Home Special Stories Chenab Bridge : భారత నిర్మాణ చరిత్రలో అద్భుతం

Chenab Bridge : భారత నిర్మాణ చరిత్రలో అద్భుతం

0
14
Chenab Bridge
Spread the love

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం జమ్మూ కాశ్మీర్‌ను సందర్శించి, ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైలు మార్గాన్ని ప్రారంభించారు. ఇది కాశ్మీర్ లోయను భారతదేశ జాతీయ రైల్వే వ్యవస్థలోని మిగిలిన ప్రాంతాలకు అనుసంధానించే అత్యంత కీల‌క‌మైన‌ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ లో ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే ఆర్చ్ వంతెన అయిన చీనాబ్ రైల్వే వంతెన (Chenab Bridge) ఉంది.శుక్రవారం ఉదయం 11 గంటలకు దీనిని ప్ర‌ధాన మంత్రి మోదీ ప్రారంభించారు.

చీనాబ్ వంతెన అంటే ఏమిటి?

చీనాబ్ నదికి 359 మీటర్ల ఎత్తులో నిర్మించి ఇది ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెన. ఇది ఐఫిల్ టవర్ కంటే 35 మీటర్ల ఎత్తు ఉంటుంది. దిల్లీలోని కుతుబ్ మినార్ కంటే నదీ గర్భం నుంచి రైలు స్థాయి వరకు దాదాపు ఐదు రెట్లు ఎత్తుగా ఉంటుంది. ఈ వంతెన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ద్వారా కాట్రా, శ్రీనగర్ మధ్య ప్రయాణ సమయాన్ని సుమారు 3 గంటలకు తగ్గిస్తుంది.

Chenab Bridge విశేషాలు

  • ఎత్తు: సముద్ర మట్టానికి 359 మీటర్లు (ఐఫిల్ టవర్ కంటే 35 మీటర్ల ఎత్తు)
  • పొడవు: 1,315 మీటర్లు
  • నదిపై స్థానం: సలాల్ డ్యాం సమీపంలో, చీనాబ్ నది మీదుగా
  • గరిష్ట గాలి వేగం: 266 కిమీ/గం వరకు తట్టుకునే సామర్థ్యం
  • భూకంప నిరోధక నిర్మాణం: అత్యంత భద్రతా ప్రమాణాలు

ఇది ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైలు లింక్‌లో భాగం. ఈ వంతెన సలాల్ ఆనకట్ట సమీపంలో చీనాబ్ నదిపై 1,315 మీటర్లు విస్తరించి ఉంది. తీవ్రమైన భూకంపాలు, అధిక గాలి వేగాన్ని తట్టుకునేలా దీనిని అత్యంత ప‌టిష్టంగా నిర్మించారు.

ఈ వంతెనను ఏ కంపెనీలు నిర్మించాయి?

దేశంలోని కఠినమైన, విభిన్న‌మైన భూభాగాల్లో ఈ అద్భుతాన్ని నిర్మించడానికి అనేక కంపెనీలు, భారతీయ సంస్థలు చేతులు కలిపాయి. వంతెన రూపకల్పన, నిర్మాణాన్ని VSL ఇండియా, దక్షిణ కొరియాకు చెందిన అల్ట్రా కన్స్ట్రక్షన్ & ఇంజనీరింగ్ కంపెనీ ఆఫ్కాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌కు అప్పగించారు. దీని పునాది రక్షణ కోసం డిజైన్‌ను బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌కు అప్పగించగా, ఢిల్లీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వాలు స్టేబిలిటీ విశ్లేషణను పూర్తి చేసింది.

ఈ నిర్మాణాన్ని బ్లాస్ట్ ప్రూఫ్‌గా తయారు చేయడంలో రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) కూడా చేతులు కలిపింది. ఫిన్లాండ్‌కు చెందిన WSP గ్రూప్ వయాడక్ట్, ఫౌండేషన్‌లను రూపొందించగా, జర్మన్‌కు చెందిన లియోన్‌హార్డ్ ఆండ్రా అనే కంపెనీ ఆర్చ్‌ను రూపొందించింది.

ఈ ప్రాజెక్టులో ఎవరెవరు ఉన్నారు..?

ఈ వంతెన నిర్మాణం ఒక్క సంస్థకు సాధ్యం కాలేదు. భారతదేశం, దక్షిణ కొరియా, ఫిన్లాండ్, జర్మనీ వంటి దేశాల నిపుణుల సమన్వయంతో ఇది సిద్ధమైంది:

సంస్థబాధ్యతలు
VSL India, AFCONS Infraనిర్మాణం మరియు డిజైన్
Ultra Construction (Korea)అధిక ఎత్తుల్లో నిర్మాణ నైపుణ్యం
IISc Bengaluruభద్రతా పునాది డిజైన్
IIT Delhiనిర్మాణ స్థిరత్వ విశ్లేషణ
DRDOబ్లాస్ట్ ప్రూఫ్ ప్రొటెక్షన్ డిజైన్
WSP Finlandఫౌండేషన్, వయాడక్ట్ డిజైన్
Leonhardt Andra (Germany)ఆర్చ్ డిజైన్

అంజి వంతెనను ప్రారంభించిన ప్రధాని మోదీ

చీనాబ్ వంతెనతో పాటు, భారతదేశంలోని మొట్టమొదటి కేబుల్-స్టేడ్ రైల్వే వంతెన అయిన అంజి వంతెనను కూడా ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ వంతెన అత్యంత‌ సవాళ్ల‌తో కూడిన భూభాగాన్ని దాటడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

చీనాబ్ వంతెన ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, “జూన్ 6, జమ్మూ కాశ్మీర్‌లోని నా సోదరీమణులకు నిజంగా ప్రత్యేకమైన రోజు. రూ. 46,000 కోట్ల విలువైన కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ప్రారంభమవుతున్నాయి. ఇది ప్రజల జీవితాలపై చాలా సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. అసాధారణమైన నిర్మాణ శైలితో పాటు, చీనాబ్ రైలు వంతెన జమ్మూ, శ్రీనగర్ మధ్య కనెక్టివిటీని మెరుగుపరుస్తుంది. అంజి వంతెన భారతదేశంలో మొట్టమొదటి కేబుల్-స్టేడ్ రైలు వంతెనగా సవాలుతో కూడిన భూభాగంలో అందుబాటులోకి వ‌స్తుంది. ” అని అన్నారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి.  అలాగే మా  గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్)ఫేస్ బుక్,  వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

🇮🇳 జాతీయ ప్రయోజనాలే పరమావధిగా.. 🇮🇳

వందేభారత్ డిజిటల్ సైన్యంలో చేరండి!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here