Hyderabad Metro : న్యూ ఇయర్ జోష్.. మెట్రో రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్..
Hyderabad Metro : హైదరాబాద్: న్యూ ఇయర్ వేడుకల (New year 2025) సందర్భంగా ప్రయాణికుల సౌకర్యార్థం హైదరాబాద్ మెట్రో రైలు కీలక ప్రకటన చేసింది. రేపు, డిసెంబర్ 31 అర్ధరాత్రి వరకు మెట్రో సేవలను పొడిగించినట్లు పేర్కొంది. చివరి రైలు స్టేషన్ నుంచి 12:30 AMకి బయలుదేరుతుంది, అర్ధరాత్రి 1:15 AM వరకు రైలు చివరి గమ్యస్థానానికి చేరుకుంటుందని తెలిపింది. కొత్త సంవత్సరం వేడుకలను జరుపుకునే వారికి సౌకర్యవంతమైన రవాణా సౌకర్యాలను అందిస్తున్నట్లు పేర్కొంది.ఈ మేరు హైదరాబాద్ మెట్రో మేనేజింగ్ డైరెక్టర్, NVS రెడ్డి సోమవారం మాట్లాడుతూ అన్ని టెర్మినల్ స్టేషన్ల నుండి చివరి మెట్రో రైలు 12:30 గంటలకు బయలుదేరి, జనవరి 1, 2025 న తెల్లవారుజామున 1:15 గంటలకు సంబంధిత ఎండ్ పాయింట్లకు చేరుకుంటుంది. ఈ మెట్రో సేవల విస్తరణతో అర్థరాత్రి వేళ ప్రయాణికులకు సురక్షితంగా, సౌకర్యవంతంగా ఉంటుందని తెలిపారు.లేట్ నైట...