Sunday, July 6Welcome to Vandebhaarath

Tag: RAILWAYS

Holi special trains : హోలీ పండుగ వేళ.. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 14 ప్రత్యేక రైళ్లు..
Andhrapradesh, Telangana

Holi special trains : హోలీ పండుగ వేళ.. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 14 ప్రత్యేక రైళ్లు..

Holi special trains : హోలీ పండుగ సంద‌ర్భంగా ప్రయాణికుల రద్దీ పెరిగే అవ‌కాశం ఉండ‌డంతో దక్షిణ మధ్య రైల్వే (SCR) దేశవ్యాప్తంగా ప్రధాన గమ్యస్థానాలను కలుపుతూ 14 ప్రత్యేక హోలీ రైళ్లను ప్రకటించింది. ప్రయాణీకులు తమకు ఇష్ట‌మైన‌ వారితో పండుగ జరుపుకునేలా SCR ఈ ప్రత్యేక సేవలను ఏర్పాటు చేసిందని అధికారిక ప్రకటనలో తెలిపింది. ఈ ప్రత్యేక రైళ్లు మార్చి 2025లో వేర్వేరు తేదీల్లో నడుస్తాయి, ఇవి చ‌ర్లపల్లి రైల్వే టెర్మిన‌ల్‌, షాలిమార్, సంత్రాగచి, జల్నా, పాట్నా వంటి కీలక మార్గాలను కవర్ చేస్తాయి.ఈ స్టేష‌న్ల‌లో హాల్టింగ్ఈ మార్గాల్లో తెలుగు రాష్ట్రాల్లోని నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, అనకాపల్లి, విజయనగరంలో ప్ర‌త్యేక రైళ్ల‌కు హాల్టింగ్ సౌక‌ర్యం ఉటుంది. అలాగే ఒడిశా భువనేశ్వర్, కటక్, ఖరగ్‌పూర్‌తో సహా ప్రధాన రైల్వే స్టేషన్లలో ఆగుతారు. జ...
Vande Bharat | వందే భారత్ ఎక్స్‌ప్రెస్ నెట్‌వర్క్ 136 సర్వీసులు.. ఏ రాష్ట్రంలో అత్యధిక రైళ్లు ఉన్నాయి?
Trending News

Vande Bharat | వందే భారత్ ఎక్స్‌ప్రెస్ నెట్‌వర్క్ 136 సర్వీసులు.. ఏ రాష్ట్రంలో అత్యధిక రైళ్లు ఉన్నాయి?

Full list of Vande Bharat Express trains | డిసెంబర్ 2024 నాటికి భారతీయ రైల్వే నెట్‌వర్క్‌లో 136 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసులను నడుపుతోంది. వీటిలో ఎక్కువగా 16 వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు తమిళనాడులో సేవలందిస్తున్నాయి. ఇక ఢిల్లీ నుంచి బనారస్‌ మధ్య వందేభారత్ రైలు దేశంలో ఎక్కువ దూరం (771 కి.మీ.) ప్రయాణిస్తుంది. ఈ సెమీ-హై-స్పీడ్ రైళ్లు అత్యాధునిక భద్రతా ఫీచర్లు, ఆధునిక సౌకర్యాలతో దేశంలో తక్కువస సమయంలోనే బాగా జనాదరణ పొందాయి. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, ట్రాఫిక్ డిమాండ్, వనరుల లభ్యత వంటి అంశాలపై ఆధారపడి, కొత్త వందేభారత్ సేవలను, వాటి వేరియంట్‌ల ను దేశవ్యాప్తంగా విస్తరించనున్నట్లు పేర్కొన్నారు.వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల పూర్తి జాబితా(Full list of Vande Bharat Express trains )20830 - విశాఖపట్నం-దుర్గ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్20833 - విశాఖపట్నం సికిం...
Kavach System |  ఇక రైల్వేల్లో యుద్ధప్రాతిప‌దిక‌న క‌వ‌చ్ వ్య‌వ‌స్థ ఏర్పాటు : అశ్విని వైష్ణవ్
National

Kavach System | ఇక రైల్వేల్లో యుద్ధప్రాతిప‌దిక‌న క‌వ‌చ్ వ్య‌వ‌స్థ ఏర్పాటు : అశ్విని వైష్ణవ్

Indian Railways | రైలు ప్ర‌మాదాల నివార‌ణ‌కు క‌వాచ్ టెక్నాలజీ ( Kavach System  )ని ఇప్పుడు దేశంలో మిషన్ మోడ్‌లో అమలు చేయనున్నట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. హై టెక్నాలజీ, కఠినమైన భద్రతకు మారుపేరుగా కవాచ్ ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ (ATP) వ్యవస్థ గుర్తింపు పొందింది. అయితే ఇప్పుడు భార‌తీయ రైల్వేల్లోని అన్ని రూట్ల‌లో ఇప్పుడు వేగంగా ఇన్ స్టాల్ చేయ‌నున్న‌ట్లు కేంద్ర ప్ర‌భుత్వం వెల్ల‌డించింది.ఈ వ్యవస్థ అవసరమైతే ఆటోమెటిక్ గా బ్రేక్‌లను వేయ‌డం ద్వారా అత్య‌వ‌స‌ర స‌మ‌యాల్లో రైలు ప్ర‌మాదాలు జ‌ర‌గ‌కుండా అడ్డుకుంటుంది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో రైలును సురక్షితంగా నడిపేలా చేస్తుంది. ఇటీవ‌ల కాలంలో ప‌లుచోట్ల రైలు ప్ర‌మాదాలు జ‌ర‌గ‌గా పెద్ద సంఖ్య‌లో ప్ర‌యాణికులు ప్రాణాలు కోల్పోయారు. రైల్వే ఆస్తులు ధ్వంస‌మ‌య్యాయి ఈ నేప‌థ్యంలోనే క‌వ‌చ్ ఇన్‌స్టాలేషన్ (Kavach System  ) విష‌య‌మై కేంద్రం ...
SCR Special Trains | ప్రయాణికులకు గుడ్ న్యూస్‌.. 60 ప్రత్యేక రైళ్లను పొడిగింపు ..వివ‌రాలు ఇవే..
Andhrapradesh, Telangana

SCR Special Trains | ప్రయాణికులకు గుడ్ న్యూస్‌.. 60 ప్రత్యేక రైళ్లను పొడిగింపు ..వివ‌రాలు ఇవే..

SCR Special Trains | ప్ర‌యాణికుల‌కు దక్షిణ మధ్య రైల్వే తీపి క‌బురు చెప్పింది. ప్రస్తుతం వివిధ మార్గాల్లో నడుస్తున్న 60 ప్రత్యేక రైళ్లను మ‌రికొంత కాలం పొడిగిస్తున్నట్లు వెల్ల‌డించింది. అక్టోబరు నుంచి డిసెంబర్‌ నెలాఖరు వరకు ఆయా ప్రత్యేక రైళ్లు య‌థావిథిగా న‌డిపించ‌నున్న‌ట్లు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. రాబోయే దసరా, దీపావళి, ఛట్‌పూజ పండుల్లో ప్ర‌యాణికుల‌ రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్ర‌త్యేక‌ రైళ్లను పొడిగిస్తున్నట్లు వివ‌రించింది. పొడిగించిన ప్రత్యేక రైళ్లను ప్రయాణికులు స‌ద్వినియోగం చేసుకోవాల‌ని కోరింది.పొడిగించిన రైళ్లలో ఆంధ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణ‌ రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాల మధ్య నడిచే సుదూర‌ రైళ్లు ఉన్నాయి. కింది రైళ్లు డిసెంబ‌ర్ వ‌ర‌కు న‌డుస్తాయి.సికింద్రాబాద్‌-రామనాథపురం (07695), రామనాథపురం-సికింద్రాబాద్‌ (07696), కాచిగూడ – మధురై (07191), మధురై – కా...
Railway Track Security | రైలు ప్రమాదాల కట్టడికి భారతీయ రైల్వే కీలక నిర్ణయం..
National

Railway Track Security | రైలు ప్రమాదాల కట్టడికి భారతీయ రైల్వే కీలక నిర్ణయం..

Railway Track Security | దేశంలో ఇటీవ‌ల చోటుచేసుకుంటున్న రైలు ప్ర‌మాదాలు ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో రైలు ప్ర‌మాదాలను నివారించేందుకు భార‌తీయ రైల్వే కీల‌క నిర్ణ‌యం తీసుకుందిన ఆగస్ట్ 17న కాన్పూర్ - భీమ్‌సేన్ జంక్షన్ మధ్య అహ్మదాబాద్-బౌండ్ సబర్మతి ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పిన విష‌యం తెలిసిందే.. మ‌రోసారి ఇలాంటి సంఘటనలు జ‌ర‌గ‌కుండా రైల్వే ట్రాక్ పెట్రోలింగ్‌ను ముమ్మరం చేసింది. కొంద‌రు దుండ‌గులు ఉద్దేశ‌పూర్వ‌క‌గాట్రాక్‌పై సైకిళ్లు, రాళ్లను పెడుతున్న‌ట్లు గుర్తించారు. దీంతో రౌండ్-ది-క్లాక్ ట్రాక్ భద్రతను మెరుగుపరచడానికి మంత్రిత్వ శాఖ వివిధ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిష్కారాలను అన్వేషిస్తున్నట్లు నివేదికలు వెల్ల‌డిస్తున్నాయి.రైల్వే బోర్డు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF), ట్రాక్ మెయింటెయినర్‌ల ద్వారా అప్రమత్తతను పెంచాలని ఆదేశించింది. ఇప్పుడు రౌండ్-ది క్లాక్ పెట్రోలింగ్ కొన‌సాగుతూనే ఉంట...
Railways news | ప్రయాణికులకు గమనిక..  ఆగస్టు 11 వరకు పలు రైళ్లు రద్దు…!
Andhrapradesh

Railways news | ప్రయాణికులకు గమనిక.. ఆగస్టు 11 వరకు పలు రైళ్లు రద్దు…!

Cancellation OF Trains | దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని విజయవాడ డివిజన్.. నిడదవోలు-కడియం మధ్య రైల్వే లైన్ ఆధునికీకరణ పనులను ముమ్మరం చేసింది.  దీంతో జూన్ 23 నుంచి ఆగస్టు 11 వరకు పలు రైళ్లను రద్దు చేసింది.  ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ అధికారులు వెల్లడించారు.  గుంటూరు-విశాఖ ( సింహాద్రి), విశాఖ-లింగంపల్లి (జన్మభూమి), విజయవాడ-విశాఖ (రత్నాచల్), గుంటూరు-విశాఖ (ఉదయ్), విశాఖ-తిరుపతి (డబుల్ డెక్కర్), గుంటూరు-రాయగడ, విశాఖ-మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్ రైళ్లు, రాజమండ్రి-విశాఖ ప్యాసింజర్‌ను ఎగువ దిగువ మార్గాల్లో రద్దయ్యాయి. రద్దయిన రైళ్లు ఇవే.. జూన్ 24 నుంచి ఆగస్టు 10 వరకురాజమండ్రి – విశాఖ (07466) ప్యాసింజర్, విశాఖ-రాజమండ్రి (07467) ప్యాసింజర్, గుంటూరు-విశాఖ (17239) సింహాద్రి, విశాఖ- గుంటూరు (17240) సింహాద్రి, విజయవాడ-విశాఖ (12718) రత్నాచల్ ఎక్స్‌ప్రెస్, విశాఖ- విజయవాడ (12717) రత్నాచ...
IRCTC |  మీ ఐడీతో ఇతరుల కోసం టికెట్లు బుక్‌ చేస్తే జైలుకే.. ఐఆర్‌సీటీసీ కొత్త రూల్స్
Trending News

IRCTC | మీ ఐడీతో ఇతరుల కోసం టికెట్లు బుక్‌ చేస్తే జైలుకే.. ఐఆర్‌సీటీసీ కొత్త రూల్స్

IRCTC Ticket Booking Rules | మీ స్నేహితులకో, మీకు తెలిసిన వారికో మీ వ్యక్తిగత ఐఆర్‌సీటీసీ ఐడీతో ఆన్‌లైన్‌లో రైల్వే టిక్కెట్లు బుక్‌ చేస్తున్నారా? అయితే జాగ్రత్త.. అలా చేస్తే మీకు జైలు శిక్షతోపాటు , భారీ జరిమానా విధించే ప్ర‌మాదం ఉంది. రైల్వే టికెట్‌ రిజర్వేషన్లకు సంబంధించి ప్రభుత్వం తాజాగా కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చింది.మీరు మంచి ఉద్దేశంతో ఇత‌రులకు టికెట్‌ బుకింగ్ కోసం మీ వ్యక్తిగత IDని ఉపయోగించడం ఇక‌పై నేరంగా పరిగణించనున్నారు. చట్టపరమైన శిక్ష‌ల‌ను ఎదుర్కోకుండా ఉండటానికి తాజా నిబంధ‌న‌ల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం.. రైల్వే చట్టంలోని సెక్షన్ 143 ప్రకారం, అధికారికంగా నియమించబడిన ఏజెంట్లకు మాత్రమే థ‌ర్డ్‌ పార్టీల కోసం బుకింగ్‌లు చేయడానికి అధికారం ఉంటుంది. ఈ నియమాన్ని ఉల్లంఘిస్తే 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష, రూ.10,000 జరిమానా విధించవ‌చ్చు. ఇతరులకు IRCTC టికెట్ బుకింగ్‌పై పరిమితులు క...
kavach | కవచ్ అంటే ఏమిటి? రైళ్లు ఢీకొనకుండా ఎలా పనిచేస్తుంది?
Special Stories

kavach | కవచ్ అంటే ఏమిటి? రైళ్లు ఢీకొనకుండా ఎలా పనిచేస్తుంది?

kavach technology | ఒకే లైన్‌లో ఒకే సమయంలో రెండు రైళ్లు ప్రయాణిస్తే ఒక‌దానికొక‌టి ఢీకొన‌కుండా ఉండేందుకు పూర్తిగా స్వ‌దేశీ ప‌రిజ్ఞానంతో రూపొందించిన భ‌ద్ర‌తా వ్య‌వ‌స్థనే ఈ కవాచ్.. అయితే ఈరోజు ప‌శ్చిమ బెంగ‌ల్ డార్జిలింగ్‌లో రెండు రైళ్లు ఢీకొన్న ట్రాక్‌లపై ఈ భ‌ద్ర‌తా వ్య‌వ‌స్థ అందుబాటులో లేదు. కోల్‌కతాకు వెళ్లే కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్‌ను వెనుక నుంచి గూడ్స్ రైలు ఢీకొనడంతో కనీసం ఎనిమిది మంది ప్రయాణికులు మరణించారు. 50 మందికి పైగా గాయపడ్డారు. అయితే గ‌తంలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కవాచ్ సిస్టమ్‌ గురించి వివరిస్తున్న పాత వీడియో ఒక‌టి వైరల్ అవుతోంది. ఈ వ్యవస్థను ఇంకా చాలా రైలు నెట్‌వర్క్‌లో ఇన్‌స్టాల్ చేయలేదని అధికారులు తెలిపారు.వచ్చే ఏడాది నాటికి 6,000 కి.మీ ట్రాక్‌లను కవర్ చేయాలనే లక్ష్యంతో ఢిల్లీ-గౌహతి మార్గంలో భద్రతా వ్యవస్థను అమలు చేయాలని భార‌తీయ‌ రైల్వే యోచిస్తోంది. బెంగాల్ ఈ ఏడాది కవ...
Railways News | ప్ర‌యాణికులకు గుడ్ న్యూస్‌.. రైళ్ల‌లో పెర‌గ‌నున్న కోచ్‌ల సంఖ్య
National

Railways News | ప్ర‌యాణికులకు గుడ్ న్యూస్‌.. రైళ్ల‌లో పెర‌గ‌నున్న కోచ్‌ల సంఖ్య

Railways News | న్యూఢిల్లీ: కేంద్ర రైల్వే మంత్రిగా వరుసగా రెండోసారి బాధ్యతలు స్వీకరించిన వెంటనే అశ్విని వైష్ణవ్ ఈ క్యాలెండర్ ఇయర్‌కు లక్ష్యాలను నిర్దేశించుకున్నారు. వైష్ణవ్ తన బాధ్యతలను స్వీకరించిన వెంట‌నే రైల్వే ఉన్న‌తాధికారుల‌తో సమావేశం నిర్వ‌హించారు. ప్ర‌యాణికుల‌కు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు కోచ్‌లను పెంచడం ద్వారా రద్దీని తగ్గించాల‌ని నిర్ణ‌యించారు. డిమాండ్ ఎక్కువ‌గా ఉన్న మార్గాల్లో ప్రయాణీకుల రద్దీకి అనుగుణంగా క్లోన్ రైలు అని పిలువబడే అదనపు రైళ్ల‌ను నడపాల‌ని భావిస్తున్న‌ట్లు రైల్వే వ‌ర్గాలు తెలిపాయి. వేసవిలో అత్యధిక ప్రయాణ రద్దీని త‌గ్గించ‌డానికి ఈ ఏడాది ఏప్రిల్‌లో ఇండియ‌న్ రైల్వే అద‌న‌పు రైళ్ల‌ను న‌డిపించిన విష‌యం తెలిసిందే.. .వందే మెట్రోను వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు ప్రభుత్వం కూడా ఆసక్తిగా ఉందని అధికారులు తెలిపారు. "రెండు వందే మెట్రో కోచ్‌ల ఉత్పత్తి పూర్తయింది. ట్రయల్స్ ఏ ర...
Coach Restaurant | వరంగల్ రైల్వే స్టేషన్ లో త్వరలో కోచ్ రెస్టారెంట్..
Local

Coach Restaurant | వరంగల్ రైల్వే స్టేషన్ లో త్వరలో కోచ్ రెస్టారెంట్..

Coach Restaurant | భోజన ప్రియులకు సంతోషకరమైన వార్త! భారతీయ రైల్వేలు అత్యాధునిక రీతిలో రూపొందించిన‌ రైల్ కోచ్ రెస్టారెంట్..  రైలు ప్రయాణీకులు, సామాన్య ప్రజలకు ఎంతో దగ్గరయ్యాయి. ఇప్పటికే దేశంలోని ప్రధాన నగరాల్లో ఈ కోచ్ రెస్టారెంట్లు ప్రజాదరణ పొందాయి. తాజాగా వ‌రంగ‌ల్ రైల్వే స్టేషన్‌లో త్వ‌ర‌లో ఈ చక్రాలపై రెస్టారెంట్ ను అందుబాటులోకి తీసుకురానున్నారు.వరంగల్ రైల్వే స్టేషన్లో త్వరలో ''కోచ్ రెస్టారెంట్' ఏర్పాటు చేయనున్నట్లు సికింద్రాబాద్ డివిజనల్ ఏడీఆర్ఎం(ఐ) గోపాల్ తెలిపారు. అమృత్ భారత్ పథకంలో భాగంగా వరంగల్ రైల్వేస్టేషన్లో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను ఆయన అధికారులతో కలిసి ఇటీవ‌ల‌ పరిశీలించారు. IOW కార్యాలయం ఎదుట త్వరలో ఏర్పాటు చేయనున్న కోచ్ రెస్టారెంట్ స్థలాన్ని, అలాగే మొదటి ప్లాట్ ఫాం వైపు ఉన్న ప్రీపెయిడ్ వెయిటింగ్ హాల్ పనులను కూడా ఆయ‌న పరిశీలించారు. ఈ కోచ్ రెస్టారెంట్ ఏంటి? Rail Coach R...
Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..
Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..