇక్క‌డ‌ సంజీవ్ బల్యాన్ (బిజెపి), హరేంద్ర సింగ్ మాలిక్ (ఎస్‌పి), ఇమ్రాన్ మసూద్ (ఎస్‌పి), రుచి వీర (ఎస్పీ), జితిన్ ప్రసాద (బీజేపీ), చంద్ర శేఖర్ ఆజాద్ (ఏఎస్పీ-కేఆర్) కీలక అభ్యర్థులు బ‌రిలో నిలిచారు. ఇక మధ్యప్రదేశ్‌లో బీజేపీకి చెందిన ఫగ్గన్ సింగ్ కులస్తే, హిమాద్రి సింగ్, కాంగ్రెస్ పార్టీకి చెందిన నకుల్ నాథ్, కమలేశ్వర్ పటేల్‌లు లోక్‌సభలో అడుగుపెట్టేందుకు ప్రయత్నిస్తున్న ముఖ్యమైన అభ్యర్థులు.

READ MORE  PM Modi Tour | నా హయాంలో సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయి.. ఎయిర్ స్ట్రైక్స్ కూడా జరుగుతాయి..

మహారాష్ట్రలో..

మహారాష్ట్ర‌లో లోక్‌సభ ఎన్నికల తొలి దశలో నితిన్ గడ్కరీ (బిజెపి), సుధీర్ ముంగంటివార్ (బిజెపి), ప్రతిభా సురేష్ ధనోర్కర్ (కాంగ్రెస్), త్రివేంద్ర సింగ్ రావత్ (బిజెపి), అనిల్ బలూని (బిజెపి), వీరేంద్ర రావత్ (కాంగ్రెస్) ఇతర కీలక అభ్యర్థులు గా ఉన్నారు. వీరితోపాటు రంజిత్ దత్తా (BJP), సర్బానంద సోనోవాల్ (BJP), గౌరవ్ గొగోయ్ (కాంగ్రెస్), జితన్ రామ్ మాంఝీ (HAM), వివేక్ ఠాకూర్ (BJP), శ్రవణ్ కుష్వాహా (RJD), అరుణ్ భారతి (LJP-RV), కిరణ్ రిజిజు (BJP) ), నబమ్ తుకీ (కాంగ్రెస్), నిసిత్ ప్రమాణిక్ (బిజెపి), బిప్లబ్ కుమార్ దేబ్ (బిజెపి), ఆరుముగం నమశ్శివాయం (బిజెపి), అగాథ కె సంగ్మా (ఎన్‌పిపి), చౌదరి లాల్ సింగ్ (కాంగ్రెస్), డాక్టర్ జితేంద్ర సింగ్ (బిజెపి), వి వైతిలింగం (కాంగ్రెస్) మరియు కవాసి లఖ్మా (కాంగ్రెస్).

READ MORE  PM Modi : కాంగ్రెస్ పాలనలో హనుమాన్ చాలీసా వినడం కూడా నేరమే: ప్రధాని మోదీ

102 స్థానాల్లో 2019లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయి.

2019 లోక్‌సభ ఎన్నికల్లో ఈ 102 స్థానాల్లో 48 స్థానాలను (బీజేపీ 40, ఎల్‌జేపీ 2, ఏఐఏడీఎంకే 1, శివసేన 1, ఆర్‌ఎల్‌పీ 1, జేడీయూ 1, ఎన్‌డీపీపీ 1, ఎన్‌పీపీ 1) గెలుచుకుంది. కాంగ్రెస్ నేతృత్వంలోని యుపిఎ 42 స్థానాలు (కాంగ్రెస్ 15, డిఎంకె 24, విసికె 1, ఐయుఎంఎల్ 1, ఎన్‌సిపి 1), ఇతర పార్టీలు 12 స్థానాలు (బిఎస్‌పి 3, ఎస్‌పి 2, సిపిఎం 2, సిపిఐ 2, ఎన్‌పిఎఫ్ 1, ఎంఎన్‌ఎఫ్ 1 మరియు ఎస్‌కెఎమ్‌లు గెలుచుకున్నాయి. 1)


Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
అత్యాధునిక హంగులతో చర్లపల్లి రైల్వే టెర్మినల్ చూశారా? దుర్గదేవి నవరాత్రి ఉత్సవాలు.. తొమ్మిది ఆలయాలు..