Saturday, May 17Welcome to Vandebhaarath

వీడియో: లిబియాలో భారీ తుఫాను.. 2000 మందికిపైగా మృతి.. తీరం వెంట తుడుచుకుపెట్టుకుపోయిన నగరాలు

Spread the love

Libya floods : తూర్పు లిబియాలోని డెర్నా నగరంలో భారీ వరదలు తుఫాను కారణంగా సుమారు 2,000 మంది మరణించారు. వేలాది మంది వరదల్లో గల్లంతయ్యారు.
తూర్పు లిబియాను నియంత్రించే లిబియా నేషనల్ ఆర్మీ (ఎల్‌ఎన్‌ఎ) ప్రతినిధి అహ్మద్ మిస్మారి మీడియా సమావేశంలో మాట్లాడుతూ డెర్నా నగరంపై ఆనకట్టలు కూలిపోవడంతో ఈ విపత్తు సంభవించిదని, భవనాలు, ఇళ్లు పూర్తిగా సముద్రంలోకి కొట్టుకుపోయాయని తెలిపారు. తప్పిపోయిన వారి సంఖ్య 5,000-6,000గా పేర్కొన్నారు.
అంతకుముందు సోమవారం, ఈ ప్రాంతంలోని రెడ్ క్రెసెంట్ సహాయ బృందం అధిపతి డెర్నా మరణాల సంఖ్య 150 ఉందని, 250కి చేరుకుంటుందని అంచనా వేశారు.
ట్రిపోలీలో, విభజించబడిన దేశంలో దేశాధినేతగా పనిచేస్తున్న ముగ్గురు వ్యక్తుల అధ్యక్ష మండలి..  అంతర్జాతీయ సమాజాన్ని సహాయం కోరింది.
సమాంతర తూర్పు ఆధారిత పరిపాలన అధిపతి ఒసామా హమద్ స్థానిక టెలివిజన్‌తో మాట్లాడుతూ, 2,000 మందికి పైగా మరణించారు.. వేలాది మంది తప్పిపోయారు.

తుఫాను గత వారం గ్రీస్‌ను తాకిన తర్వాత ఆదివారం మధ్యధరా సముద్రంలోకి ప్రవేశించి, డెర్నాలో రోడ్లను, భవనాలను ధ్వంసం చేసింది, లిబియా దేశంలోని రెండవ అతిపెద్ద నగరం బెంఘాజీతో సహా తీరం వెంబడి ఉన్న ఇతర స్థావరాలను తాకింది. డెర్నా తుఫానుకు సంబంధించిన వీడియోల్లో సిటీ సెంటర్ గుండా ప్రవహించే విశాలమైన వదరనీటి ప్రవాహాన్ని చూపించాయి.

తూర్పు లిబియాకు చెందిన Almostkbal TV న్యూస్ ఫుటేజ్ లో తుఫాను కారణంగా వాహనాల పైకప్పులపై చిక్కుకున్న వ్యక్తులు సహాయం కోసం అర్థించడం, వరదల్లో కొట్టుకుపోతున్నకార్లను చూసి అందరూ చలించిపోతున్నారు. “తప్పిపోయిన వారు వేలల్లో ఉన్నారు. చనిపోయిన వారి సంఖ్య 2,000 దాటింది” అని బాధితుడు మీడియాకు చెప్పారు. “డెర్నాలోని మొత్తం కాలనీలన్నీ కనుమరుగయ్యాయి, ప్రజలు, ఇళ్లు వరదకు కొట్టుకుపోయని తెలిపారు.

సెర్చ్,  రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అధికారులు తీవ్ర అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. పాఠశాలలు, దుకాణాలను మూసివేసి కర్ఫ్యూ విధించారు. ట్రిపోలీలో, మధ్యంతర ప్రభుత్వం తూర్పు నగరాల్లో సహాయక చర్యలు చేపట్టాలని అన్ని రాష్ట్ర ఏజెన్సీలను ఆదేశించింది. తూర్పు లిబియాలోని వరద ప్రభావిత ప్రాంతానికి సహాయ బృందాన్ని  పంపాలని ఖతార్ ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థానీ ప్రభుత్వాన్ని ఆదేశించినట్లు ఖతార్ రాష్ట్ర వార్తా సంస్థ నివేదించింది.

లిబియా తూర్పు ఆధారిత పార్లమెంట్ మూడు రోజుల సంతాప దినాలు ప్రకటించింది. ట్రిపోలీలోని తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన మంత్రి అబ్దుల్‌హమీద్ అల్-ద్బీబా కూడా ప్రభావితమైన అన్ని నగరాల్లో మూడు రోజుల సంతాప దినాలను ప్రకటించారు. లిబియాలోని నాలుగు ప్రధాన చమురు నౌకాశ్రయాలు – రాస్ లనుఫ్, జుయిటినా, బ్రెగా మరియు ఎస్ సిద్రా – శనివారం సాయంత్రం నుంచి మూడు రోజుల పాటు మూసివేశారు.

Whatsapp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..