Home Trending News Railway Security : రైల్వే భద్రత కోసం కేంద్రం కీలక నిర్ణయం

Railway Security : రైల్వే భద్రత కోసం కేంద్రం కీలక నిర్ణయం

0
10
Spread the love

Railway Security | ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని భారత రైల్వే మంత్రిత్వ శాఖ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతి రైలులోని అన్ని కోచ్‌లలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. ఈమేరకు రైల్వే మంత్రిత్వ శాఖ విడుదల చేసిన పత్రికా ప్రకటన ప్రకారం.. ప్యాసింజర్ కోచ్‌లలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలనే నిర్ణయా రైల్వే(Indian Railways) ఆమోదించాయి. చాలా కాలంగా, నడుస్తున్న రైళ్లలో ప్రయాణికుల భద్రతకు సంబంధించి అనేక కేసులు వస్తుండడంతో భారతీయ రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది.

కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర రైల్వే సహాయ మంత్రి రవ్నీత్ సింగ్ బిట్టు.. ఇంజిన్లు, కోచ్‌లలో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు పురోగతిని సమీక్షించారు. “సీసీ కెమెరాల ఏర్పాటు ప్రయాణికుల భద్రతను మెరుగుపరుస్తుంది. దుండగులు, వ్యవస్థీకృత ముఠాలు అమాయక ప్రయాణికులను దోచుకుంటున్నారు. కెమెరాల ఏర్పాటు వల్ల ఇలాంటి సంఘటనలు తగ్గుతాయి. ప్రయాణీకుల గోప్యతను కాపాడటానికి, తలుపుల దగ్గర సాధారణ కదలిక ప్రాంతంలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తారు.

74,000 కోచ్‌లు, 15,000 లోకోమోటివ్‌లలో సీసీటీవీలు

ఉత్తర రైల్వేలోని లోకో ఇంజిన్లు, కోచ్‌లలో విజయవంతమైన ట్రయల్స్ నిర్వహించామనిరైల్వే అధికారులు తెలిపారు. మొత్తం 74,000 కోచ్‌లు, 15,000 లోకోలలో CCTV కెమెరాలను ఏర్పాటు చేయడానికి కేంద్ర మంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రతి రైల్వే కోచ్‌లో 4 డోమ్ రకం CCTV కెమెరాలు ఏర్పాటు చేయబడతాయి. ప్రతి ప్రవేశ మార్గంలో 2, ప్రతి లోకోమోటివ్‌లో 6 CCTV కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు.

డెస్క్ మౌంటెడ్ మైక్రోఫోన్లు

ఇందులో లోకోమోటివ్ ముందు, వెనుక, రెండు వైపులా ఒక్కొక్క కెమెరా ఉంటుంది. ప్రతి లోకో యొక్క క్యాబ్‌లో (ముందు, వెనుక) 1 డోమ్ CCTV కెమెరా, 2 డెస్క్ మౌంటెడ్ మైక్రోఫోన్‌లు ఏర్పాటు చేయనున్నారు. CCTV కెమెరాలు తాజా స్పెసిఫికేషన్‌లకు అనుగుణంగా ఉంటాయని, STQC సర్టిఫికేట్ కలిగి ఉంటాయని అధికారులు తెలియజేశారు. ఉత్తమ పరికరాల విస్తరణపై కేంద్ర రైల్వే మంత్రి నొక్కి చెప్పారు. రైళ్లు 100 కి.మీ. కంటే ఎక్కువ వేగంతో, తక్కువ కాంతి పరిస్థితులలో కూడా అధిక నాణ్యత గల ఫుటేజ్ అందుబాటులో ఉండేలా చూసుకోవాలని ఆయన రైల్వే అధికారులను కోరారు.

ఇండియా ఏఐ మిషన్ సహకారంతో సీసీటీవీ కెమెరాల ద్వారా సేకరించిన డేటాపై కృత్రిమ మేధస్సును ఉపయోగించే అవకాశాన్ని అన్వేషించాలని కేంద్ర రైల్వే మంత్రి అధికారులకు సూచించారని పేర్కొన్నారు. కోచ్‌ల ఉమ్మడి కదలిక ప్రాంతాలలో కెమెరాలను ఏర్పాటు చేయడం లక్ష్యం ప్రయాణీకుల భద్రతను మెరుగుపరచడం. గోప్యతను కాపాడుకుంటూనే, ఈ కెమెరాలు దుష్ట శక్తులను గుర్తించడంలో కూడా సహాయపడతాయని అధికారులు చెబుతున్నారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి.  అలాగే మా  గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్)ఫేస్ బుక్,  వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

🇮🇳 జాతీయ ప్రయోజనాలే పరమావధిగా.. 🇮🇳

వందేభారత్ డిజిటల్ సైన్యంలో చేరండి!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here