Friday, February 14Thank you for visiting

Most Profitable Train : భారత్ లో అత్యంత ఎక్కువ ఆదాయం ఇచ్చే రైలు ఇదే..

Spread the love

ఈ రైలు సంవత్సరానికి రూ. 1,76,06,66,339  ఆదాయం

Most Profitable Train |భారతీయ రైల్వేలకు అత్యధిక లాభాలనిచ్చే రైళ్ల జాబితాలో వందే భారత్  ఎక్స్‌ప్రెస్ లేదా శతాబ్ది ఎక్స్‌ప్రెస్  అగ్ర స్థానాల్లో లేవు. కానీ రాజధాని రైళ్ల ద్వారా వచ్చే ఆదాయం అగ్రస్థానంలో ఉంది. ముఖ్యంగా, బెంగళూరు రాజధాని ఎక్స్‌ప్రెస్ ఆదాయాల పరంగా అగ్రస్థానంలో ఉంది.

నివేకల ప్రకారం, రైలు నంబర్ 22692, హజ్రత్ నిజాముద్దీన్ నుండి KSR బెంగళూరు వరకు ప్రయాణించే బెంగుళూరు రాజధాని ఎక్స్‌ప్రెస్ అత్యధిక ఆదాయాన్ని ఆర్జిస్తుంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో, ఈ రైలు 509,510 మంది ప్రయాణీకులను తీసుకువెళ్లింది. రైల్వేలకు సుమారు రూ. 1,76,06,66,339 ఆదాయాన్ని ఆర్జించింది.

READ MORE  Indian Railway Recruitment 2024 | 12,000 రైల్వే TTE పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ .. ఎలా దరఖాస్తు చేయాలో తెలుసుకోండి

భారతీయ రైల్వేలకు రెండవ అత్యంత లాభదాయకమైన రైలు సీల్దా రాజధాని ఎక్స్‌ప్రెస్. ఇది పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా నుండి దేశ రాజధాని న్యూఢిల్లీకి కలుపుతుంది. రైలు నంబర్ 12314, సీల్దా రాజధాని ఎక్స్‌ప్రెస్, 2022-23 ఆర్థిక సంవత్సరంలో 509,164 మంది ప్రయాణికులకు సేవలందించింది, దీని ద్వారా సుమారు రూ. 1,28,81,69,274 ఆదాయం వచ్చింది.

మూడవది దిబ్రూఘర్ రాజధాని ఎక్స్‌ప్రెస్. న్యూఢిల్లీ మరియు డిబ్రూఘర్ మధ్య నడిచే ఈ రైలు. గత సంవత్సరంలో 474,605 ​​మంది ప్రయాణీకులకు సేవలందించింది, భారతీయ రైల్వేలకు సుమారుగా రూ. 1,26,29,09,697 ఆదాయాన్ని ఆర్జించింది.

READ MORE  దేశంలోనే అత్యంత నెమ్మదిగా నడిచే  రైలు ఇదే.. 111 స్టేషన్లలో హాల్టింగ్..   

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

అత్యాధునిక హంగులతో చర్లపల్లి రైల్వే టెర్మినల్ చూశారా? దుర్గదేవి నవరాత్రి ఉత్సవాలు.. తొమ్మిది ఆలయాలు..