Home » Hindu population : 1950 నుంచి 2015 వ‌ర‌కు భారత్ లో భారీగా త‌గ్గిన హిందువుల జ‌నాభా..
Hindu population

Hindu population : 1950 నుంచి 2015 వ‌ర‌కు భారత్ లో భారీగా త‌గ్గిన హిందువుల జ‌నాభా..

Spread the love

Hindu population : భారతదేశంలో మెజారిటీ మతం (హిందువులు) జనాభా వాటా 1950 నుంచి 2015 మధ్య భారీగా 7.8 శాతం తగ్గింది. అదే సమయంలో ముస్లింల సంఖ్య 43.15 శాతం పెరిగింది. ప్ర‌ధాన‌మంత్రి ఎక‌నామిక్ అడ్వైజ‌రీ కౌన్సిల్ పేప‌ర్ (EAC-PM) ప్ర‌కారం.. మెజారిటీ జనాభాలో తగ్గుదల నేపాల్ తోపాటు మయన్మార్‌లలో కూడా కనిపించింది. అయితే 38 ఇస్లామిక్ దేశాల్లో ముస్లింల జనాభా గ‌ణ‌నీయంగా పెరిగింది. తాజా అధ్యయనం ప్రకారం, భారతదేశంలోని పార్సీలు, జైనులు మినహా, క్రైస్తవులు, బౌద్ధులు, సిక్కులతో సహా అన్ని ఇతర మతపరమైన మైనారిటీల నిష్పత్తి వారి జనాభా వాటాలో పెరుగుదల క‌నిపించింది. ఈ కాలంలో 6.58 శాతానికి చేరుకుంది.

భారత్ లో హిందూ జనాభా తగ్గుదల

EAC-PM అధ్యయనం ప్రకారం, భారతదేశంలో, మెజారిటీ హిందూ జనాభా వాటా 1950 – 2015 మధ్య 7.82 శాతం తగ్గింది (84.68 శాతం నుంచి 78.06 శాతానికి). 1950లో ముస్లిం జనాభా వాటా 9.84 శాతం కాగా, 2015లో 14.09 శాతానికి పెరిగింది – వారి వాటాలో 43.15 శాతం పెరుగుదల క‌నిపించింద‌ని వర్కింగ్ పేపర్, షేర్ ఆఫ్ రిలిజియస్ మైనారిటీస్, ఎ క్రాస్ కంట్రీ అనాలిసిస్ (1950-2015) పేర్కొంది.

READ MORE  Railway Budget 2024 | రైల్వేల భ‌ద్ర‌త‌కు భారీగా కేటాయింపులు.. సామాన్య ప్రజల కోసం కీలక నిర్ణయాలు

భారతదేశంలో మైనారిటీలు

భారతదేశంలో 1950 – 2015 మధ్య హిందూ జనాభా (Hindu population) తగ్గిపోగా, మైనారిటీల వాటా పెరిగింది. క్రైస్తవ జనాభా వాటా 1950లో 2.24 శాతం నుంచి 2015లో 2.36 శాతానికి (5.38 శాతం ) పెరిగింది. సిక్కుల జనాభా 1.24 శాతం నుంచి 1.85 శాతానికి (6.58 శాతం పాయింట్ల పెరుగుదల) పెరిగింది. బౌద్ధ జనాభా వాటా కూడా 1950లో 0.05 శాతం నుంచి 0.81 శాతానికి పెరిగింది. మరోవైపు, భారతదేశ జనాభాలో జైనుల వాటా 1950లో 0.45 శాతం నుంచి 2015లో 0.36 శాతానికి తగ్గింది. భారతదేశంలో పార్సీ జనాభా వాటా 0.03 శాతం నుంచి తగ్గుతూ 85 శాతం క్షీణించింది. ఈ డేటాను జాగ్రత్తగా విశ్లేషించడం ద్వారా భారతదేశంలో మైనారిటీలకు రక్ష‌ణ లేద‌నే ఆరోప‌ణల్లో నిజం లేద‌ని తేలిపోయింది. నిజానికి మైనార్టీలు అభివృద్ధి చెందుతున్నారని నివేదిక తేట‌తెల్లం చేస్తున్న‌ది.

READ MORE  Jagannath Rath Yatra | జగన్నాధ రథయాత్ర సన్నద్ధం.. రెండ్రోజులు సెలవు ప్రకటించిన ఒడిశా

పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లో..

65 సంవత్సరాల కాలంలో 167 దేశాలలో మతపరమైన మైనారిటీల జ‌నాభా ధోర‌ణి వివ‌రిస్తోంది.
ముస్లిం మెజారిటీ దేశంలో జనాభాలో మార్పు ధోరణి కొద్దిగా భిన్నంగా ఉంటుంది. నివేదిక ప్రకారం 38 ముస్లిం మెజారిటీ దేశాల్లో ముస్లింల వాటా పెరిగింది. “భారత ఉపఖండంలో, మాల్దీవులు మినహా అన్ని ముస్లిం మెజారిటీ దేశాలు మెజారిటీ మతపరమైన తెగల వాటాలో పెరుగుదల కనిపించింది. ఇక్కడ మెజారిటీ సమూహం (షఫీ సున్నీలు) వాటా 1.47 శాతం తగ్గింది” అని నివేదిక చెబుతోంది.

బంగ్లాదేశ్‌లో, మెజారిటీ మత సమూహం వాటాలో 18 శాతం పెరుగుదల ఉంది. ఇది భారత ఉపఖండంలో అతిపెద్ద పెరుగుదల. 1971లో బంగ్లాదేశ్ ఆవిర్భవించినప్పటికీ, మెజారిటీ మతపరమైన (హనాఫీ ముస్లిం) వాటాలో పాకిస్తాన్ 3.75 శాతం, మొత్తం ముస్లిం జనాభాలో 10 శాతం పెరుగుదలను చూసింది.

1950లో పాకిస్థాన్‌లో ముస్లింల జనాభా 77.45 శాతం ఉంది. ప్రస్తుతం ఈ దేశంలో ముస్లింలు 80.36 శాతంగా ఉన్నారు. “1971లో బంగ్లాదేశ్ ఏర్పడినప్పటికీ, మెజారిటీ మతపరమైన (హనాఫీ ముస్లిం) వాటాలో పాకిస్తాన్ 3.75 శాతం, మొత్తం ముస్లిం జనాభాలో 10 శాతం పెరుగుదలను చూసింది. ఇదే స‌మ‌యంలో బంగ్లాదేశ్‌లో ముస్లింలు జనాభాలో 74.24 శాతం నుంచి 88.02 శాతానికి పెరిగారు. అదేవిధంగా ఆఫ్ఘనిస్థాన్‌లో ముస్లిం జనాభా 88.75 శాతం నుంచి 89.01 శాతానికి పెరిగింది. అయితే మాల్దీవుల్లో ముస్లిం జనాభా 99.83 శాతం నుంచి 98.36 శాతానికి స్వల్పంగా తగ్గుముఖం పట్టింది.

READ MORE  TSRTC Latest News : ఫ్యామిలీ టికెట్లపై టీఎస్ఆర్టీసీ కీలక ప్రకటన

నివేదిక ప్రకారం, మయన్మార్‌లో బౌద్ధుల జనాభా 78.53 శాతం నుండి 70.80 శాతానికి తగ్గింది. శ్రీలంకలో బౌద్ధుల జనాభా 64.28 శాతం నుంచి 67.65 శాతానికి పెరిగింది. భూటాన్‌లో బౌద్ధుల జనాభా 71.44 నుంచి 84.07 శాతానికి పెరిగింది. అయితే నేపాల్‌లో హిందువుల జనాభా 84.30 శాతం నుంచి 81.26 శాతానికి తగ్గింది.


Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
అత్యాధునిక హంగులతో చర్లపల్లి రైల్వే టెర్మినల్ చూశారా? దుర్గదేవి నవరాత్రి ఉత్సవాలు.. తొమ్మిది ఆలయాలు..