అమోల్డ్ డిస్‌ప్లేతో NoiseFit Vortex Smartwatch

NoiseFit Vortex Smartwatch

దేశీయ కంపెనీ నాయిస్ కొత్తగా NoiseFit Vortex Smartwatch  ను విడుదల చేసింది. ఐదు విభిన్న రంగు ఎంపికలలో వచ్చే ఈ స్మార్ట్‌వాచ్, బ్లూటూత్ కాలింగ్‌కు మద్దతుతో 1.46-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. నోయిస్‌ఫిట్ వోర్టెక్స్‌లో మెరుగైన కాలింగ్ కోసం ట్రూ సింక్‌ ఫీచర్ ను పొందుపరిచారు. ఇందులో  150 కంటే ఎక్కువ వాచ్ ఫేస్‌లతోపాటు హార్ట్ రేట్, బ్లడ్ ఆక్సిజన్ లెవెల్ సెన్సార్‌లు, స్లీప్ ట్రాకర్, స్టెప్ కౌంటర్‌తో సహా అనేక స్మార్ట్ హెల్త్ మానిటర్‌లు … Read more

ఇతడు భిక్షగాడు కాదు.. కనిపించే భగవంతుడు

Madhurai beggar pool pandian

రూ.50లక్షలు విరాళం అందించిన పూల్ పాండియన్ చెన్నై: పూల్ పాండియన్ చూడ్డానికి యాచకుడే కానీ అతడి ఉన్నత వ్యక్తిత్త్వం మందు కోటీశ్వరులు కూడా దిగదుడుపే.. ఏళ్ల తరబడి ఎండనకా వాననగా రోడ్లపై సంచరిస్తూ అడుక్కొని సేకరించిన డబ్బులను ముఖ్యమంత్రి సహాయ నిధికి పలు విడతలుగా విరాళంగా ఇచ్చారు. 75 ఏళ్ల పూల్ పాండియన్ (Pool pandian) 2010 నుంచే ఇలా విరాళాలు ఇవ్వడం ప్రారంభించారు. ఇప్పటివరకు సుమారు 50 లక్షల రూపాయలను పోగు చేసి ప్రభుత్వానికి విరాళంగా … Read more

రేపటి నుంచి చేప ప్రసాదం పంపిణీ

chepa mandu

నేటి నుంచి శనివారం వరకు నాంపల్లి సమీపంలో ట్రాఫిక్ ఆంక్షలు హైదరాబాద్: నాంపల్లిలోని నుమాయిష్ గ్రౌండ్స్‌లో గురువారం సాయంత్రం 6 గంటల నుంచి శనివారం అర్ధరాత్రి వరకు చేప ప్రసాదం (chepa mandu) పంపిణీ సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు. MJ మార్కెట్ నుండి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను అవసరాన్ని బట్టి GPO అబిడ్స్ -నాంపల్లి స్టేషన్ రోడ్డు వైపు మళ్లిస్తారు. MJ బ్రిడ్జి, బేగంబజార్ ఛత్రి నుంచి … Read more

పాఠశాల విద్యార్థులకు అదిరిపోయే న్యూస్

Telangana Schools

ఇకపై ప్రతీ నాలుగో శనివారం నో బ్యాగ్ డే…. వివరాలు ఇవీ.. Hyderabad: తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాలల(Telangana Schools)కు సంబంధించిన పాఠశాల విద్యాశాఖ తాజాగా 2023-24 అకడమిక్ క్యాలెండర్‌ను విడుదల చేసింది. ఈ విద్యా సంవత్సరంలో మొత్తం 229 పనిదినాలు కాగా.. ముందుగా ఊహిచినట్లే.. జూన్ 12 నుంచి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. అలాగే వచ్చే ఏడాది 2024 ఏప్రిల్ 24వ తేదీని చివరి వర్కింగ్ డేగా నిర్ణయించింది. ఇక నుంచి తెలంగాణలో పాఠశాల … Read more

ఒడిశా రైలు ప్రమాద మృతులకు రూ.5లక్షల పరిహారం

odisha train tragedy

odisha train tragedy : ఒడిశాలోని బాలాసోర్‌లో శుక్రవారం మూడు రైళ్లు ఢీకొన్నప్రమాదంలో 288 మంది మరణించారు. 1,100 మందికి పైగా గాయపడ్డారు. చెన్నై వైపు వెళ్తున్న షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పడంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఇది పక్కనే ఉన్న ట్రాక్‌పై గూడ్స్ రైలును ఢీకొట్టింది, దీనివల్ల కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ వెనుక క్యారేజ్ మూడవ ట్రాక్‌పైకి వెళ్లింది. మూడో ట్రాక్‌పై ఎదురుగా వస్తున్న బెంగళూరు-హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పిన కోచ్‌లపైకి … Read more

యుద్ధప్రాతిపదికన  రైల్వే పునరుద్ధరణ పనులు 

odisha train accident

odisha train accident : ఒడిశా రైలు ప్రమాద స్థలంలో పునరుద్ధరణ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. ఈ ప్రక్రియను అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారని రైల్వే మంత్రిత్వ శాఖ తన ట్వీట్‌లో పేర్కొంది. ఏడు కంటే ఎక్కువ పొక్లెయిన్ మెషీన్లు, రెండు ప్రమాద సహాయ రైళ్లు, 3-4 రైల్వే, రోడ్ క్రేన్‌లను ముందస్తుగా పునరుద్ధరణ కోసం మోహరించినట్లు రైల్వే తెలిపింది. అంతకుముందు, శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రమాద స్థలానికి సందర్శించి మృతుల కుటుంబ సభ్యులు, క్షతగాత్రులతో … Read more

ఒడిశాలో మృత్యుఘోష

Odisha Train Accident

నిద్రలోనే ప్రాణాలు విడిచిన ప్రయాణికులు 278కి చేరిన మృతుల సంఖ్య Odisha Train Accident : ఒడిశాలోని బాలాసోర్‌లో మూడు రైళ్లు ఢీకొన్న ఘోర ప్రమాదంలో ఇప్పటివరకు 278 మంది మరణించారు. సుమారు 900 మంది గాయపడ్డారు. 20 ఏళ్లలో దేశంలోనే అత్యంత ఘోరమైన రైలు ప్రమాదం అని అధికారులు శనివారం తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ రైలు ప్రమాద స్థలాన్ని సందర్శించి, కటక్‌లోని ఆసుపత్రులలో గాయపడిన వారిని పరామర్శిస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి. రైల్వే అధికారులతో … Read more

Boat Rockerz 255 Touch Neckband ఫుల్ టచ్ కంట్రోల్స్, 30 గంటల ప్లేబ్యాక్

Boat Rockerz 255 Touch Neckband

ధర, ఫీచర్లు ఇవీ.. బోట్ రాకర్జ్ 255 టచ్ వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్ (Boat Rockerz 255 Touch Neckband)  భారతదేశంలో విడుదలైంది. నెక్‌బ్యాండ్ పిచ్ బ్లాక్, డీప్ బ్లూ,  టీల్ గ్రీన్ అనే మూడు కలర్ వేరియంట్‌లలో వస్తుంది. ఇది పూర్తి టచ్ స్వైప్ నియంత్రణలను కలిగి ఉంది. Dirac Virtuo ద్వారా ఆధారితమైన స్పష్టమైన ఆడియోకు సపోర్ట్ ఇస్తుంది. అలాగే ఇది 30 గంటల వరకు ప్లేబ్యాక్ సమయాన్నిఅందిస్తుందని కంపెనీ పేర్కొంది. కంపెనీ ENx అల్గారిథమ్‌తో … Read more

ఆకతాయిలకు షాక్ ఇచ్చే చెప్పులు ఇవి..

మహిళల కోసం ఎలక్ట్రిక్ చెప్పులు ఇంటర్ విద్యార్థి ఘనత ఇటీవల కాలంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. ప్రతిరోజూ ఎక్కడో ఓ చోట మహిళలపై హత్యలు, అత్యాచారాలు, వేధింపులు, భౌతిక దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇలాంటి సమయాల్లో వారిని కాపాడేందుకు పక్కన ఎవరూ లేకపోతే మహిళలు దుండగుల దాడులు చేసేవారికి బలవ్వాల్సిందే. అయితే ఇలాంటి ప్రమాదాల బారి నుంచి తప్పించుకునేందుకు ఒక యువకుడు చక్కని ఆవిష్కరణ చేశాడు.. ఇక నుంచి మహిళలు/ యువతులు వారు వేసుకునే చెప్పులతోనే రక్షించుకునేలా … Read more

అక్రమంగా లింగనిర్ధారణ చేస్తున్న ముఠా అరెస్టు

illegal sex determination gang Arrest

అబార్షన్ల కోసం ప్రైవేట్ ఆస్పత్రులతో కుమ్మక్కు రూ.20వేల నుంచి 30వేల వసూలు 18 మంది నిందితులను అరెస్టు చేసిన వరంగల్ కమిషనరేట్ పోలీసులు వివరాలు వెల్లడించిన సీపీ రంగనాథ్ ఎలాంటి వైద్య అర్హతలు లేకున్నా లింగనిర్ధారణ పరీక్షలు చేసి గర్భస్రావాలకు పాల్పడుతున్న ముఠాను సోమవారం  యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్, టాస్క్ ఫోర్స్ కేయూసీ పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేశారు. కేయూ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోపాల్ పూర్ (Gopalpur)లో గల వెంకటేశ్వరా కాలనీలో ఈ ముఠాకు చెందిన … Read more