డాల్బీ అట్మోస్ ఫీచర్ తో Lenovo Tab M9

ధర రూ.12,999. Lenovo Tab M9 భారతదేశంలో శుక్రవారం విడుదలైంది. ఈ ఆండ్రాయిడ్ టాబ్లెట్ డ్యూయల్-టోన్ డిజైన్‌తో మెటల్ బాడీతో వస్తుంది. ఫేషియల్ అన్‌లాకింగ్‌కు మద్దతు ఇస్తుంది. Lenovo Tab M9, MediaTek Helio G80 SoCపై రన్ అవుతుంది, దీనితో పాటు 4GB RAM, 64GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్ ఉంటుంది. ఇది డాల్బీ అట్మోస్ టెక్నాలజీతో డ్యూయల్ స్టీరియో స్పీకర్లను కలిగి ఉంటుంది. వెనుకవైపు 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. Lenovo Tab లో 5,100mAh … Read more

30గంటల ప్లే బ్యాక్ తో iQoo TWS Air Pro Earbuds

iQoo Neo 8 సిరీస్‌తో పాటు iQoo TWS ఎయిర్ ప్రో ఇయర్‌బడ్‌లు చైనాలో ప్రారంభించారు. చైనీస్ బ్రాండ్ నుంచి కొత్త TWS ఇయర్ బడ్స్ దుమ్ము, నీటి నిరోధకత కోసం IP54 రేటింగ్‌ను కలిగి ఉన్నాయి. ఛార్జింగ్ కేస్‌తో గరిష్టంగా 30 గంటల ప్లేబ్యాక్‌ను ఇస్తుందని కంపెనీ పేర్కొంది. వివో చైనీస్ స్టోర్ ద్వారా ఇయర్‌ఫోన్‌లను మే 31న విక్రయించనున్నారు. రెండు కలర్స్ ఆప్షన్లతో లభిస్తుంది, ఇయర్‌బడ్స్ బ్లూటూత్ 5.3 కనెక్టివిటీకి సపోర్ట్ ఇస్తుంది. iQoo … Read more

సింగిల్ చార్జిపై 212కి.మి రేంజ్, గంటకు 105కి.మి స్పీడ్

Simple One EV Launched

సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది.. Simple One Electric Scooter: విద్యుత్ వాహన ప్రియులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎట్టకేలకు 21నెలల నిరీక్షణ తర్వాత విడుదలైంది. బెంగళూరులకు చెందిన ఎలక్ట్రిక్ టూ-వీలర్ స్టార్టప్ సింపుల్ ఎనర్జీ (Simple Energy)..  మంగళవారం అధికారికంగా తన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ సింపుల్ వన్‌ను రూ. 1.45 లక్షల (ఎక్స్-షోరూమ్ బెంగళూరు) ప్రారంభ ధరతో విడుదల చేసింది. 750W ఛార్జర్‌తో కూడిన మోడల్ రూ. … Read more

Boat Storm Connect Plus Smartwatch

బోట్ స్టార్మ్ కనెక్ట్ ప్లస్ స్మార్ట్ వాచ్ ను భారతదేశంలో ఆవిష్కరించారు. స్మార్ట్ వాచ్ లో 1.91-అంగుళాల డిస్ ప్లే 550 నిట్స్ వరకు బ్రైట్ నెస్, 90 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియోతో 2.5D కర్వ్డ్ గ్లాస్ తో ఉంటుంది. స్మార్ట్ వాచ్ బ్లూటూత్ కాల్స్‌సమయంలో బ్యాక్ గ్రౌండ్ నాయిస్ ను తొలగిస్తుంది. కంపెనీ ENx అల్గారిథమ్ తో పాటు బ్లూటూత్ కాలింగ్ కు సపోర్ట్ ఇస్తుంది. ఇది 100 కంటే ఎక్కువ వాచ్ ఫేస్ లను … Read more

సికింద్రాబాద్ నుంచి మరో  భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్

bharat gaurav tourist train

మాతా వైష్ణో దేవి కి ప్రత్యేక రైలును ప్రవేశపెట్టిన దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్: భారత్ గౌరవ్ రైలుకు ప్రయాణికుల నుంచి పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తుండడంతో దక్షిణ మధ్య రైల్వే (SCR) ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) తాజాగా  మాతా వైష్ణో దేవి, హరిద్వార్, రిషికేశ్  దర్శనం కోసం పర్యాటక ప్యాకేజీని ప్రకటించింది. కొత్త  భారత్ గౌరవ్ రైలు (bharat gaurav tourist train) సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరి … Read more

గ్రేటర్ వరంగల్ కమిషనర్ గా రిజ్వాన్‌బాషా షేక్

వరంగల్ : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ) కమిషనర్‌గా రిజ్వాన్‌బాషా షేక్ ఆదివారం ప్రధాన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఆయన వెంట అదనపు కమిషనర్‌ అనిస్‌ ఉర్‌ రషీద్‌, సీఎంహెచ్‌వో డాక్టర్‌ రాజేష్‌, సీహెచ్‌వో శ్రీనివాసరావు తదితరులున్నారు. Greater warangal commissioner   అధికారులతో సమావేశం తరువాత, GWMC పరిధిలోని వివిధ పథకాల కింద జరుగుతున్న, పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులకు సంబంధించిన సమాచారాన్ని తక్షణమే అందించాలని షేక్ ఆదేశించారు . త్వరలో సమీక్షా సమావేశాన్ని … Read more

కుక్క కరిచిన గేదె పాల అమ్మకం

 ఆ పాలు తాగి దూడ మృతి..  ఆస్పత్రులకు పరుగులు తీసిన గ్రామస్తులు ఓ వ్యక్తి చేసిన తింగరి పని ఊరు మొత్తాన్ని టెన్షన్ పెట్టింది. దాదాపు 300 మంది ఆస్పత్రికి పరుగులు తీశారు. పరిస్థితి అర్థం చేసుకున్న అధికారులు గ్రామంలోనే అత్యవసర మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. కొమురం భీం జిల్లా చింతలమానేపల్లి మండల కేంద్రంలో గేదెపై ఓ పిచ్చి కుక్క దాడి చేసి.. గాయపరిచింది. ఈ విషయం తెలిస్తే తన వద్ద పాలు ఎవరూ కొనరేమోనని … Read more

వావ్ చల్లని కబురు.. వర్షాలు కురుస్తాయట.. ఎప్పుడో తెలుసా?

rain-in-telangana

వారం పది రోజులుగా తెలంగాణలో ఎండలు భగ్గు మంటున్నాయి. గతంలో ఎప్పుడూ చూడని రేంజ్‌లో దంచికొడుతున్నాయి. ఉదయం 7 గంటలు దాటితే చాలు ఇంటి నుంచి కాలు బయట పెట్టేందుకు జంకే పరిస్థితి నెలకొంది. 9గంటలకే మధ్యాహ్నానాన్ని తలపించేలా సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. అయితే తీవ్రమైన మండుటెండలతో మాడిపోతున్న తెలంగాణ ప్రజలకు హైదరాబాద్‌ వాతావరణ శాఖ చల్లని కబురు రాష్ట్రంలో శుక్రవారం పొడి వాతావరణం ఉంటుందని, శనివారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని … Read more

వీడియోకాలింగ్ ఫీచర్ తో samsung crystal 4k ismart tv

samsung-crystal-4k-ismart-tv

Samsung Crystal 4K iSmart UHD TV 2023 భారతదేశంలో లాంచ్ అయింది. ఈ స్మార్ట్ టీవీ 43-అంగుళాల డిస్‌ప్లే స్క్రీన్‌తో పాటు విభిన్న పరిమాణాలలో వస్తుంది. టీవీలో స్మార్ట్ హబ్, 4కె రిజల్యూషన్‌తో కూడిన హెచ్‌డిఆర్ 10 డిస్‌ప్లే వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇది బ్రైట్ నెస్ ను పరిస్థితులకు తగ్గట్టు సర్దుబాటు చేసేలా ఇన్బిల్ట్ IoT హబ్, IoT సెన్సార్‌లను కలిగి ఉంది. ఇది Tizen OS, క్రిస్టల్ టెక్నాలజీ ద్వారా పనిచేస్తుంది. ఈ … Read more

పరిశ్రమల ఏర్పాటుకు తెలంగాణ ఆదర్శం

రాష్ట్రంలో అన్ని వనరులు ఉన్నాయి.. న్యూయార్క్ ఇన్వెస్టర్  రౌండ్ టేబుల్ సమావేశంలో  మంత్రి కేటీఆర్‌ పెట్టుబడులకు తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తోందని ఐటీశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. అమెరికా పర్యట నలో కేటీఆర్ న్యూయార్క్ లో జరిగిన ఇన్వె స్టర్ రౌండ్ టేబుల్ మీటింగ్ లో పాల్గొన్నా రు. ఆ సమావేశాన్ని కౌన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా, యూఎస్ ఇండియా స్ట్రాట జిక్ పార్ట్నర్ షిప్ ఫోరమ్ సంయుక్తంగా నిర్వహించాయి. రౌండ్ టేబుల్ సమావే శా న్ని … Read more