Home National Sambhal Power Theft case | సంభాల్ ఎంపీ ఇంటికి క‌రెంటు స‌ర‌ఫ‌రా నిలిపివేత‌

Sambhal Power Theft case | సంభాల్ ఎంపీ ఇంటికి క‌రెంటు స‌ర‌ఫ‌రా నిలిపివేత‌

0
9
sambhal Power Theft
Spread the love

Sambhal Power Theft | సమాజ్‌వాదీ పార్టీకి చెందిన సంభాల్ ఎంపీ జియా ఉర్ రెహ్మాన్ బార్క్ నివాసంలో రెండు విద్యుత్ మీటర్లను ట్యాంపరింగ్ చేసినట్లు ఆధారాలు లభించడంతో ఉత్తరప్రదేశ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్ గురువారం ఆయనకు విద్యుత్ సరఫరాను నిలిపివేసింది. గురువారం ఉదయం ఆయ‌న ఇంటిలో అధికారులు తనిఖీ చేసిన తరువాత టాంప‌రింగ్ నిజ‌మ‌ని తేలడంతో అతడిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు.. సంభాల్‌లోని మసీదు సర్వేపై ఇటీవల జరిగిన హింసలో నలుగురు మృతిచెందిన‌ కేసులో బార్క్ ప్రధాన నిందితుడిగా ఉన్నారు.

జిల్లా విద్యుత్ కమిటీ చైర్మన్‌గా ఉన్న ఎంపీపీ ఇంటి వద్ద రెండు విద్యుత్ మీటర్లలో ట్యాంపరింగ్ జరిగినట్లు ఆధారాలు లభించినట్లు అధికారులు తెలిపారు. విద్యుత్ చౌర్యం నిరోధక చట్టంలోని సెక్షన్ 135 కింద కేసు నమోదు చేశారు. విద్యుత్ శాఖ గతంలో ఎంపీ ఇంటి నుంచి పాత మీటర్లను తొలగించి సీల్ వేసి పరీక్షల నిమిత్తం ల్యాబ్ కు పంపింది. ఎంపీ ఇంటి వార్షిక కరెంటు బిల్లులో జీరో వినియోగం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.

నేటి తనిఖీ సంద‌ర్భంగా అధికారులు సంభాల్ లోక్ సభ సభ్యుడు ( sambhal lok sabha) జియా ఉర్ రెహ్మాన్ బార్క్ ఇంటికి కొత్త విద్యుత్‌ మీటర్లను ఏర్పాటు చేసి రీడింగులను తనిఖీ చేస్తున్నారు. ఎయిర్ కండిషనర్లు, ఫ్యాన్లు, ఇతర విద్యుత్ పరికరాల లోడ్‌ను అంచనా వేస్తున్నారు. లక్ష్యంగా పెట్టుకుంది.

“విద్యుత్ లోడ్ లెక్కిస్తున్నామ‌ని, మొదటి, రెండవ అంతస్తులలోని కొన్ని గదులు తాళాలు వేసి ఉన్నాయి” అని సంభాల్‌లోని సబ్ డివిజనల్ అధికారి సంతోష్ త్రిపాఠి తెలిపారు. భారీ పోలీసు మోహరింపుపై, సీనియర్ పోలీసు అధికారి శ్రీష్ చంద్ర మాట్లాడుతూ విద్యుత్ శాఖ కోరడంతో పోలీసు సిబ్బందిని మోహరించామనిచెప్పారు. పోలీసు బలగాలు ఇక్కడ ఉన్నాయి, సజావుగా తనిఖీలు సాగించేలా చూస్తారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము” అని అధికారి తెలిపారు.

నవంబర్ 24న, మసీదుపై కోర్టు ఆదేశాల మేర‌కు చేప‌ట్టిన సర్వేను ఒక సమూహం వ్యతిరేకించడంతో సంభాల్‌లో భారీ హింస చెలరేగింది . ఈ ఘర్షణలు నలుగురు మృతిచెందారు. రాజకీయ ప్రయోజనాల కోసం జియా ఉర్ రెహ్మాన్ బార్క్ హింసను ప్రోత్స‌హించార‌ని ఉత్తరప్రదేశ్ పోలీసులు ఆరోపించారు. అతని ప్రసంగాలు అల్ల‌రిమూక‌ను హింస‌కు ప్రేరేపించాయని పేర్కొన్నారు. కాగా బుధవారం, డిసెంబర్ 18, సంభాల్ హింసకు సంబంధించి తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌కు సంబంధించి తన అరెస్టుపై స్టే విధించాలని బార్క్ అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు . తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కూడా కొట్టివేయాలని కోరారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి.  అలాగే మా  గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్)ఫేస్ బుక్,  వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

🇮🇳 జాతీయ ప్రయోజనాలే పరమావధిగా.. 🇮🇳

వందేభారత్ డిజిటల్ సైన్యంలో చేరండి!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here