Home » పదేళ్ల జైలు శిక్ష తర్వాత కూడా ఆ రేపిస్టు.. మళ్లీ మైనర్‌పై లైంగిక దాడి
Crime News

పదేళ్ల జైలు శిక్ష తర్వాత కూడా ఆ రేపిస్టు.. మళ్లీ మైనర్‌పై లైంగిక దాడి

Spread the love

ఇలాంటి కీచకులనేంచేయాలి?

మధ్యప్రదేశ్‌లో అత్యాచారం కేసులో పదేళ్లపాటు జైలు శిక్ష అనుభవించిన ఓ వ్యక్తి జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా ఇలాంటి నేరానికి పాల్పడ్డాడు. సాత్నాలో 5 ఏళ్ల దళిత బాలికపై నిందితులు అత్యాచారానికి తెగబడ్డాడు. బాలల లైంగిక నేరాల నుంచి రక్షణ (పోక్సో) చట్టంతో సహా సంబంధిత సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేశారు.
10 సంవత్సరాల కారాగార శిక్ష నిందితుల్లో ఎలాంటి మార్పు రాలేదు.. ఏడాదిన్నర క్రితం జైలు నుంచి బయటకు వచ్చి మరో మైనర్‌పై అత్యాచారానికి పాల్పడ్డాడు.
గత బుధవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో బాధితురాలు కనిపించకుండా పోవడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో అమ్మమ్మ ఆమె కోసం వెతకడం ప్రారంభించింది. కొంత దూరంలో రక్తసిక్తమైన స్థితిలో బాలిక నిపించింది.

READ MORE  సీఎం యోగీ మ‌రో సంచ‌ల‌నం.. అత్యంత‌ కఠినమైన 'లవ్ జిహాద్' బిల్లుకు ఆమోదం.. ఈ చట్టంలో కీలక అంశాలు ఇవే..

ఏం జరిగింది

నిందితుడు రాకేష్ వర్మ అలియాస్ రక్కు ఆమెకు మిఠాయిలు తినిపిస్తానని మాయమాటలతో ప్రలోభపెట్టాడు. బాలికపై లైంగికదాడికి పాల్పడుతుండగా అమె అమ్మమ్మ అతడిని ఆపేందుకు ప్రయత్నించగా, నిందితుడు ఆటోలో పారిపోయాడు. కాగా బాలిక పరిస్థితి విషమంగా ఉండటంతో జిల్లా ఆసుపత్రిలో చేరి అక్కడ ప్రథమ చికిత్స అందించిన అనంతరం రేవాలోని సంజయ్ గాంధీ వైద్యశాలకు తరలించారు. బాలికపై అత్యాచారం జరిగినట్లు వైద్య నివేదికల్లో తేలిందని పోలీసులు నిర్ధారించారు.

నిందితుడు 2012లో కోల్గ్వాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నాలుగున్నరేళ్ల బాలికపై అత్యాచారం చేశాడని, అందుకు కోర్టు అతనికి పదేళ్ల శిక్ష విధించిందని పోలీసు సూపరింటెండెంట్ మహేంద్ర సింగ్ చౌహాన్ తెలిపారు.
అయితే జైలులో సత్ప్రవర్తన కారణంగా మూడేళ్ల శిక్షను రద్దు చేసి 18 నెలల క్రితమే జైలు నుంచి బయటకు వచ్చినట్లు పోలీసులు తెలిపారు.
విడుదలైన ఏడాదిన్నర తర్వాత నిందితుడు మరో మైనర్ బాలికపై అదే నేరానికి పాల్పడ్డాడు.

READ MORE  Flexible Display | LG అద్భుత సృష్టి.. టవల్ లా మెలితిరిగే డిస్ల్పే ..

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
అత్యాధునిక హంగులతో చర్లపల్లి రైల్వే టెర్మినల్ చూశారా? దుర్గదేవి నవరాత్రి ఉత్సవాలు.. తొమ్మిది ఆలయాలు..