Tuesday, January 20Thank you for visiting

బంగ్లాదేశ్‌లో ఆగని రక్తపాతం: మరో హిందువు దారుణ హత్య! – Mymensingh attack

Spread the love

మయమన్‌సింగ్‌ జిల్లాలో సెక్యూరిటీ గార్డు కాల్చివేత.. పొంచి ఉన్న ముప్పు

  • వరుస హత్యలతో వణికిపోతున్న మైనారిటీలు.
  • దీపూ చంద్ర దాస్, అమృత్ మండల్ తర్వాత తాజాగా బజేంద్ర బిశ్వాస్ బలి.
  • ప్రమాదవశాత్తు జరిగిందంటున్న నిందితుడు.. దర్యాప్తులో పోలీసులు.

Mymensingh attack : బంగ్లాదేశ్‌లో హిందువులే లక్ష్యంగా జరుగుతున్న దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. అల్లర్లు, ఘర్షణలతో అట్టుడుకుతున్న దేశంలో మైనారిటీల భద్రత గాలిలో దీపంలా మారింది. దీపూ చంద్ర దాస్, అమృత్ మండల్ అనే హిందూ యువకుల హత్యోదంతాలు మరవకముందే.. తాజాగా బజేంద్ర బిశ్వాస్ (42) అనే మరో హిందువు ప్రాణాలు కోల్పోయాడు.

ఏం జరిగింది?

మయమన్‌సింగ్ జిల్లాలోని ఒక ప్రైవేట్ కర్మాగారంలో బజేంద్ర బిశ్వాస్ సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వర్తిస్తున్నాడు. సోమవారం సాయంత్రం సుమారు 6.45 గంటల సమయంలో, అతడి సహోద్యోగి నోమన్ మియా జరిపిన కాల్పుల్లో బిశ్వాస్ అక్కడికక్కడే కుప్పకూలాడు.

నిందితుడి వెర్షన్: పోలీసుల అదుపులో ఉన్న నోమన్ మియా విచిత్రమైన వాదనను తెరపైకి తెచ్చాడు. తామిద్దరం ఫ్యాక్టరీ బారక్‌లో సరదాగా మాట్లాడుకుంటున్నామని, ఆ సమయంలో భద్రత కోసం వాడే తుపాకీని సరదాగా బిశ్వాస్ వైపు గురిపెట్టానని చెప్పాడు. అయితే, అనుకోకుండా ట్రిగర్ నొక్కడంతో బుల్లెట్ బిశ్వాస్ శరీరంలోకి దూసుకెళ్లిందని, ఆసుపత్రికి తరలించేలోపే మరణించాడని తెలిపాడు.

హిందువుల భద్రతపై నీలి నీడలు

అయితే, ఇది ప్రమాదమా లేక పథకం ప్రకారం జరిగిన హత్యనా అనే కోణంలో స్థానిక హిందూ సంఘాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.

  • గతంలో 25 ఏళ్ల దీపూ చంద్ర దాస్పై అల్లరిమూకలు దాడి చేసి చంపేశాయి.
  • రాజ్‌బరి జిల్లాలో అమృత్ మండల్ అనే యువకుడిని గ్రామస్థులు కొట్టి చంపిన ఘటన మరువక ముందే ఈ ఘటన జరిగింది.

వరుసగా హిందువులే లక్ష్యంగా దాడులు జరుగుతుండటంతో అంతర్జాతీయ సమాజంలో బంగ్లాదేశ్ మైనారిటీల రక్షణపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు నోమన్ మియాను అరెస్ట్ చేశారు.

Whatsapp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *