IRCTC Divya Dakshin Yatra | తెలుగు రాష్ట్రాల నుంచి భారత్ గౌరవ్ రైలు.. 9 రోజుల్లో 7 పుణ్యక్షేత్రాలు సందర్శించండి..

IRCTC Divya Dakshin Yatra

IRCTC Divya Dakshin Yatra : దక్షిణ భారతదేశంలోని జ్యోతిర్లింగ క్షేత్రాలు అలాగే ప్రముఖ దేవాలయాలను దర్శించుకోవాలనే భక్తుల కోసం ఐఆర్సీటీసీ భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ ద్వారా ‘దివ్య దక్షిణ యాత్ర’ టూర్ ప్యాకేజీని తీసుకువచ్చింది. తిరువణ్ణామలై ( అరుణాచలం) – రామేశ్వరం – తిరువనంతపురం – కన్యాకుమారి-తంజావూరును కవర్ చేస్తూ, 2AC, 3AC, SL కోచ్ లతో భారత్ గౌరవ్ టూరిస్ట్‌ రైలు టూర్ ప్యాకేజీ సికింద్రాబాద్ స్టేషన్ నుంచి అందుబాటులో ఉంది. తొమ్మిది … Read more

Dibrugarh Express accident : 13 రైళ్లు దారి మళ్లింపు.. మ‌రికొన్ని రద్దు.. పూర్తి జాబితా ఇదే..

Trains Cancelled in Secundrabad

Dibrugarh Express accident  | ఉత్తరప్రదేశ్‌లోని గోండాలో గురువారం దిబ్రూఘర్ ఎక్స్‌ప్రెస్‌లోని 10 నుండి 12 కోచ్‌లు పట్టాలు తప్పడంతో కనీసం 13 రైళ్లు ప్రభావితమయ్యాయి. లక్నో గోండా గోరఖ్‌పూర్ మార్గంలోని అనేక రైళ్లను దారి మళ్లించి నడుపుతున్నారు. మరికొన్ని రైళ్లను రద్దు చేశారు. ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.  ఈ ప్రమాదంలో 20 మంది గాయపడ్డారని ఉత్తరప్రదేశ్ రిలీఫ్ కమిషనర్ జిఎస్ నవీన్ కుమార్ తెలిపారు. 40 మంది సభ్యులతో కూడిన వైద్య బృందం … Read more

charlapalli railway terminal | పూర్తి కావొచ్చిన చర్లపల్లి రైల్వే టెర్మినల్.. జంటనగరాల్లో నాలుగో అతిపెద్ద రైల్వేస్టేషన్

charlapalli railway terminal

హైదరాబాద్ శివారులోని  చర్లపల్లి శాటిలైట్ టెర్మినల్ స్టేషన్‌ (charlapalli railway terminal) లో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దాదాపు 90 శాతం ప్రాజెక్టు పూర్తయిందని రైల్వే మంత్రిత్వ శాఖ వెల్లించింది. ఇది అందుబాటులోకి వచ్చిన తర్వాత, ఈ స్టేషన్ హైదరాబాద్ జంట నగరాల్లో నాలుగవ అతిపెద్ద టెర్మినల్ స్టేషన్‌గా నిలవనుంది. అంతేకాకుండా ఈ చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి  15  రైళ్లను నడిపించనున్నామని మంత్రిత్వ శాఖ  X లో ఒక పోస్ట్‌లో పేర్కొంది. మొత్తం 9 … Read more

Indian Street Food | ఆటోమెటిక్ గా పానిపూరీ అందించే యంత్రం.. సోషల్ మీడియాలో వైరల్..

automatic pani-puri vending machine

Pani-Puri | భారతదేశంలో పానీ పూరీపై ఉన్న ప్రేమ అంద‌రికీ తెలిసిందే.. సాయంత్రం అయిందంటే చాలు చిన్నా పెద్ద అనే తేడా లేకుండా పానీ పూరి బండి వ‌ద్దకు చేరుతారు.. ఈస్ట్రీట్ ఫుడ్ కరకరలాడే పూరీ, అద్భుత‌మైన రుచి ప్రపంచవ్యాప్తంగా ఆహార ప్రియులను ఫిదా చేస్తుంది. అయితే ఇప్పుడు, బెంగుళూరులో ఆటోమేటిక్ పానీ పూరీ వెండింగ్ మెషీన్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. ఈ Pani-Puri వెండింగ్ మెషీన్ ఫొటో బెంగళూరులోని హోసూర్-సర్జాపూర్ రోడ్ లేఅవుట్‌లో తీశారు. … Read more

PM Modi followers | సోషల్ మీడియాలో మోదీకి తిరుగులేని రికార్డు.. ఎక్స్ లో 100మిలియన్లకు చేరిన ఫాలోవర్లు..

PM Modi followers | సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో అత్యధికంగా ఫాలో అయ్యే ప్రపంచ నేతగా 100 మిలియన్ల మంది ఫాలోవర్లను అధిగమించి స‌రికొత్త రికార్డు సృష్టించారు. ప్రధాని నరేంద్ర మోదీ. ఈ కీల‌క‌మైన మైలు రాయి డిజిటల్ ప్రపంచంలో ఆయ‌నకు ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న విస్తృతమైన‌ ప్రజాదరణను చాటుతుంది. ఈ మైలురాయితో, ప్రధాని మోదీ ఇతర ప్రపంచ నాయకుల నుంచి తనను తాను వేరు చేసుకున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌కు ప్రస్తుతం 38.1 … Read more

Jagannath Rath Yatra | జగన్నాధ రథయాత్ర సన్నద్ధం.. రెండ్రోజులు సెలవు ప్రకటించిన ఒడిశా

Jagannath Rath Yatra 2024

Puri Jagannath Rath Yatra | ఒడిశాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే జగన్నాథ‌ రథయాత్ర పూరీ క్షేత్రం స‌న్న‌ద్ధమవుతోంది. ర‌థ‌యాత్ర కోసం భారీ ఏర్పాట్లు పూర్తికావచ్చాయని ఒడిశా సీఎం మోహన్‌ చరణ్‌ మాఝీ వెల్లడించారు. రథయాత్ర సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా రెండు రోజులు సెలవు ప్రకటించారు. జూలై 7న జగన్నాథ రథయాత్రకు విస్తృత ఏర్పాట్లు చేశామని ముఖ్యమంత్రి తెలిపారు. రథయాత్రకు సంబంధించిన ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో అత్యున్నత స్ధాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. రథయాత్రకు హాజరు కానున్న రాష్ట్రపతి ముర్ము … Read more

Bengaluru | వేడి దోస స‌ర్వ్ చేయని హోటల్ కు షాక్.. రూ.7000 జ‌రిమానా..

Bengaluru Udupi Hotel

Bengaluru Udupi Hotel | బెంగళూరు అర్బన్ జిల్లాలోని జాతీయ రహదారికి సమీపంలోని రెస్టారెంట్ కు వినియోగ‌దారుల క‌మిష‌న్ జ‌రిమానా విధించింది. కస్టమర్‌కు వేడివేడి.. శుభ్ర‌మైన‌ ఆహారాన్ని అందించనందుకు ఈ చ‌ర్య తీసుకుంది. జూన్ 19న మొదటి అదనపు జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ఉడిపి గార్డెన్ రెస్టారెంట్‌కు రూ.7,000 చెల్లించాలని ఆదేశించింది. బెంగుళూరులోని కోరమంగళకు చెందిన 56 ఏళ్ల తహారా, 2022 జూలై 30న ఫ్యామిలీ ట్రిప్ కోసం హాసన్‌కు వెళ్తుండగా బ్రేక్‌ఫాస్ట్ కోసం … Read more

IRCTC | మీ ఐడీతో ఇతరుల కోసం టికెట్లు బుక్‌ చేస్తే జైలుకే.. ఐఆర్‌సీటీసీ కొత్త రూల్స్

Train Ticket Booking

IRCTC Ticket Booking Rules | మీ స్నేహితులకో, మీకు తెలిసిన వారికో మీ వ్యక్తిగత ఐఆర్‌సీటీసీ ఐడీతో ఆన్‌లైన్‌లో రైల్వే టిక్కెట్లు బుక్‌ చేస్తున్నారా? అయితే జాగ్రత్త.. అలా చేస్తే మీకు జైలు శిక్షతోపాటు , భారీ జరిమానా విధించే ప్ర‌మాదం ఉంది. రైల్వే టికెట్‌ రిజర్వేషన్లకు సంబంధించి ప్రభుత్వం తాజాగా కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చింది. మీరు మంచి ఉద్దేశంతో ఇత‌రులకు టికెట్‌ బుకింగ్ కోసం మీ వ్యక్తిగత IDని ఉపయోగించడం ఇక‌పై నేరంగా … Read more

Vande Bharat | ప్రయాణీకులకు శుభవార్త: భారతదేశపు మొదటి వందే భారత్ స్లీపర్ రైళ్లు 2 నెలల్లో ట్రాక్‌లోకి..

Vande Bharat Sleeper

Vande Bharat Sleeper Trains | ప్రపంచంలోని అతిపెద్ద రైలు నెట్‌వర్క్‌లలో ఒకటైన భారతీయ రైల్వే..  తన ప్రయాణికులకు మెరుగైన ప్రయాణ అనుభవాన్ని అందించడానికి నిరంతరం అప్‌గ్రేడ్ అవుతూనే ఉంది.  ఈ క్రమంలోనే త్వరలో భారతదేశపు మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ రైళ్లను ప్రవేశపెట్టేందుకు రైల్వేలు రెడీ అయ్యాయి. రెండు నెలల్లో వందే భారత్ స్లీపర్ రైళ్లు పట్టాలెక్కనున్నాయని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. వందే భారత్ స్లీపర్ రైలుకు సంబంధించి అన్ని సాంకేతిక పనులు … Read more

Vadodara society | ప్రభుత్వ పథకం కింద ముస్లిం మహిళకు ఫ్లాట్‌ను కేటాయించినందుకు వడోదర సొసైటీ సభ్యులు నిరసన

Vadodara society members protest

Vadodara society members protest| ముఖ్యమంత్రి ఆవాస్ యోజన కింద ముస్లిం మహిళకు ఫ్లాట్ కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ వడోదర నగరం హర్నిలోని సొసైటీ నివాసితులు నిరసన తెలిపారు. ఎంట్రప్రెన్యూర్‌షిప్ అండ్ స్కిల్ డెవలప్‌మెంట్ మంత్రిత్వ శాఖలో పనిచేస్తున్న 44 ఏళ్ల ముస్లిం మహిళకు 2017లో తక్కువ ఆదాయ వర్గాలకు చెందిన గృహ సముదాయంలో ఫ్లాట్ కేటాయించారు. అయితే ఆమె ఫ్లాట్ లోకి వచ్చే ముందే,  ఆమె రాకను వ్యతిరేకిస్తూ..  గృహ సముదాయంలోని 30 మంది నివాసితులు జిల్లా … Read more