యువతితో బలవంతంగా బీఫ్‌ తినిపించి సామూహిక అత్యాచారం.. ఆపై వీడియో తీసి కాబోయే భర్తకు పంపారు..

యువతితో బలవంతంగా బీఫ్‌ తినిపించి సామూహిక అత్యాచారం.. ఆపై వీడియో తీసి కాబోయే భర్తకు పంపారు..

Uttar Pradesh : ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది. దళిత సామాజిక వర్గానికి చెందిన ఓ మహిళపై ఇద్దరు ముస్లిం యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటనను మొత్తం వీడియో తీసి ఆమె కాబోయే భర్తకు పంపారు. అంతటితో ఆగకుండా ఆ మహిళతో బలవంతంగా బీఫ్‌ తినిపించారు. ఈ ఘటన బరేలీ జిల్లాలో చోటుచేసుకుంది.
యూపీ పోలీసుల కథనం ప్రకారం… ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బరేలీ (Bareilly) జిల్లాకు చెందిన ఓ దళిత యువతి (Dalit womam) తన ముస్లిం స్నేహితురాలికి కొంత నగదును అప్పుగా ఇచ్చింది. డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరగా సెప్టెంబరు‌ 2న ఓ కేఫ్ కు రావాలని దళిత యువతికి ముస్లిం స్నేహితురాలు ఫోన్‌ చేసి చెప్పింది. ఈ క్రమంలో దళిత యువతి తన ముస్లిం స్నేహితురాలు చెప్పిన కేఫ్‌ వద్దకు వెళ్లింది. అయితే, అప్పటికే తన స్నేహితురాలి వెంట ఇద్దరు ముస్లిం యువకులు కూడా ఉన్నారు. అందులో ఓ వ్యక్తి బీఫార్మసీ విద్యార్థి షోయబ్ కాగా, మరొకరు బార్బర్ గా పనిచేస్తున్న నజీమ్..
వీరు ముగ్గురూ కలిసి దళిత యువతిని ఓ హోటల్ కు తీసుకెళ్లారు. అక్కడ ఆ యువకులు ఆమెతో బలవంతంగా బీఫ్‌ తినిపించారు. అనంతరం ఇద్దరూ సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ తతంగాన్నంతటినీ వీడియో తీశారు. ఆ వీడియోను అడ్డుపెట్టుకుని ఆమెను బెదిరించడం ప్రారంభించారు. వెంటనే రూ.5లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఆమె అడిగిన డబ్బు ఇవ్వకపోవడంతో ఆ వీడియోను సదరు యువతికి కాబోయే భర్తకు పంపించారు. దీంతో విసిగిపోయిన ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితులపై కేసు పెట్టింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎస్సీ, ఎస్టీ చట్టంలోని సంబంధిత సెక్షన్ల పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేశారు.

READ MORE  జోధ్‌పూర్‌లో దారుణం: బాయ్ ఫ్రెండ్ ఎదురుగానే బాలికపై ముగ్గురు విద్యార్థుల సామూహిక అత్యాచారం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *