Friday, May 16Welcome to Vandebhaarath

Hathras stampede : హత్రాస్ తొక్కిసలాటలో 110 మంది మృతి : గ‌తంలో ఇలాంటి విషాద ఘ‌ట‌న‌లు ఎన్నో..

Spread the love

Hathras stampede : ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో మంగళవారం జరిగిన ఒక‌ ఆధ్యాత్మిక కార్యక్రమం సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో మరణించిన వారి సంఖ్య 116 మందికి చేరుకుంది. ఈమేర‌కు అలీగఢ్ రేంజ్ ఐజీ శలభ్ మాథూర్ పీటీఐకి వెల్ల‌డించారు. మరోవైపు, ఈ ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో ఫోన్‌లో మాట్లాడారు. బాధితులకు సహాయ సహకారాలు అందించేందుకు ఎన్డీఆర్ఎఫ్ మెడిల్ టీం హత్రాస్ కు చేరుకుంటుందని హోంమంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు.

కారణాలు ఇవే..

భారతదేశంలో ఆధ్యాత్మిక‌ సమావేశాలు, ఉత్స‌వాలు త‌ర‌చూ జ‌రుగుతుంటాయి. ఇందుకోసం వేలాది మంది భక్తులు హాజ‌రవుతుంటారు. అయితే ఆయా స‌మావేశాల వ‌ద్ద‌ ఎటువంటి క‌నీస‌ సౌకర్యాలు ఉండ‌వు. అత్యవసర పరిస్థితుల్లో వచ్చిపోయేందుకు స‌రైన మార్గాలు ఉండ‌వు. కొన్నిసార్లు, ఈ ఈవెంట్‌ల నిర్వాహకులకు స్థానిక అధికారులతో సరైన కమ్యూనికేషన్ కూడా ఉండదు. ఫ‌లితంగా ఒక్కోసారి దారుణ‌మైన‌ తొక్కిసలాటకు దారితీస్తుంది. దేశ రాజధాని న్యూఢిల్లీకి దాదాపు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌ ( Hathras stampede ) లో మంగళవారం జరిగిన అత్యంత ఘోరమైన తొక్కిసలాట ఘటనలో 116 మంది మరణించారు.

భారతదేశంలో చాలా సంవత్సరాలుగా దేవాలయాలు, ఇతర మతపరమైన సమావేశాల వద్ద తొక్కిసలాటలో పెద్ద సంఖ్యలో ప్రజలు మరణించడం ఇదే మొదటిసారి కాదు. 2005లో మహారాష్ట్రలోని మంధర్‌దేవి ఆలయంలో 340 మందికి పైగా భక్తులు మరణించారు. 2008లో రాజస్థాన్‌లోని చాముండా దేవి ఆలయంలో కనీసం 250 మంది ప్రాణాలు కోల్పోయారు. 2008లో హిమాచల్ ప్రదేశ్‌లోని నైనా దేవి ఆలయంలో జరిగిన ఒక మతపరమైన సభలో జరిగిన తొక్కిసలాటలో 162 మంది ప్రాణాలు కోల్పోయారు.

గతంలో ఇదే తరహాలో జరిగిన విషాదకర ఘటనలు

కుంభమేళా తొక్కిసలాట (1954) : ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్ (ప్రస్తుతం ప్రయాగ్‌రాజ్)లో జరిగిన కుంభమేళా సందర్భంగా చరిత్రలో అత్యంత ఘోరమైన తొక్కిసలాట జరిగింది. గంగా నదిపై ఉన్న ఇరుకైన వంతెనపై యాత్రికులు తొక్కిసలాటలో 800 మందికి పైగా మరణించారు.

మక్కా మసీదు తొక్కిసలాట (2007) : ఆంధ్ర ప్రదేశ్ (ప్రస్తుతం తెలంగాణ)లోని హైదరాబాద్‌లోని చారిత్రాత్మక మక్కా మసీదులో శుక్రవారం ప్రార్థనల సమయంలో తొక్కిసలాట సంభవించి 16 మంది మరణించారు, అనేకమంది గాయపడ్డారు.

మార్చి 31, 2023: ఇండోర్ నగరంలోని ఒక ఆలయంలో రామ నవమి సందర్భంగా జరిగిన ‘హవనం’ కార్యక్రమంలో పురాతన ‘బావడి’ లేదా బావి పైన నిర్మించిన స్లాబ్ కూలిపోవడంతో కనీసం 36 మంది మరణించారు.

జనవరి 1, 2022: జమ్మూ కాశ్మీర్‌లోని ప్రసిద్ధ మాతా వైష్ణో దేవి పుణ్యక్షేత్రంలో భక్తుల రద్దీ కారణంగా జరిగిన తొక్కిసలాటలో కనీసం 12 మంది మరణించారు. డజనుకు పైగా గాయపడ్డారు.

జూలై 14, 2015: ఆంధ్రప్రదేశ్ రాజమండ్రిలో పుష్కరాల ప్రారంభోత్సవం సందర్భంగా గోదావరి నది ఒడ్డున భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చిన ప్రధాన స్నానఘట్టం వద్ద జరిగిన తొక్కిసలాటలో 27 మంది యాత్రికులు మృతి చెందగా, మరో 20 మంది గాయపడ్డారు.

అక్టోబర్ 3, 2014: దసరా ఉత్సవాలు ముగిసిన కొద్దిసేపటికే పాట్నాలోని గాంధీ మైదాన్‌లో జరిగిన తొక్కిసలాటలో 32 మంది మృతి చెందగా, 26 మంది గాయపడ్డారు.

అక్టోబరు 13, 2013: మధ్యప్రదేశ్‌లోని దతియా జిల్లాలోని రతన్‌ఘర్ దేవాలయం సమీపంలో నవరాత్రి ఉత్సవాల సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 115 మంది మరణించారు. 100 మందికి పైగా గాయపడ్డారు. భక్తులు దాటుతున్న నది వంతెన కూలిపోతుందన్న వదంతులతో ఈ తొక్కిసలాట జరిగింది.

నవంబర్ 19, 2012: బీహార్‌ పాట్నాలోని గంగా నది ఒడ్డున ఉన్న అదాలత్ ఘాట్ వద్ద ఛత్ పూజ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో తాత్కాలిక వంతెన లోయ‌లో పడటంతో సుమారు 20 మంది మరణించారు.. అనేక మంది గాయపడ్డారు.

నవంబర్ 8, 2011: హరిద్వార్‌లో గంగా నది ఒడ్డున హర్-కీ-పౌరీ ఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాటలో కనీసం 20 మంది మరణించారు.

జనవరి 14, 2011: కేరళలోని ఇడుక్కి జిల్లాలోని పుల్మేడు వద్ద భక్తులపైకి జీపు దూసుకెళ్లడంతో తొక్కిసలాటలో కనీసం 104 మంది శబరిమల భక్తులు మరణించారు. 40 మందికి పైగా గాయపడ్డారు.

మార్చి 4, 2010: ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్ జిల్లాలో కృపాలు మహారాజ్‌కి చెందిన రామ్ జాంకి ఆలయం వద్ద ప్రజలు ఉచిత బట్టలు, ఆహారాన్ని తీసుకునేందుకు ఎగ‌బ‌డ్డారు. ఆ సమయంలో జరిగిన తొక్కిసలాటలో సుమారు 63 మంది మరణించారు.

సెప్టెంబరు 30, 2008: రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ నగరంలోని చాముండా దేవి ఆలయంలో బాంబు పేలుడు జరుగుతుందనే పుకార్ల కారణంగా తొక్కిసలాటలో దాదాపు 250 మంది భక్తులు మరణించారు. 60 మందికి పైగా గాయపడ్డారు.

ఆగష్టు 3, 2008: హిమాచల్ ప్రదేశ్‌లోని బిలాస్‌పూర్ జిల్లాలోని నైనా దేవి ఆలయం వద్ద రాళ్లు విరిగిపడిన పుకార్ల కారణంగా తొక్కిసలాటలో 162 మంది మరణించారు, 47 మంది గాయపడ్డారు.

జనవరి 25, 2005: మహారాష్ట్రలోని సతారా జిల్లాలోని మంధర్‌దేవి ఆలయంలో వార్షిక తీర్థయాత్రలో 340 మంది భక్తులు తొక్కిసలాటకు గురయ్యారు. వందలాది మంది గాయపడ్డారు. భక్తులు కొబ్బరికాయలు పగులగొట్టడంతో కొంత మంది మెట్లపై జారిపడిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది.

ఆగష్టు 27, 2003: మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో కుంభమేళాలో పవిత్ర స్నాన సమయంలో జరిగిన తొక్కిసలాటలో 39 మంది మరణించారు. దాదాపు 140 మంది గాయపడ్డారు.


Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.
Whatsapp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..