నేడే అమరుల అఖండ జ్యోతి ప్రారంభం

నేడే అమరుల అఖండ జ్యోతి ప్రారంభం

ఉద్యమ స్ఫూర్తి చాటేలా బృహత్తర నిర్మాణం

telangana martyrs memorial : తెలంగాణ కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల స్మారకార్థం రాష్ట్ర ప్రభుత్వం అన్ని తరాలవారు స్మరించుకునేలా బ‌ృహత్తర నిర్మాణం చేపట్టింది. రూ.177.50కోట్లు వెచ్చించిన నిర్మించిన అమరుల అఖండ జ్యోతిని గురువారం సీఎం కేసీఆర్‌ అట్టహాసంగా ప్రారంభించనున్నారు. హైదరాబాద్ నడిబొడ్డున ఓ వైపు హుస్సేన్ సాగర్‌, మరోవైపు డాక్టర్‌ అంబేద్కర్‌ సెక్రటేరియట్‌ మధ్య దీనిని నిర్మించారు.

రూ.177.50 కోట్లు వెచ్చించి జూన్ 22న ప్రారంభోత్సవానికి సిద్ధం చేశారు. ప్రపంచంలోనే అతి పెద్దదైన అతుకులు లేని స్టెయిన్ లెస్ స్టీల్ మెటీరియల్ తో రూపొందించడం దీని ప్రత్యేకత.. 3.29 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ భవనంలో మ్యూజియం, 100 మంది సీటింగ్ సామర్థ్యంతో ఆడియో విజువల్ హాల్, 650 మంది కూర్చునేలా కన్వెన్షన్ సెంటర్, టూరిస్టులకు రెస్టారెంట్, ఇతర సౌకర్యాలు, 350 మందికి పార్కింగ్ సదుపాయాలు ఇందులో ఉన్నాయి. కాగా భవనం నిర్మిత ప్రాంతం 2.88 లక్షల చదరపు అడుగులు. ఒకేసారి హుస్సేన్ సాగర్‌ అందాలు, బుద్ధ విగ్రహం, బిర్లా మందిర్‌, అంబేద్కర్‌ విగ్రహం, సచివాలయం తదితర నిర్మాణాలను వీక్షించేందుకు టెర్రస్ పై అత్యాధునిక రెస్టారెంట్ ను ఏర్పాటు చేశారు. అమరుల స్మారక స్థూపం నిర్మాణ పనులు దాదాపు పూర్తికాగా, ప్రస్తుతం ముగింపు పనులు, ప్రధాన ద్వారం, గ్రీనరీ తదితర పనులు కొనసాగుతున్నాయి.

READ MORE  మరికొద్ది రోజుల్లో తెలంగాణకు మరో వందేభారత్ ఎక్స్ ప్రెస్.. కేవలం 8.30 గంటల్లోనే హైదరాబాద్ నుంచి బెంగళూరుకు..
telangana martyrs memorial
telangana martyrs memorial

ప్రారంభోత్సవ కార్యక్రమాల వివరాలు

  • సాయంత్రం 5.00 గంటలకు అంబేద్కర్ విగ్రహం నుంచి స్మారక చిహ్నం వరకు 6వేల మంది కళాకారుల ప్రదర్శన
  • సాయంత్రం 6.30 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాంగణానికి చేరుకుంటారు.
  • 12 తుపాకులతో అమరవీరులకు నివాళులలర్పించే కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు.
  • తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించాక అమరజ్యోతిని సీఎం ప్రారంభిస్తారు.. ఆ తర్వాత శిఖరాగ్రానికి చేరుకుంటారు.
  • అసెంబ్లీలో అమరవీరులకు నివాళులర్పిస్తూ ప్రముఖ కార్యకర్త, ఎమ్మెల్సీ దేశపతి గీతం ఆలపించనున్నారు.
  • అసెంబ్లీలో కొవ్వొత్తులు వెలిగించి 10 వేల మంది అమరవీరులకు నివాళులర్పిస్తారు. అనంతరం సీఎం ప్రసంగం ఉంటుంది.
  • ఎంపికైన ఆరుగురు అమర వీరుల కుటుంబాలకు నివాళులర్పించారు.
  • 800 డ్రోన్లతో ప్రదర్శన, అమరవీరుల కోసం జోహార్ అనే అక్షరాలతో స్మారక చిహ్నంపై లేజర్ షో నిర్వహిస్తారు.

telangana martyrs memorial అమరులకు గౌరవ సూచకంగా కొవ్వొత్తులు, దీపాలు వెలిగించడం ఆనవాయితీ. చుట్టూ స్టీల్ రింగ్ ఉన్నప్పటికీ భవనం వేడెక్కకుండా దీన్ని తయారుచేశారు. పఫ్ మెటీరియల్, సపోర్టింగ్ జీఆర్సీ షీట్లు లోపల ఉష్ణోగ్రతను నియంత్రిస్తాయి. స్మారక చిహ్నం మెరుగుపెట్టిన ఉబ్బిన వెలుపలి భాగం పశ్చిమ చైనీస్ నగరం కరామేలోని ‘క్లౌడ్ గేట్’ అలాగే చికాగోలోని ‘బీన్’ నిర్మాణాలను పోలి ఉంటుంది. ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో అమరవీరులకు నివాళులర్పించే సంప్రదాయక మట్టి నూనె దీపాన్ని పోలి ఉండడం విశేషం. 161 ఫీట్ల ఎత్తు, 158 ఫీట్ల వెడల్పుతో ‘క్లౌడ్ గేట్’ కంటే 5 నుంచి 6 రెట్లు పెద్దది. ఇంత పెద్ద అతుకులు లేని స్టెయిన్ లెస్ స్టీల్ నిర్మాణం ప్రపంచంలో మరెక్కడా కనిపించదు. హుస్సేన్ సాగర్‌ ఒడ్డున నిర్మించిన 125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుండగా, అమరుల స్మృతి చిహ్నం మరో పర్యాటక కేంద్రంగా మారుతుంది. ఒకవైపు అత్యంత ఆకర్షణీయమైన సచివాలయం, మరోవైపు ఆహ్లాదకరమైన హుస్సేన్ సాగర్‌, బుద్ధ విగ్రహం, లుంబినీ పార్క్‌, ట్యాంక్ బండ్‌, నెక్లెస్‌ రోడ్డు, అమరవీరుల స్మారకం హైదరాబాద్‌ నగరానికి మరింత శోభను చేకూరుస్తాయి.

READ MORE  Yadagirigutta Temple | జూన్ 18 నుంచి యాద‌గిరి గుట్ట‌ చుట్టూ గిరి ప్ర‌ద‌ర్శ‌న‌

అమరవీరుల స్మారక ప్రాజెక్ట్ విశేషాలు..

  • ప్రాజెక్ట్ ప్రాంతం: 3.29 ఎకరాలు (13,317 చ.మీ)
  •  అంతర్నిర్మిత ప్రాంతం: 26,800 చ.మీ (2,88,461 చ.అడుగులు)
  •  మొత్తం అంతస్తులు : 6 (రెండు సెల్లార్లతో సహా)
  •  స్మారక చిహ్నం మొత్తం ఎత్తు : 54 మీటర్లు
  •  దీపం జ్వాల ఎత్తు: 26 మీటర్లు
  •  స్టెయిన్లెస్ స్టీల్ క్లాడింగ్: 100 మెట్రిక్ టన్నులు
  •  నిర్మాణానికి ఉపయోగించే ఉక్కు: 1500 MT
  •  ప్రాజెక్ట్ వ్యయం : రూ.177.50 కోట్లు
  •  అడ్మినిస్ట్రేటివ్ అనుమతుల జారీ అయిన తేదీ : జూన్ 17, 2017
  •  పనుల ఒప్పందం జరిగిన తేదీ : సెప్టెంబర్ 14, 2018
  •  కాంట్రాక్టు తీసుకున్న కంపెనీ: కేపీసీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్
  •  కన్సల్టెంట్ : ఎంవీ.రమణా రెడ్డి, తనికెళ్ల ఇంటిగ్రేటెడ్ కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్.
READ MORE  IMD Hyderabad | నిప్పుల కొలిమి నుంచి ఉపశమనం.. రెండు రోజులకు ఈ జిల్లాల్లో వర్షాలు..

ఈ భవనం బయటి నిర్మాణం కోసం 3000 స్టెయిన్లెస్ స్టీల్ ప్లేట్లు ఉపయోగించారు. ఈ ప్లేట్ల మొత్తం బరువు దాదాపు 100 టన్నులు..  కాగా వీటిని దుబాయ్ లో తయారు చేసి ఇక్కడికి తీసుకొచ్చారు. అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి  ఇక్కడ అసెంబుల్ చేశారు. కాంక్రీట్ అంతర్గత గోడలు, స్లాబ్లకు మాత్రమే ఉపయోగించారు. ఇందుకోసం దాదాపు 1200 టన్నుల ఉక్కును వినియోగించారు.

ప్రతీ అంతస్థు.. ప్రత్యేకం

  • మొదటి అంతస్తు- 10,656 చ.అడుగులు (మ్యూజియం, ఫోటో గేలరీ, 70 మందికి ఆడియో విజువల్ రూమ్ తోపాటు ఎస్కలేటర్)
  • రెండో అంతస్తు –16,964 చ.అడుగుల (దాదాపు 500 మంది కూర్చోగలిగేలా కన్వెన్షన్ హాల్ తోపాటు లాబీ ఏరియా)
  • మూడో అంతస్తు, టెర్రస్ అంతస్తు – ప్రాంతం 8095 చ.అడుగుల(రెస్టారెంట్ తోపాటు ఓపెన్ టెర్రస్ సిట్టింగ్ ఏరియా)
  • మెజ్జనైన్ ఫ్లోర్- విస్తీర్ణం 5900 చ.అ. (గ్లాస్ రూఫ్ రెస్టారెంట్, ఓవర్ హెడ్ ట్యాంక్)
  • దీపం- కార్బన్ స్టీల్ నిర్మాణం, 26 మీటర్ల ఎత్తు. బంగారు పసుపు రంగు, బాహ్య లైటింగ్
  • బేస్మెంట్-2 నుండి నాల్గవ అంతస్తు వరకు మూడు లిఫ్టులు 

Electric Vehicles అప్‌డేట్‌ల కోసం హరితమిత్రను చూస్తూ ఉండండి, తాజా తెలుగు వార్తల కోసం మా వందేభారత్ వెబ్ సైట్,

టెక్ వార్తల కోసం టెక్ ఈనాడును సందర్శించండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *