Home Trending News High Speed Rail | హైదరాబాద్ నుండి చెన్నై, బెంగళూరుకు కేవలం 2 గంటల్లోనే చేరుకోవచ్చు

High Speed Rail | హైదరాబాద్ నుండి చెన్నై, బెంగళూరుకు కేవలం 2 గంటల్లోనే చేరుకోవచ్చు

0
1
High Speed Rail
High Speed Rail
Spread the love

High Speed Rail | హైదరాబాద్ నుంచి బెంగళూరు (Hyderabad to Bengaluru) లేదా చెన్నైకి కేవలం రెండు గంటల్లోనే చేరుకోవడాన్ని ఒక్కసారి ఊహించుకోండి. దాదాపు విమానంలో ప్రయాణించినంత వేగంగా.. కానీ విమానాశ్రయంలో మాదిరిగా భద్రత చెక్-ఇన్‌ల ఇబ్బంది లేకుండా సాధ్యం అవుతుంది. ప్రతిదీ ప్రణాళిక ప్రకారం జరిగితే, కేంద్రం ప్రతిపాదించిన రెండు హై-స్పీడ్ రైలు కారిడార్ల ద్వారా ఈ అద్భుతం నిజం కానుంది. 320 కి.మీ. వేగంతో నడిచే ఈ హై-స్పీడ్ రైళ్లు రైలు ప్రయాణ సమయాన్ని దాదాపు 10 గంటలు తగ్గిస్తాయి. హైదరాబద్ నుంచి ప్రయాణీకులు బెంగళూరుకు కేవలం 2 గంటల్లో, చెన్నైకి 2 గంటల 20 నిమిషాల్లో చేరుకోగలరు .

High Speed Rail : విమానాల కంటే వేగంగానా?

ప్రస్తుతం, హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి విమానాలు చేరుకోవడానికి 1 గంట 15 నిమిషాలు పడుతుండగా, చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయానికి 1 గంట 20 నిమిషాలు పడుతుంది. కానీ విమానాశ్రయాలకు చేరుకోవడానికి, సెక్యూరిటీ చెక్ పూర్తి చేసుకోవడానికి, ఆ తరువాత నగర కేంద్రాలకు ప్రయాణించడానికి అవసరమైన సమయాన్ని పరిగణనలోకి తీసుకుంటే, మొత్తం ప్రయాణం దాదాపు 2-3 గంటలు పడుతుంది – ఇది దాదాపు హై-స్పీడ్ రైళ్ల మాదిరిగానే ఉంటుంది.

ప్రాజెక్టు ప్రణాళిక

ప్రభుత్వ ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ సంస్థ అయిన RITES లిమిటెడ్, తుది స్థాన సర్వేను నిర్వహించడానికి టెండర్లను ఆహ్వానించింది. ఈ సర్వేలోDPR ను సిద్ధం చేయడం, అలైన్‌మెంట్‌ను రూపొందించడం, ఖర్చులను అంచనా వేయడం, ట్రాఫిక్ సామర్థ్యాన్ని అంచనా వేయడం వంటివి ఉంటాయి. ఈ అంచనాకు సుమారు రూ. 33 కోట్లు వెచ్చిస్తోంది కేంద్ర ప్రభుత్వం.

ఈ ప్రాజెక్టు సర్వే అంచనాకు రూ. 33 కోట్లు అవసరమవుతుంది. రాబోయే రైలు మార్గాలు ప్రత్యేకంగా హై-స్పీడ్ రైళ్లకు సేవలు అందిస్తాయి. ఇవి సాంప్రదాయ రైలు ట్రాక్‌ల ద్వారా వివిధ రైళ్లను సరుకు రవాణా నుంచి వందే భారత్ వరకు ప్రయాణిస్తుంటాయి. ఈ డిజైన్ ముంబై-అహ్మదాబాద్ హై-స్పీడ్ కారిడార్ నమూనా మాదిరిగానే చేపట్టనున్నారు.దీనిని బుల్లెట్ రైలు కార్యకలాపాల కోసం అభివృద్ధి చేస్తున్నారు” అని దక్షిణ మధ్య రైల్వే (SCR) సీనియర్ రైల్వే అధికారి ఒకరు తెలిపారు.

2015లో సాధ్యాసాధ్యాల అధ్యయనాన్ని ప్రారంభించి 2021లో నిర్మాణాన్ని ప్రారంభించిన ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు (Bullet Train) కారిడార్ 2028 నాటికి రూ.1.65 లక్షల కోట్లతో పూర్తవుతుందని అంచనా. హైదరాబాద్ కారిడార్లు కూడా కార్యరూపం దాల్చడానికి సమయం పడుతుందని, రైల్వే అధికారులు కనీసం 15 సంవత్సరాలు పూర్తి చేయాలని అంచనా వేస్తున్నారు.

మల్టీ-ట్రాకింగ్ కోసం ఎలివేటెడ్ ట్రాక్‌లు

నివేదికలో పేర్కొన్న టెండర్ నోటీసు ప్రకారం, ఎంపిక చేయబడిన సంస్థ రెండు కారిడార్ల (Hyderabad to Bengaluru And chennai) లో రిమోట్ సెన్సింగ్ అధ్యయనాలు, భౌగోళిక మ్యాపింగ్, మట్టి, రాతి నమూనాలను సేకరించి పరీక్షలను నిర్వహిస్తుంది. ఈ హై-స్పీడ్ రైలు (High Speed Rail) కారిడార్లు గంటకు 350 కి.మీ. వేగంతో ప్రయాణించేలా రూపొందిస్తారు. కానీ గంటకు 320 కి.మీ. వేగంతో ప్రయాణిస్తాయి. భవిష్యత్తులో మల్టీ-ట్రాకింగ్ కోసం ఎలివేటెడ్ ట్రాక్‌లు ఇప్పటికే ఉన్న బ్రాడ్ గేజ్ రైల్వే కారిడార్‌లతో పాటు నిర్మించనున్నారు.

సమగ్ర అధ్యయనంలో ట్రాఫిక్ విశ్లేషణ, వంతెనలు, సొరంగాలు, భవనాలు, ఇతర నిర్మాణాలను కవర్ చేసే సివిల్ ఇంజనీరింగ్ అసెస్‌మెంట్‌లు, అలాగే ఆర్థిక అంతర్గత రాబడి రేటును నిర్ణయించడానికి వివరణాత్మక ప్రాజెక్ట్ అసెస్‌మెంట్‌లు ఉంటాయని టెండర్ నోటీసు తెలిపింది.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి.  అలాగే మా  గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్)ఫేస్ బుక్,  వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

🇮🇳 జాతీయ ప్రయోజనాలే పరమావధిగా.. 🇮🇳

వందేభారత్ డిజిటల్ సైన్యంలో చేరండి!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here