Sunday, April 27Thank you for visiting

ఢిల్లీ మద్యం కేసు: కవితకు మరోసారి జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

Spread the love

Dlehi Liquor Scam Updates | ఢిల్లీ మద్యం కుంభ‌కోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్ తోపాటు భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల‌ కవిత కస్టడీని మరో 14 రోజులు పొడిగించారు. AAPకి కిక్‌బ్యాక్‌లకు బదులుగా దిల్లీ ఎక్సైజ్ పాలసీని రూపొందించినందుకు నిందితులు కేజ్రీవాల్‌తో టచ్‌లో ఉన్నారని ఫెడరల్ ప్రోబ్ ఏజెన్సీ ఆరోపించింది. దిల్లీ లిక్క‌ర్ విధానానికి సంబంధించిన సీబీఐ కేసులో కవిత జ్యుడీషియల్ కస్టడీని కూడా రూస్ అవెన్యూ కోర్టు మే 7 వరకు పొడిగించింది. ముగ్గురు నిందితులను వర్చువల్ కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు హాజరుపరిచారు. కేజ్రీవాల్‌ భార్య సునీతా కేజ్రీవాల్ సమక్షంలో ప్రతిరోజూ 15 నిమిషాలపాటు తన వైద్యుడిని సంప్రదించేందుకు అనుమతించాలన్న ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించిన ఒక రోజు తర్వాత కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.
అవసరమైన వైద్య చికిత్స అందించాలని ఢిల్లీ కోర్టు ఆదేశించింది. సోమవారం సాయంత్రం రక్తంలో చక్కెర స్థాయి పెరగడంతో కేజ్రీవాల్‌కు తక్కువ మోతాదులో ఇన్సులిన్ అందించినట్లు తీహార్ జైలు అధికారులు తెలిపారు. కాగా హనుమాన్ జయంతి సందర్భంగా వచ్చిన ఈ వార్తను ఆప్ స్వాగతించింది. దేవుడి ఆశీర్వాదం ఫలితంగా జరిగిందన్నారు. ఎయిమ్స్ వైద్యుల సలహా మేరకు సోమవారం సాయంత్రం కేజ్రీవాల్‌కు రెండు యూనిట్ల తక్కువ మోతాదు ఇన్సులిన్ అందించినట్లు తీహార్ జైలు అధికారి తెలిపారు.

READ MORE  Delhi Liquor Scam Case : లిక్కర్‌ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవితకు షాక్..తీహార్ జైలుకు తరలింపు

Dlehi Liquor Scam Updates కాగా ఈసారి కవిత విషయంలో కవిత కస్టడీ అవసరం లేదంటూ ఆమె తరపు న్యాయవాది వాదించినప్పటికీ.. సాక్ష్యాలను తారుమారు చేసే చాన్స్  ఉందని, కేసు విచారణపై తీవ్ర ప్రభావం ఉంటుందని అందుకే మళ్లీ కస్టడీకి ఇవ్వాలని ఈడీ న్యాయవాది తన వాదనలు వినిపించారు.  ఈ వాదోపవాదల తర్వాత కేసు దర్యాప్తు వివరాలను ఈడీ అధికారులు కోర్టుకు అందజేశారు. కవిత అరెస్టుపై త్వరలోనే చార్జిషీట్ సమర్పిస్తామని కోర్టుకు ఈడీ విన్నవించింది. సాక్ష్యాలను తారుమారు చేస్తారని తరచూ ఆరోపిస్తున్నారని మరోసారి కవిత లాయర్ కోర్టుకు వెల్లడించారు.  ఈడీ, సీబీఐ అధికారులు చెప్పినవే చెబుతున్నారని.. కొత్త చేసిందేమీ లేదని కవిత లాయర్ … న్యాయమూర్తికి వివరించారు.  ఇలా ఇరువురి వాదనలు విన్న తర్వాత కవితను కస్టడీకి ఇచ్చింది.

READ MORE  చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురి మృతి..

Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది.. మీ ఇంట్లో ఈ చిట్కాలతో జలుబు, దగ్గు ను వదిలించుకోండి..