Home తాజా వార్తలు One Nation One Election | జ‌మిలీ ఎన్నిక‌లకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధం..!

One Nation One Election | జ‌మిలీ ఎన్నిక‌లకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధం..!

0
3
One Nation, One Election bill
One Nation One Election
Spread the love

One Nation One Election | ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA Governamet) ప్రభుత్వం ‘ఒక దేశం, ఒకే ఎన్నికలను తన ప్రస్తుత పదవీకాలంలోనే అమలు చేసేందుకు సిద్ధమవుతోందని వార్త‌లు వెలువ‌డుతున్నాయి. ఈ ఎన్నికల సంస్కరణకు పార్టీలకు అతీతంగా మద్దతు లభిస్తుందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నట్లు పేర్కొంటున్నాయి. మూడ‌వ సారి అధికారంలోకి వ‌చ్చిన ఎన్​డీఏ ప్రభుత్వం వంద రోజుల పాల‌న విజ‌య‌వంతంగా పూర్తి చేసుకుంది. అయితే జమిలి ఎన్నికల నిర్ణయం ఈ విడతలోనే అమల్లోకి వస్తుందని ప్రభుత్వవర్గాలు తెలిపాయి.

స్వాత్యంత్ర దినోత్సవ వేడుకల ప్రసంగంలో ప్రధాని మోదీ (PM MODI ) జమిలి ఎన్నికల ఆవశ్యకత గురించి ప్ర‌స్తావించారు. తరుచుగా జరిగే ఎన్నికలు దేశాభివృద్ధికి ఆటంకంగా మారుతుంద‌ని తెలిపారు. ఈ ముఖ్యమైన విధాన మార్పు భారతదేశం వ్యాప్తంగా జాతీయ, రాష్ట్ర ఎన్నికలను సమకాలీకరించడానికి ఉద్దేశించింది.

“ఈ పదవీకాలంలో ఇది ఖచ్చితంగా అమలు చేయాల‌ని దృఢ నిశ్చ‌యంతో ఉన్న‌ట్లు తెలుస్తోంది. జ‌మిలి ఎన్నికలపై ఉన్నత స్థాయి కమిటీ తన సుదీర్ఘ‌మైన‌ 18,626 పేజీల నివేదికను కొన్ని నెల‌ల క్రితం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించిన విష‌యం తెలిసిందే.. ముఖ్యంగా, మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలోని ఈ కమిటీ, రాజకీయ, సామాజిక రంగాల్లోని నిపుణుల‌ నుంచి అన్ని ర‌కాల అభిప్రాయాల‌ను సేకరించేందుకు సమగ్ర సంప్రదింపులు జరిపింది.

నివేదిక ప్రకారం.. 47 రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాలను పంచుకున్నాయి, 32 జ‌మిటీ ఎన్నికల భావనకు మద్దతు ఇచ్చాయి. అదనంగా, వార్తాపత్రికలలో ప్రచురించబడిన పబ్లిక్ నోటీసు పౌరుల నుంచి 21,558 ప్రతిస్పందనలు వ‌చ్చాయి. వీరిలో 80% మంది ఏక‌కాల ఎన్నిక‌ల‌ ప్రతిపాదనకు అనుకూలంగా ఉన్నారు.

నలుగురు మాజీ ప్రధాన న్యాయమూర్తులు, ప్రధాన హైకోర్టుల నుంచి పన్నెండు మంది మాజీ ప్రధాన న్యాయమూర్తులు, నలుగురు మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌లతో సహా న్యాయ నిపుణులు తమ అభిప్రాయాల‌ను అందించారు. ఈ చర్చల్లో భారత ఎన్నికల సంఘం అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకున్నారు. ఇంకా, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII), ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ & ఇండస్ట్రీ (FICCI), అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా (ASSOCHAM) వంటి అగ్రశ్రేణి వ్యాపార సంస్థలు, ప్రముఖ ఆర్థికవేత్తలతో కలిసి పరిశీలించేందుకు గా ను క‌మిటీ సంప్ర‌దింపులు జ‌రిపింది. అస్థిరమైన ఎన్నికలు ద్రవ్యోల్బణ ఒత్తిళ్లకు దారితీస్తాయని, ఆర్థిక వృద్ధి మందగించవచ్చని, ప్రజా ధ‌నం వృథా అవుతుందని చాలా మంది వెల్ల‌డించారు.

One Nation One Election : ఈ సంప్రదింపుల నుంచి వ‌చ్చిన అభిప్రాయాల‌ను సమీక్షించిన తర్వాత, జ‌మిలీ ఎన్నికలను అమలు చేయడానికి రెండు-దశల విధానాన్ని కమిటీ ప్రతిపాదించింది. మొదటి దశలో, లోక్‌సభ, రాష్ట్ర శాసనసభల ఎన్నికలు జ‌రుగుతాయి. రెండవ దశలో, మున్సిపాలిటీలు, పంచాయతీ ఎన్నికలు జ‌రుగుతాయి. జాతీయ, రాష్ట్ర, స్థానిక ఎన్నిక‌లు మూడు అంచెలలోనూ ఎన్నికల కోసం ఏకీకృత ఓటర్ల జాబితా ఒకే ఎలక్టోరల్ ఫోటో గుర్తింపు కార్డు (EPIC)ని ఉపయోగించాలని కూడా నివేదిక సిఫార్సు చేసింది.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు, ఫేస్ బుక్,  ఎక్స్ (ట్విట్టర్) లో జాయిన్ కండి.

🇮🇳 జాతీయ ప్రయోజనాలే పరమావధిగా.. 🇮🇳

వందేభారత్ డిజిటల్ సైన్యంలో చేరండి!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here