Home తాజా వార్తలు Modi cabinet 2024 | 30 ఏళ్ల రాజ‌కీయ అనుభ‌వంలో మొట్ట‌మొద‌టిసారి కేంద్ర మంత్రి ప‌ద‌వి

Modi cabinet 2024 | 30 ఏళ్ల రాజ‌కీయ అనుభ‌వంలో మొట్ట‌మొద‌టిసారి కేంద్ర మంత్రి ప‌ద‌వి

0
11
Shivraj Singh Chouhan
Shivraj Singh Chouhan (Credit : X)
Spread the love

Shivraj Singh Chouhan | బీజేపీ సీనియ‌ర్ నేత శివ‌రాజ్ సింగ్ చౌహాన్‌.. 30 ఏళ్ల‌కు పైగా పార్టీ ప‌ద‌వుల్లో సేవ‌లందిస్తున్నారు. నాలుగు సార్లుముఖ్య‌మంత్రిగా ప‌నిచేశారు. కానీ గత ఏడాది ఐదవసారి ముఖ్యమంత్రిగా అవ‌కాశం ఇవ్వ‌కుండా దూరం పెట్టింది. శివరాజ్ సింగ్ చౌహాన్ మధ్యప్రదేశ్‌లోని విదిషా లోక్‌సభ స్థానం నుంచి ఆరోసారి రికార్డు స్థాయిలో 8.21 లక్షల ఓట్ల తేడాతో ఘ‌న విజయం సాధించారు.

నాలుగుసార్లు ఎంపీగా ఎన్నికైన మాజీ ముఖ్యమంత్రి శివ‌రాజ్ సింగ్ చౌహాన్‌.. 15 నెలల కాంగ్రెస్ పాలనను మినహాయించి (2018లో) 18 ఏళ్లకు పైగా సీఎంగా ఉన్న సమయంలో, చౌహాన్ తనను తాను బలహీనమైన రాజకీయ నాయకుడి నుంచి అసమానమైన కృషితో తెలివైన‌, స‌మ‌ర్థ‌వంత‌మైన నేత‌గా ఎదిగారు.

65 ఏళ్ల చౌహాన్ రాష్ట్రంలో 2024 లోక్‌సభ ఎన్నికలలో బిజెపి ప్రచారానికి నాయకత్వం వహించారు. రాష్ట్రాన్ని మ‌రింత‌ అభివృద్ధి చేస్తాన‌ని వాగ్దానం చేస్తూ ప్రజల్లో తానూ ఒకడిగా చూపించాడు. లోక్ స‌భ ఎన్నిక‌ల్లో మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో 29 స్థానాల‌కు 29 స్థానాల‌ను గెలుచుకొని సత్తా చాటారు. మూడు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో చౌహాన్ ఆదివారం తొలిసారిగా కేంద్ర క్యాబినెట్ మంత్రి అయ్యారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు మధ్యప్రదేశ్‌లో జరిగిన ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ ఆయనను ప్రశంసించిన తర్వాత కేంద్ర మంత్రివర్గంలోకి ఆయనను తీసుకుంటార‌ని స్పష్టమైంది.

Shivraj Singh Chouhan రాజ‌కీయ ప్ర‌స్థానం..

శివ‌రాజ్ 1975లో మోడల్ హయ్యర్ సెకండరీ స్కూల్ స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైనప్పుడు అతని నాయకత్వ ప్ర‌తిభ‌ మొదటిసారిగా వెలుగులోకి వచ్చింది. అతను ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో పాల్గొన్నారు. 1976-77లో, రాజకీయ ఆందోళనలు, ప్రజా ఉద్య‌మాల్లో పాల్గొని అనేక సందర్భాలలో జైలు శిక్ష అనుభవించారు.

1977 నుంచి RSS వాలంటీర్ గా ప‌నిచేశారు. , చౌహాన్ భోపాల్‌లోని బర్కతుల్లా విశ్వవిద్యాలయం నుండి మాస్టర్స్ ఆఫ్ ఫిలాసఫీలో గోల్డ్ మెడ‌ల్ సాధించారు.

అనంత‌రం బీజేపీ ప్రధాన కార్యదర్శిగా, పార్టీ మ‌ధ్య‌ప్ర‌దేశ్‌ విభాగానికి అధ్యక్షుడిగా కూడా పనిచేశారు.

చౌహాన్ 1990లో బుధ్ని నియోజకవర్గం నుంచి తొలిసారిగా ఎంపీ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ తర్వాతి సంవత్సరం విదిషా నియోజకవర్గం నుంచి తొలిసారిగా పార్లమెంటు సభ్యునిగా ఎన్నికయ్యారు. అతను 1996, 1998, 1999, 2004లో ఈ స్థానం నుంచి ఎన్నికయ్యారు. అతను తన ఐదవ లోక్‌సభ ఎన్నికల్లో 2,60,000 ఓట్ల ఆధిక్యతతో గెలిచారు..

2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు, ముఖ్యమంత్రి మోహన్ యాదవ్.. శివ‌రాజ్‌ చౌహాన్ రాష్ట్రంలో బిజెపికి విస్తృతంగా ప్రచారం చేశారు. అక్కడ కాంగ్రెస్ కంచుకోట చింద్వారాతో సహా మొత్తం 29 లోక్‌సభ స్థానాలను పార్టీ గెలుచుకుంది. ఇక్క‌డ 2019లో కాషాయ పార్టీ విజయం సాధించలేకపోయింది. .

2020లో, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయినప్పుడు, రాష్ట్రంలో COVID-19 మహమ్మారి తీవ్ర‌ స్థాయికి చేరుకున్నప్పుడు, బిజెపి కేంద్ర నాయకత్వం, ఆశ్చర్యకరంగా చౌహాన్‌ను నాల్గవసారి సిఎంగా ఎన్నుకుంది. కోట్లాది రూపాయల వ్యాపమ్ కుంభకోణంలో చౌహాన్‌ను ప్రతిపక్ష కాంగ్రెస్ ముడిపెట్టినప్పటికీ, అతను క్షేమంగా బయటపడ్డారు. ఈ కేసులో సీబీఐ ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చింది.


Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News) తోపాటు ఎక్స్ (X) , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి..  

🇮🇳 జాతీయ ప్రయోజనాలే పరమావధిగా.. 🇮🇳

వందేభారత్ డిజిటల్ సైన్యంలో చేరండి!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here