Home Special Stories Gatimaan Express | వందే భారత్ ఎక్స్‌ప్రెస్, గతిమాన్ ఎక్స్‌ప్రెస్ ఏది ఫాస్ట్ గా...

Gatimaan Express | వందే భారత్ ఎక్స్‌ప్రెస్, గతిమాన్ ఎక్స్‌ప్రెస్ ఏది ఫాస్ట్ గా వెళుతుందో తెలుసా..

0
11
Gatimaan Express
Gatimaan Express
Spread the love

Gatimaan Express | వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు భారతీయ రైల్వేలను విప్లవాత్మకంగా మార్చింది, వేగం, సౌకర్యం, భద్రతతో కూడిన ఈ ప్రీమియం రైళ్లు కొద్ది రోజుల్లోనే ప్ర‌యాణికుల ఆద‌ర‌ణ‌ను చూర‌గొన్నాయి. ప్రజలు ఆధునిక సౌకర్యాలు, సమయపాలన, వేగం పరంగా భారతీయ రైల్వేలో ఏ రైళ్లు ఉత్త‌మ‌మో దానికే మొగ్గుచూపుతుంటారు. ఇండియన్ రైల్వేస్ (Indian Railways)  కూడా విభిన్న‌మైన‌ ప్ర‌యాణికుల అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లుగా స‌రికొత్త రైళ్ల‌ను త‌ర‌చూ ప్ర‌వేశ‌పెడుతోంది స్టేష‌న్ల‌లో కూడా మౌలిక వ‌స‌తులను క‌ల్పిస్తోంది .ఇది బహుశా భారతీయ రైళ్లకు స్వ‌ర్ణ యుగంగా చెప్ప‌వ‌చ్చు. ఆర్థిక వృద్ధికి, ప్రాంతీయ అభివృద్ధికి ప్రీమియం రైళ్ల‌ విస్తరణతో దేశమంతటా కనెక్టివిటీని మరింత మెరుగుపరచాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది.

వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (Vandebhaarath Express) సిరీస్ రైళ్లు.. మిగ‌తా హైస్పీడ్‌ రైళ్ల సర్వీసుల మధ్య ఆరోగ్యకరమైన పోటీని రేకెత్తించాయి. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు వేగాన్ని అలాగే గతిమాన్ ఎక్స్‌ప్రెస్ అనే మ‌రో భారతదేశపు మొదటి సెమీ-హై-స్పీడ్ రైలు వేగాన్ని మీరు ఎప్పుడైనా పోల్చారా? వందే భారత్ ఎక్స్‌ప్రెస్ లేదా గతిమాన్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల‌లో ఏది అత్య‌ధిక వేగంతో దూసుకుపోతుందో ఇప్పుడు చూద్దాం.

గతిమాన్ ఎక్స్‌ప్రెస్ రైలు

Gatimaan Express Speed :  2016 ఏప్రిల్ 5న అప్పటి రైల్వే మంత్రి సురేష్ ప్రభాకర్ ప్రభు ప్రారంభించిన భారతదేశపు మొట్టమొదటి సెమీ-హై-స్పీడ్ రైలు గతిమాన్ ఎక్స్‌ప్రెస్. ఇది గంట‌కు గరిష్టంగా 160 కిలోమీట‌ర్ల వేగందో దూసుకుపోతుంది .రైలు మార్గాలు- 12049 – విరంగన లక్ష్మీబాయి ఝాన్సీ జంక్షన్ (VGLJ) నుంచి న్యూఢిల్లీ హజ్రత్ నిజాముద్దీన్ (NZM), 12050 ఢిల్లీ హజ్రత్ నిజాముద్దీన్ (NZM) నుంచి విరంగన లక్ష్మీబాయి ఝాన్సీ జంక్షన్ (VGLJ) వరకు మ‌ధ్య న‌డుస్తోంది .

వందే భారత్ ఎక్స్‌ప్రెస్

Vandebhaarath Express Speed :  మరోవైపు, మొదటి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు 2019 ఫిబ్రవరి 15న న్యూఢిల్లీ-కాన్పూర్-అలహాబాద్-వారణాసి మార్గంలో గంటకు 160 కిలోమీటర్ల వేగంతో నడుస్తోంది. భారతీయ రైల్వేలలో మొత్తం 102 వందే భారత్ రైళ్లు సేవలు (51 రైళ్లు) నడుస్తున్నాయి, బ్రాడ్ గేజ్ (BG) విద్యుద్దీకరించిన నెట్‌వర్క్ ఉన్న రాష్ట్రాలను కలుపుతున్నాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో వందే భారత్ రైళ్లలో ప్రయాణించడానికి సుమారు 31.84 లక్షల మంది బుక్ చేసుకున్నారు. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ విజయం స్వదేశీ తయారీలో భారతదేశ శక్తి సామర్థ్యాలకు నిదర్శనంగా నిలుస్తోంది. . ‘ఆత్మనిర్భర్ భారత్’ విజన్‌ను సాకారం చేయడంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా చెప్పవచ్చు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి.  అలాగే మా  గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్)ఫేస్ బుక్,  వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

🇮🇳 జాతీయ ప్రయోజనాలే పరమావధిగా.. 🇮🇳

వందేభారత్ డిజిటల్ సైన్యంలో చేరండి!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here