Home Trending News ఇంటిలో నగలు చోరీ చేసి కులాసాగా ట్రావెల్ వీడియోలు.. అవే వీడియోలతో పోలీసులకు దొరికిపోయాడు..

ఇంటిలో నగలు చోరీ చేసి కులాసాగా ట్రావెల్ వీడియోలు.. అవే వీడియోలతో పోలీసులకు దొరికిపోయాడు..

0
4
New Delhi robbery case
Spread the love

న్యూఢిల్లీలోని ఒక ఇంట్లో దొంగతనం చేసి దర్జాగా తిరిగాడు.. తీరా అతడు చేసిన ట్రావెల్ వీడియోలతో సులభంగా పోలీసులకు చిక్కాడు.

బిందాపూర్‌కు చెందిన సంజీవ్ (29) జూలై 11న న్యూఢిల్లీలోని ఉత్తమ్ నగర్‌లోని ఓ ఇంట్లో చోరీకి పాల్పడ్డాడు. ఈ ఘటన జరిగిన ఒక నెల తర్వాత,
అతని ట్రావెల్ వ్లాగ్‌ల ద్వారా పోలీసులు అతడు ఉన్న చోటును ట్రాక్ చేశారు. ఆగ్రాలో ఉండగా దొంగను అరెస్టు చేసినట్లు అధికారులు ఆదివారం తెలిపారు. అంతకుముందు తన ఇంట్లో బంగారు, వెండి ఆభరణాలు చోరీకి గురయ్యాయని ఇంటి యజమాని తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.

విచారణలో భాగంగా పోలీసులు సమీపంలోని ప్రదేశాలలోని సీసీ టీవీ ఫుటేజీని విశ్లేషించారు .. నిందితుడు సంజీవ్ చోరీ చేసిన ఇంటి నుండి బయటకు వెళ్లడం కనిపించింది. అతడి చివరి ప్రదేశం ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో ఉన్నట్టు గుర్తించారు. అతడిని ఎవరూ గుర్తించకుండా ఉండటానికి అతను తన మొబైల్ ఫోన్‌ను గంటల తరబడి స్విచ్ ఆఫ్ చేసేవాడు. నేరం చేసిన తర్వాత సంజీవ్ జీవన్ ఓ గోల్డ్ లోన్ షాపునకు వెళ్లినట్లు తేలింది. గోల్డ్ లోన్ దుకాణంలోకి వెళ్లి నిందితుడు చోరీ చేసిన నగలు తనఖా పెట్టి రూ. 20,000 నగదును అప్పుగా తీసుకున్నట్లు తేలిందని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ద్వారక) ఎం హర్షవర్ధన్ తెలిపారు.

ఇంతలో, సంజీవ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ట్రావెల్ వీడియోలను అప్‌లోడ్ చేయడం కొనసాగించాడు. అతను కేరళలోని కప్పం చేరుకుని మరో వ్లాగ్ పోస్ట్ చేశాడు. ఆ తర్వాత, అందరి దృష్టి మరల్చడానికి నిందితుడు తన వీడియోలో వ్యక్తిగత పని కోసం దుబాయ్‌కు వెళ్తున్నట్లు చెప్పాడని డీసీపీ తెలిపారు.

కొంతకాలం తర్వాత, సంజీవ్ మరొక వ్లాగ్‌ను అప్‌లోడ్ చేశాడు, అందులో అతను ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ఉన్నట్లు పేర్కొన్నాడు. వీడియోను విశ్లేషించగా, అతడు ఈ-రిక్షాలో ఆగ్రాలోని ఈద్గా రోడ్డుకు వెళ్లినట్లు గుర్తించారు. వెంటనే పోలీసులు ఆగ్రాకు చేరుకుని ఈద్గా రోడ్డులోని అన్ని హోటళ్లలో సోదాలు చేసి అతడిని అరెస్టు చేసినట్లు వర్ధన్ తెలిపారు.

సహరాన్‌పూర్‌లో అతని వద్ద నుంచి మొత్తం రూ.16 వేలు స్వాధీనం చేసుకున్నారు. అబ్దుల్ మాలిక్ (65)ని అతని నివాసంలో అరెస్టు చేశారు. దొంగిలించిన నగలను సంజీవ్ మాలిక్‌కు విక్రయించాడు. అతని వద్ద నుంచి నగలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Electric Vehicles కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర పోర్టల్ ను సందర్శించండి. తెలుగు రాష్ట్రాలు,  జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్  అప్ డేట్ కోసం గూగుల్ న్యూస్ (Google News) ను సబ్ స్క్రైబ్ చేసుకోండి   ట్విట్టర్, ఫేస్ బుక్  లోనూ సంప్రదించవచ్చు.

 

🇮🇳 జాతీయ ప్రయోజనాలే పరమావధిగా.. 🇮🇳

వందేభారత్ డిజిటల్ సైన్యంలో చేరండి!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here