Home National Arvind Kejriwal | కేజ్రీవాల్ లేఖపై బిజెపి కౌంట‌ర్‌.. ఆర్ఎస్ఎస్‌ నుంచి ‘సేవా స్ఫూర్తి’ నేర్చుకోండి

Arvind Kejriwal | కేజ్రీవాల్ లేఖపై బిజెపి కౌంట‌ర్‌.. ఆర్ఎస్ఎస్‌ నుంచి ‘సేవా స్ఫూర్తి’ నేర్చుకోండి

0
7
Arvind Kejriwal
Arvind Kejriwal
Spread the love

New Delhi : ఆద్మీ పార్టీ (AAP) చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) చీఫ్ మోహన్ భగవత్‌కు రాసిన లేఖపై భారతీయ జనతా పార్టీ (బిజెపి) విమర్శించింది, ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు మీడియా దృష్టిని ఆకర్షించడానికి ఆయన ఈ లేఖను ఉపయోగించారని ఆరోపించింది. . కేజ్రీవాల్ (AAP chief Arvind Kejriwal) ఓటరు జాబితా తొలగింపులు చేస్తున్న బీజేపీని మీరు స‌మ‌ర్థిస్తున్నారా అని అంటూ ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కు లేఖ‌రాసిన విష‌యం తెలిసిందే.. దీనిపై తీవ్రంగా స్పందించిన బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సుధాన్షు త్రివేది ఈ లేఖను ‘పబ్లిసిటీ స్టంట్’గా కొట్టిపారేశారు.

సుదాన్షు త్రివేదీ కౌంటర్..

“కేజ్రీవాల్ లేఖ మీడియా దృష్టిని ఆకర్షించే ప్రయత్నం తప్ప మరొకటి కాదు.” అని త్రివేది విలేకరుల సమావేశంలో అన్నారు. ఆరెస్సెస్ సంస్థకు రాయడానికి బదులు తన “రాజకీయ ఎత్తుగడలను” వదిలిపెట్టి.. ఆర్‌ఎస్‌ఎస్ నుంచి “సేవా స్ఫూర్తిని” నేర్చుకోవాలని ఆయ‌న ఆప్ కు సూచించారు. ఆర్‌ఎస్‌ఎస్‌కు అనుబంధంగా ఉన్న సేవాభారతి.. మురికివాడల్లో నివసిస్తున్న దళితులు, ఇత‌ర అన్ని వ‌ర్గాల‌ ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్న అతిపెద్ద సంస్థ అని త్రివేది అన్నారు.

‘రోహింగ్యాలకు సాయం చేశారు’ : బిజెపి

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌(Rashtriya Swayamsevak Sangh chief Mohan Bhagwat) కు రాసిన లేఖలో కేజ్రీవాల్ పలు ప్రశ్నలు లేవనెత్తారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) బిజెపి చేసిన “తప్పులను” సమర్థిస్తుందా అని ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి భగవత్‌ను ప్రశ్నించారు. ఓట్లను కొనుగోలు చేసేందుకు బిజెపి నాయకులు బహిరంగంగా డబ్బు పంచిపెడుతున్నారని, పూర్వాంచలి, దళితుల ఓట్లను ” తొలగించడాన్ని ఆర్‌ఎస్‌ఎస్ సమర్థిస్తుందా అని ఆయన అడిగారు. కాగా ఢిల్లీలో ఉంటున్న అక్రమ రొహింగ్యాలు, బంగ్లాదేశీ వ‌ల‌స‌దారుల‌ను ఎన్నికల్లో ఓటు బ్యాంకుగా ఉపయోగించుకునేందుకు ఆప్, కేజ్రీవాల్ వారికి పత్రాలు, డబ్బు అంద‌జేసి సహాయం చేశారని బీజేపీ ఆరోపించింది.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు 2025

Delhi Assembly Elections 2025 : ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 2025లో జరిగే అవకాశం ఉంది. అయితే భారత ఎన్నికల సంఘం దీనికి సంబంధించిన‌ తేదీలను ఇంకా ప్రకటించలేదు. ఢిల్లీలో వరుసగా 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకు గాను ఆప్ 62 స్థానాలను గెలుచుకోగా, బీజేపీ ఎనిమిదో స్థానాలను కైవసం చేసుకుంది.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి.  అలాగే మా  గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్)ఫేస్ బుక్,  వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

🇮🇳 జాతీయ ప్రయోజనాలే పరమావధిగా.. 🇮🇳

వందేభారత్ డిజిటల్ సైన్యంలో చేరండి!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here