Home National UttharaKhand | 170 కి పైగా మదర్సాల మూసివేత

UttharaKhand | 170 కి పైగా మదర్సాల మూసివేత

0
5
UttharaKhand
Uttarakhand CM Dhami
Spread the love

ఉత్తరాఖండ్‌లో అక్రమ మదర్సాలపై ప్రభుత్వం కన్నెర్ర

UttharaKhand : ఉత్తరాఖండ్‌లో, ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి (Pushkar Singh Dhami) నాయకత్వంలో, రాష్ట్ర ప్రభుత్వం శాంతిభద్రతల విషయంలో చాలా సీరియస్ గా వ్యవహరిస్తోంది. మతమార్పిడి అయినా, లవ్ జిహా ద్ అయినా, ల్యాండ్ జిహాద్ అయినా, స్పిట్ జిహాద్ అయినా లేదా ఇటీవల చర్చకు దారితీస్తున్న మదర్సా జిహాద్ అయినా, పుష్కర్ దామీ ప్రభుత్వం ప్రతి విషయంలోనూ ఖచ్చితమైన, నిర్ణయాత్మక చర్య తీసుకుంటోంది. రాష్ట్రంలో చట్టవిరుద్ధ కార్యకలాపాలకు, సామాజిక సామరస్యాన్ని దెబ్బతీసే శక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని తాజాగా స్పష్టం చేసింది.

ఈ క్రమంలో, ప్రభుత్వం ఇప్పుడు చట్టవిరుద్ధంగా, రిజిస్ట్రేషన్ లేకుండా నడుస్తున్న మదర్సాలపై యాక్షన్ ప్లాన్ ను ప్రారంభించింది. ఇప్పటివరకు, రాష్ట్రవ్యాప్తంగా 170 కి పైగా మదర్సాలను సీల్ చేశారు, అవి రిజిస్ట్రేషన్ లేకుండా నడుస్తున్నాయని, మరికొన్నింటిలో అనుమానాస్పద కార్యకలాపాలు నిర్వహిస్తురని ప్రభుత్వం పేర్కొంది. ఈ మదర్సాలను దర్యాప్తు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సర్వే బృందాలను ఏర్పాటు చేసింది. దీని నివేదిక ఆధారంగా జిల్లా యంత్రాంగం ఈ కఠిన చర్య తీసుకుంది.

UttharaKhand : 170 కి పైగా మదర్సాలు క్లోజ్

ఈ చర్యల ప్రభావం ఉత్తరాఖండ్‌లోని సున్నితమైన ప్రాంతాలలో కనిపించింది. డెహ్రాడూన్, హరిద్వార్, ఉధమ్ సింగ్ నగర్, ముఖ్యంగా వనభూమిపుర (హల్ద్వానీ) వంటి ప్రాంతాలలో అనేక అక్రమ మదర్సాలు మూసివేయబడ్డాయి. వీటిలో చాలా చోట్ల భవన నిర్మాణ అనుమతి తీసుకోలేదు లేదా ఎటువంటి విద్యా గుర్తింపు లేదా భద్రతా ప్రమాణాలు పాటించబడలేదు.

విద్య పేరుతో మతోన్మాదాన్ని అంగీకరించం – సీఎం ధామి

ఉత్తరాఖండ్ ఎలాంటి చట్టవిరుద్ధమైన, రాజ్యాంగ విరుద్ధమైన, సమాజ విధ్వంసక కార్యకలాపాలను ఎట్టిపరిస్థితుల్లో అనుమతించబోమని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి (Pushkar Singh Dhami) స్పష్టమైన సందేశాన్ని ఇచ్చారు. విద్య పేరుతో పిల్లలను తీవ్రవాదం వైపు నడిపించే సంస్థలను రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని ఆయన అన్నారు. ఈ ప్రక్రియ ఇక్కడితో ముగియదని ప్రభుత్వం కూడా సూచించింది. ప్రస్తుతం దర్యాప్తులో ఉన్న మదర్సాలు కూడా నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలితే, వాటిపై కూడా కఠిన చర్యలు తీసుకోనున్నారు.

ఉత్తరాఖండ్‌లోని అన్ని రకాల విద్యాసంస్థలు చట్టబద్ధంగా నమోదు చేసుకొని ఉండాలని, వాటి పనితీరులో పారదర్శకత ఉండేలా చూసుకోవాలని సీఎం పుష్కర్ సింగ్ ధామీ సూచించారు. అవి ఎలాంటి తీవ్రవాద లేదా తీవ్రవాద కార్యకలాపాలకు కేంద్రంగా మారకుండా చూసుకోవాలని కోరుకుంటున్నట్లు ధామి అన్నారు. కాగా సామాజిక భద్రత, విద్య నాణ్యత, మత సామరస్యాన్ని కాపాడుకునే దిశగా ఈ చారిత్రాత్మక అడుగు ఒక ప్రధాన చొరవగా భావిస్తున్నారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి.  అలాగే మా  గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్)ఫేస్ బుక్,  వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

🇮🇳 జాతీయ ప్రయోజనాలే పరమావధిగా.. 🇮🇳

వందేభారత్ డిజిటల్ సైన్యంలో చేరండి!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here