Home Business No Tax Till ₹12 Lakh | మోదీ 3.0 బడ్జెట్‌లో మధ్యతరగతి ప్రజలకు భారీ...

No Tax Till ₹12 Lakh | మోదీ 3.0 బడ్జెట్‌లో మధ్యతరగతి ప్రజలకు భారీ ఊరట

0
14
Union Budget 2025
Spread the love

Union Budget 2025 : కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఈసారి మధ్యతరగతిపై ప్రత్యేక దృష్టి సారించింది. పన్ను చెల్లింపుదారులందరికీ పెద్ద బొనాంజాగా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన కేంద్ర బడ్జెట్ లో భారీ ఊరట కల్పించింది. రూ. 12 లక్షల వరకు ఆదాయంపై ఎలాంటి ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని ప్రకటించారు. స్టాండర్డ్ డిడక్షన్‌లో రూ. 75,000 లెక్కన జీతం పొందే పన్ను చెల్లింపుదారులకు ఈ పరిమితి రూ. 12.75 లక్షలు అవుతుంది. కొత్త ఆదాయపు పన్ను విధానం (ఎన్టీఆర్) సరళంగా ఉంటుందని, మధ్యతరగతి ప్రజలకు ప్రయోజనం చేకూర్చడంపై ప్రత్యేక దృష్టి సారించామని ఆమె పేర్కొన్నారు.

కొత్త పన్ను విధానంలో కొత్త పన్ను స్లాబ్‌లు

కొత్త పన్ను శ్లాబ్‌ల ప్రకారం ఆదాయం రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు ఉంటే ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం ఉండదు. కొత్త పాలనలో రూ.12 లక్షల ఆదాయం కలిగిన పన్ను చెల్లింపుదారు రూ. 80,000 పన్ను ప్రయోజనం పొందుతారు.

Union Budget 2025 : కొత్త ప‌న్ను విధానం ఇదీ…

  • రూ.0-4 లక్షలు – సున్నా
  • రూ.4-8 లక్షలు – 5 శాతం
  • రూ.8-12 లక్షలు – 10శాతం
  • రూ.12-16 లక్షలు – 15శాతం
  • రూ.16-20 లక్షలు – 20శాతం
  • రూ.20-24 లక్షలు – 25శాతం
  • రూ..24 లక్షల పైన 30 శాతం

పన్నుల రూపంలో ఎంత ఆదా చేశారు?

సెక్షన్ 80CCC కింద రూ. 1.5 లక్షల మినహాయింపు, గృహ రుణాలపై వడ్డీ చెల్లించడానికి రూ. 1.5 లక్షల మినహాయింపు వంటి ఆదాయపు పన్ను చట్టంలోని వివిధ సెక్షన్ల కింద పన్ను చెల్లింపుదారు ఉపశమనం పొందవచ్చు. “రూ. 12 లక్షల వరకు పన్ను చెల్లింపుదారులకు సాధారణ ఆదాయం (మూలధన లాభాలు వంటి ప్రత్యేక రేటు ఆదాయం కాకుండా) పన్ను రాయితీని వారు చెల్లించాల్సిన పన్ను లేని విధంగా స్లాబ్ రేటు తగ్గింపు వల్ల ప్రయోజనంతో పాటుగా అందించబడుతోంది” , అని సీతారామన్ అన్నారు.
రూ. 18 లక్షల ఆదాయం ఉన్న వ్యక్తి పన్ను రూపంలో రూ. 70,000 ప్రయోజనం పొందుతారు. 25 లక్షల ఆదాయం ఉన్న వ్యక్తి కొత్త పన్ను స్లాబ్‌ల కింద రూ. 1,10,000 ప్రయోజనం పొందుతారు.

వివిధ శాఖ‌ల‌కు కేటాయింపులు ఇవీ

  • రక్షణ రూ. 4,91,732 కోట్లు,
  • గ్రామీణాభివృద్ది రూ. 2,66,817 కోట్లు,
  • హోం రూ. 2,33,211 కోట్లు,
  • వ్యవసాయ, అనుబంధ రంగానికి రూ. 1,71,437 కోట్లు,
  • విద్య రూ. 1,28,650 కోట్లు,
  • ఆరోగ్య రూ. 98,311 కోట్లు,
  • పట్టణాభివృద్ది రూ. 96,777 కోట్లు,
  • ఐటి, టెలికం రూ. 95,298 కోట్లు,
  • విద్యుత్‌ రూ. 81,174 కోట్లు,
  • వాణిజ్య, పరిశ్రమలు రూ. 65,553 కోట్లు,
  • సామాజిక సంక్షేమం రూ. 60,052కోట్లు,
  • వైజ్ఞానికి విభాగాలకు రూ. 55,679 కోట్లు

తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి.  అలాగే మా  గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్)ఫేస్ బుక్,  వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

🇮🇳 జాతీయ ప్రయోజనాలే పరమావధిగా.. 🇮🇳

వందేభారత్ డిజిటల్ సైన్యంలో చేరండి!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here