Home Technology BSNL కొత్త రీఛార్జ్ ప్లాన్ .. రోజుకు కేవ‌లం రూ.7 ఖ‌ర్చుతో 105 రోజుల పాటు...

BSNL కొత్త రీఛార్జ్ ప్లాన్ .. రోజుకు కేవ‌లం రూ.7 ఖ‌ర్చుతో 105 రోజుల పాటు 2GB రోజువారీ డేటా

0
10
BSNL105-day validity Recharge Plan
BSNL 4G Service
Spread the love

BSNL105-day validity Recharge Plan  | సాధార‌ణ ప్ర‌జ‌లు త‌మ‌ రీఛార్జ్ ప్లాన్‌లు వ్యాలిడిటీ చివరి రోజు దగ్గర పడుతుండగా, తీవ్ర ఆందోళనకు గురవుతుంటారు. మిలియన్ల మంది మొబైల్ వినియోగదారులు త‌క్కువ ధ‌ర‌లు క‌లిగిన రీచార్జి ప్లాన్ల‌ను కోరుకుంటారు. ఇలాంటి వారి కోస‌మే ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికాం సంస్థ BSNL అనేక రకాల స‌ర‌స‌మైన‌ ప్లాన్‌లను అందుబాటులోకి తీసుకొస్తోంది.

జియో, ఎయిర్‌టెల్, వొడ‌ఫోన్ ఐడియా (విఐ) వంటి ప్రైవేట్ టెలికాం దిగ్గజాలు దీర్ఘకాలిక చెల్లుబాటు గల ప్లాన్‌ల కోసం భారీ ఛార్జీలు విధిస్తున్న విష‌యంతెలిసిందే.. ఈ క్ర‌మంలోనే పెద్ద సంఖ్య‌లో వినియోగ‌దారులుBSNL వైపు మ‌ళ్లుతున్నారు. మిలియన్ల మంది వినియోగదారుల సమస్యలను పరిష్కరించడానికి, BSNL తన ఆఫర్లలో అనేక దీర్ఘకాలిక వ్యాలిడిటీ ప్లాన్ల‌ను చేర్చింది. బడ్జెట్- ఫ్రెండ్లీ ప్లాన్ పట్ల ఆసక్తి ఉన్నవారి కోసం, BSNL ఇప్పుడు 105-రోజుల వ్యాలిడిటీ గ‌ల ఒక ప్లాన్‌ను అందిస్తోంది.

BSNL 105 రోజుల వ్యాలిడిటీ రీఛార్జ్ ప్లాన్

BSNL105-day validity Recharge Plan : BSNL త‌న‌ వినియోగదారులకు రూ. 666 ధరతో అత్యుత్తమ రీఛార్జ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌లో 105 రోజుల పాటు ఏదైనా నెట్‌వర్క్‌కి అపరిమిత కాలింగ్ ఉంటుంది. అదనంగా, వినియోగదారులు ప్రతిరోజూ 100 ఉచిత SMS ల‌ను కూడా పొంద‌వ‌చ్చు.

ఇంకా, BSNL ఈ రీఛార్జ్ ప్లాన్ ద్వారా వినియోగదారులకు స‌రిప‌డా ఇంటర్నెట్ డేటాను అందిస్తుంది, మొత్తం చెల్లుబాటు వ్యవధి లోపు మీరు మొత్తం 210 GB డేటాను ఉప‌యోగించుకోవ‌చ్చు. ఇది రోజువారీ 2GB హై-స్పీడ్ డేటాకు సమానం. ఈ ధర పరిధిలో, Jio, Airtel మరియు Vi అటువంటి కంపెనీలు దీర్ఘ‌కాలిక‌ చెల్లుబాటుతో ఎలాంటి రీఛార్జ్ ప్లాన్‌ను అందించడం లేదని గమనించాలి.

ఇక బిఎస్ఎన్ఎల్ కు సంబంధించి ఇతర వార్తలను ప‌రిశీలిస్తే.. ప్రభుత్వ యాజమాన్యంలోని BSNL తగ్గుతున్న సబ్‌స్క్రైబర్ బేస్, ప‌డిపోతున్నస‌ర్వీస్ నాణ్యతపై పార్లమెంటరీ కమిటీ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది . సమావేశంలో, కమిటీలోని కొందరు సభ్యులు తమ ఆందోళనలను వ్య‌క్తం చేశారు. BSNL మొబైల్‌లలో పేలవమైన నెట్ వ‌ర్క్ కు సంబంధించి వారు వ్యక్తిగత అనుభవాలను పంచుకున్నారు.

అయితే రాబోయే ఆరు నెలల్లో సేవల‌ను గణనీయంగా మెరుగుప‌రుస్తామ‌ని అధికారులు హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న 24,000 టవర్ల నుంచి 4G సేవతో దాదాపు లక్ష మొబైల్ టవర్లను అమర్చడం ద్వారా మౌలిక సదుపాయాలను పెంచ‌నున్న‌ట్లు తెలిపారు. అదనంగా, BSNL అధికారులు “ఆత్మనిర్భర్ భారత్” చొరవలో భాగంగా స్వదేశీ సాంకేతికతను ఉపయోగించుకుంటున్న‌ట్లు వెల్ల‌డించారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ నుసందర్శించండి.  అలాగే మా  గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్)ఫేస్ బుక్,  వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

🇮🇳 జాతీయ ప్రయోజనాలే పరమావధిగా.. 🇮🇳

వందేభారత్ డిజిటల్ సైన్యంలో చేరండి!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here