Home » Nalanda New Campus | నలంద యూనివర్శిటీ కొత్త క్యాంపస్‌.. పర్యావరణానికి అనుకూలం.. ఇందులో వాహనాలు కనిపించవు..
Nalanda New Campus

Nalanda New Campus | నలంద యూనివర్శిటీ కొత్త క్యాంపస్‌.. పర్యావరణానికి అనుకూలం.. ఇందులో వాహనాలు కనిపించవు..

Spread the love

Nalanda New Campus | బీహార్‌లోని రాజ్‌గిర్‌లో బుధవారం ఉదయం నలంద యూనివర్సిటీ కొత్త క్యాంపస్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, 17 దేశాల రాయబారులు పాల్గొన్నారు. నూతన క్యాంపస్ ను ప్రారంభించిన అనంతరం మొక్కను నాటారు. ప్రధాని మోదీ . పురాతన నలంద విశ్వవిద్యాలయం శిథిలాలను కూడా పరిశీలించారు.

అంతకుముందు X లో PM Modi తన అభిప్రాయాలను పంచుకున్నారు.  “ఇది మన విద్యా రంగానికి చాలా ప్రత్యేకమైన రోజు. ఈ రోజు ఉదయం 10:30 గంటలకు, రాజ్‌గిర్‌లో నలంద విశ్వవిద్యాలయం కొత్త క్యాంపస్ ప్రారంభమవుతుంది. నలందకు ఈ అద్భుతమైన భాగంతో బలమైన అనుబంధం ఉంది.

కొత్త క్యాంపస్ లో ఏమున్నాయి?

క్యాంపస్ రెండు అకడమిక్ బ్లాక్‌లుగా విభజించబడింది.  ఒక్కో బ్లాక్ లో 40 తరగతి గదులు ఉన్నాయి. మొత్తం సీటింగ్ కెపాసిటీ సుమారు 1900. ఇందులో రెండు ఆడిటోరియంలు ఉన్నాయి. ఒక్కొక్కటి 300 మంది సీటింగ్ కెపాసిటీతో ఉంటుంది. ఇక్కడ దాదాపు 550 మంది విద్యార్థులతో కూడిన హాస్టల్‌ని కలిగి ఉంది. అంతర్జాతీయ కేంద్రంలో 2000 మంది వరకు కూర్చునే ఆడిటోరియం. ఫ్యాకల్టీ క్లబ్, స్పోర్ట్స్ కాంప్లెక్స్ వంటి అనేక అదనపు సౌకర్యాలు కూడా ఉన్నాయి.
విశ్వవిద్యాలయం కొత్త క్యాంపస్ నలంద పురాతన శిధిలాల ప్రదేశానికి దగ్గరగా ఉంది. ఈ విశ్వవిద్యాలయం 2010లోని నలంద విశ్వవిద్యాలయ చట్టం ద్వారా స్థాపించారు.

READ MORE  Arogya Maitri Cube | ఆకాశం నుంచి దిగివచ్చిన ఆస్పత్రిని చూడండి.. ప్రపంచంలోనే తొలిసారి భారత్ లో ఆవిష్కరణ..

ఈ విశ్వవిద్యాలయం, భారతదేశం కాకుండా, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, భూటాన్, బ్రూనై దారుస్సలాం, కంబోడియా, చైనా, ఇండోనేషియా, లావోస్, మారిషస్, మయన్మార్, న్యూజిలాండ్, పోర్చుగల్, సింగపూర్, దక్షిణ కొరియా, శ్రీలంక, థాయ్‌లాండ్, 17 ఇతర దేశాల నుండి భాగస్వామ్యాన్ని కలిగి ఉంది. యూనివర్సిటీకి మద్దతుగా భారత్, వియత్నాం ఈ దేశాలు ఎంఓయూలపై సంతకాలు చేశాయి.  కొత్త‌ క్యాంపస్ 455 ఎకరాలలో విస్తరించి ఉంది. ఇందులో అకడమిక్, అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్‌లు, ఉపాధ్యాయులు, విద్యార్థుల హాస్ట‌ళ్లు, ప్రయోగశాలలు, లైబ్రరీలు ఉన్నాయి.

Nalanda University | ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన నలంద విశ్వవిద్యాలయం విశిష్టతలు ఇవే..

విశ్వవిద్యాలయం సుమారు 7,500 మంది ఉపాధ్యాయులు, విద్యార్థులకు వసతి కల్పిస్తుంది. హిస్టారికల్ స్టడీస్, ఎకాలజీ, ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్, బౌద్ధ అధ్యయనాలు, తత్వశాస్త్రం, కంపారిటివ్ రిలిజియ‌న్‌, భాషలు, సాహిత్యం/మానవ శాస్త్రాలు, మేనేజ్‌మెంట్ స్టడీస్, అంతర్జాతీయ సంబంధాలు వంటి ఆరు పాఠ్యాంశాలు ఉన్నాయి.

యూనివర్శిటీ అధికారుల ప్రకారం, వాస్తు శిల్ప కన్సల్టెంట్స్ రూపొందించిన కొత్త క్యాంపస్ కూడా “ప్రాచీన నలంద విశ్వవిద్యాలయం అందించిన నిర్మాణ, భౌగోళిక సూత్రాల ఆధారంగా ఈ కొత్త‌ భవన నిర్మాణానికి మొత్తం విస్తీర్ణంలో ఎనిమిది శాతాన్ని మాత్రమే ఉపయోగించింది.

READ MORE  Modi Cabinet 3.0 | మోదీ మంత్రి వర్గంలో ఎవరెవరు ఉన్నారు..? పోర్ట్ ఫోలియో పూర్తి జాబితా ఇదే..

కొత్త క్యాంపస్ ప్రత్యేకత‌లు

Special features of the new campus : విశ్వవిద్యాలయం అధ్యయన కేంద్రాలుగా ఓపెన్ క్లాస్ ల‌ను కలిగి ఉంది, “బాటిల్-ఆకారపు” బజార్‌లను కలిగి ఉంది. విద్యార్థుల కోసం షాపింగ్ ఆర్కేడ్‌లను కలిగి ఉంటుంది. కొత్త యూనివ‌ర్సిటీ క్యాంప‌స్‌లో వాహ‌నాలు క‌నిపించ‌వు. సందర్శకులు, విద్యార్థులు. అధ్యాపకులు క్యాంపస్‌లో నడవాలి లేదా సైకిళ్లను మాత్ర‌మే ఉపయోగించాలి.

మొత్తం ప్రాజెక్ట్ అధికారిక వ్యయాన్ని అధికారులు వెల్లడించనప్పటికీ, ఆగస్టు 2016 నాటికి, భారతదేశం రూ. 684.74 కోట్లు అని తెలుస్తోంది. చైనా, ఆస్ట్రేలియా థాయిలాండ్, లావోస్ నుంచి విరాళాలతో పాటు ఒక్కొక్కటి $1 మిలియన్లు అందించాయి.

Nalanda New Campus ఆర్కిటెక్చర్

నలంద శిథిలాలను చూసిన‌ట్లుగా ఐకానిక్ బ‌య‌ట‌కు క‌నిపించే ఇటుకల‌ నిర్మాణంతో పురాత‌న విద్యాల‌యంలా క‌నిపిస్తుంది. అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ లేదా ఇతర కార్యాలయాలతో పాటు VC కార్యాలయం ఉన్న వింగ్-1 భవనం కూడా పురాత‌న ఇటుక గోడ‌ల డిజైన్ లో రూపొందించారు.

యూనివర్శిటీ ప్రధాన గోడ రెండు సమాంతర గోడలతను క‌ట్టారు. మధ్యలో ఒక కుహరం మాదిరి నిర్మాణం వేడిని నిలిపి ఉంచుతుంది. ఇది బాత్రూమ్‌లలో వెచ్చని నీటిని ఉత్పత్తి చేయడానికి ఉప‌యోగ‌ప‌డుతుంది.

READ MORE  Modi cabinet 2024 | 30 ఏళ్ల రాజ‌కీయ అనుభ‌వంలో మొట్ట‌మొద‌టిసారి కేంద్ర మంత్రి ప‌ద‌వి

క్యాంపస్ మధ్యలో కమల్ సాగర్ (లోటస్ పాండ్) ఉంటుంది. దాని ఒక వైపున “bottle-shaped bazaars” ఉంటాయి, ఇక్కడ విద్యార్థులు స్టేషనరీ, తినుబండారాల వరకు ప్రతిదీ కొనుగోలు చేయవచ్చు.

నలంద మహావిహారం అంటే ఏమిటి?

కొత్త క్యాంపస్ నలంద మహావిహార.. 5వ-12వ శతాబ్దపు పురాత‌న‌ విశ్వవిద్యాలయ సాంస్కృతిక. నిర్మాణ శైలిని అనుగుణంగా నిర్మించారు. ఇది ప్రాచీన భారతదేశంలోని గొప్ప విద్యా కేంద్రాలలో ఒకటిగా గురింపు పొందింది. బీహార్‌లోని పురాతన నలంద విశ్వవిద్యాలయం శిథిలాలు 2016లో యునెస్కో ప్రపంచ సాంస్కృతిక వారసత్వంగా ప్రకటించింది. పురాత‌న విశ్వ‌విద్యాల‌యంలో ఇది 1:8 ఉపాధ్యాయ-విద్యార్థి నిష్పత్తిని కలిగి ఉందని, దాదాపు 10,000 మంది విద్యార్థులకు సుమారు 2,000 మంది ఉపాధ్యాయులు ఉండేవారు. అయితే కొత్త క్యాంపస్ లో కూడా ఈ నిష్పత్తి కొనసాగించారు.


Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్రను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి.. అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News) తోపాటు ఎక్స్ (X) , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి..

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
అత్యాధునిక హంగులతో చర్లపల్లి రైల్వే టెర్మినల్ చూశారా? దుర్గదేవి నవరాత్రి ఉత్సవాలు.. తొమ్మిది ఆలయాలు..