Bhojshala Dispute : వసంత పంచమి నాడు హిందువులు, ముస్లింలకు ప్రార్థనా సమయాలు ఖరారు!

Bhojshala | మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలో ఉన్న 11వ శతాబ్దం నాటి భోజ్‌శాల కట్టడం వద్ద రేపు (జనవరి 23) వసంత పంచమి వేడుకల నిర్వహణపై సుప్రీంకోర్టు స్పష్టతనిచ్చింది. ఈసారి వసంత పంచమి శుక్రవారం కలిసి రావడంతో నెలకొన్న ఉత్కంఠకు అత్యున్నత న్యాయస్థానం తెరదించింది. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు హిందువులు వసంత పంచమి పూజలు, హవనాలు నిర్వహించుకోవచ్చు. ఇక ముస్లింలు మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు ముస్లింలు శుక్రవారం నమాజ్ చేసుకోవడానికి … Read more

కోల్‌కతాలో ఈడీ వర్సెస్ మమతా బెనర్జీ: ఐ-ప్యాక్ దాడుల వద్ద ఉద్రిక్తత..

I-PAC mamata banerjee

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో గురువారం (జనవరి 8) హైడ్రామా చోటుచేసుకుంది. టీఎంసీ వ్యూహకర్త ప్రతీక్ జైన్.. ఐ-ప్యాక్ (I-PAC) కార్యాలయాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) జరిపిన దాడులు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. స్వయంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రంగంలోకి దిగి ఈడీ అధికారులతో వాగ్వాదానికి దిగడం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. రాజకీయ వ్యూహాల కోసమే దాడులు: మమత ఆగ్రహం ప్రతీక్ జైన్ నివాసం నుండి బయటకు వచ్చిన మమతా బెనర్జీ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ … Read more

Delhi Turkman Gate | ఢిల్లీ తుర్క్‌మాన్ గేట్ వద్ద బుల్డోజర్ల గర్జన: అర్థరాత్రి అస‌లేం జ‌రిగింది?

Turkman Gate

న్యూఢిల్లీ: ఢిల్లీలోని చారిత్రాత్మక తుర్క్‌మాన్ గేట్ (Delhi Turkman Gate ) వద్ద మంగళవారం అర్థరాత్రి భారీ ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఫైజ్-ఎ-ఇలాహి మసీదు సమీపంలోని అక్రమ కట్టడాలను తొలగించేందుకు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (MCD) చేపట్టిన బుల్డోజర్ ఆపరేషన్ రణరంగాన్ని తలపించింది. Turkman Gate : అర్ధరాత్రి ఏం జరిగింది? స్థానిక ప్రజలకు అసౌకర్యం కలగకుండా అధికారులు ఈ ఆపరేషన్‌ను అర్థరాత్రి ప్లాన్ చేశారు. అయితే అది ఘర్షణకు దారితీసింది. మంగళవారం రాత్రి 12:00 గంటల ప్రాంతంలో … Read more

భారతదేశపు తొలి ‘వందే భారత్ స్లీపర్’ రైలు వచ్చేస్తోంది

Vande Bharat Sleeper

ముంబై: భారతీయ రైల్వే రంగంలో సరికొత్త విప్లవం రాబోతోంది. ప్రయాణికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వందే భారత్ స్లీపర్ (Vande Bharat Sleeper) రైలుపై కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసింది. దేశంలోనే మొట్టమొదటి స్లీపర్ వెర్షన్ రైలు అస్సాంలోని గౌహతి మరియు పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా (హౌరా) మధ్య నడవనుంది. ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రారంభం కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ మెగా ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని … Read more

బంగ్లాదేశ్‌లో ఆగని రక్తపాతం: మరో హిందువు దారుణ హత్య! – Mymensingh attack

Save Hindu in Bangladesh

మయమన్‌సింగ్‌ జిల్లాలో సెక్యూరిటీ గార్డు కాల్చివేత.. పొంచి ఉన్న ముప్పు Mymensingh attack : బంగ్లాదేశ్‌లో హిందువులే లక్ష్యంగా జరుగుతున్న దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. అల్లర్లు, ఘర్షణలతో అట్టుడుకుతున్న దేశంలో మైనారిటీల భద్రత గాలిలో దీపంలా మారింది. దీపూ చంద్ర దాస్, అమృత్ మండల్ అనే హిందూ యువకుల హత్యోదంతాలు మరవకముందే.. తాజాగా బజేంద్ర బిశ్వాస్ (42) అనే మరో హిందువు ప్రాణాలు కోల్పోయాడు. ఏం జరిగింది? మయమన్‌సింగ్ జిల్లాలోని ఒక ప్రైవేట్ కర్మాగారంలో బజేంద్ర బిశ్వాస్ … Read more

Rahul Gandhi | కాంగ్రెస్‌లో ‘సంస్థాగత’ చిచ్చు: దిగ్విజయ్ సింగ్‌పై రాహుల్ గాంధీ సెటైర్లు: “నువ్వు అల్లరి చేశావు”

న్యూఢిల్లీ, డిసెంబర్ 29: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశానికి ముందు సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ చేసిన కొన్ని వ్యాఖ్యలు పార్టీలో రాజకీయ తుఫానును రేపాయి. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ (RSS) సంస్థాగత నిర్మాణాన్ని ఆయన బహిరంగంగా ప్రశంసించడంపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఆదివారం తనదైన శైలిలో స్పందించారు. ఏం జరిగింది? కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన టీ విరామ సమయంలో రాహుల్ గాంధీ, … Read more

MGNREGA పేరు మార్పుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం: కొత్త పేరు ‘PBGRY’

MNREGA

న్యూఢిల్లీ, డిసెంబర్ 12: గ్రామీణ భారతదేశ ఆర్థిక బలాన్ని బలోపేతం చేసేందుకు ఉపాధికి హామీ క‌ల్పించేందుకు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MNREGA) పేరు మార్చే ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ పథకానికి కొత్త పేరును ఖరారు చేసింది. MNREGA కొత్త పేరు ఏమిటి? MNREGA పథకాన్ని ఇప్పుడు “పూజ్య బాపు గ్రామీణ రోజ్‌గార్ యోజన” (PBGRY) గా పిలవనున్నారు. ఈ మార్పు గ్రామీణ ఉపాధి … Read more

Macaulay |మెకాలే సంకెళ్లు తెంచుకుందాం: PM మోదీ పిలుపు!

Macaulay

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయోధ్య రామమందిరంలో పవిత్ర జెండాను ఎగురవేసిన సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. 1835 నాటి లార్డ్ మెకాలే ప్రవేశపెట్టిన ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ యాక్ట్ 200వ వార్షికోత్సవానికి ముందు, ఆ ‘బానిసలుగా ఉన్న భారతీయ విద్యావ్యవస్థను పూర్వ‌వైభ‌వం తీసుకురావవానికి ప్రతి భారతీయుడు 10 సంవత్సరాల ప్రతిజ్ఞ తీసుకోవాలని ఆయన కోరారు. ఈసంద‌ర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, “1835 నాటి ఇంగ్లీష్ విద్యా చట్టం ద్వారా మెకాలే మన ఆత్మవిశ్వాసాన్ని విచ్ఛిన్నం చేశాడు. భారతీయ విద్యావ్యవస్థను … Read more

Delhi Blast | ఢిల్లీలో భారీ పేలుడు: ఎర్రకోట మెట్రో సమీపంలో 8 మంది మృతి – రాజధానిలో రెడ్ అలర్ట్

Delhi Blast

Delhi Blast | న్యూదిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ మరోసారి భయాందోళనకు గురైంది. సోమవారం సాయంత్రం ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నంబర్ 1 సమీపంలో కారులో జరిగిన భారీ పేలుడు సంభ‌వించి ప‌ది మంది అక్కడికక్కడే మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అగ్నిప్రమాదంలో పలు వాహనాలు దగ్ధమయ్యాయి. పేలుడు తర్వాత రాజధానిలో హై అలర్ట్ ప్రకటించి, భద్రతా దళాలను కీలక ప్రాంతాల్లో మోహరించారు. గాయపడిన వారిని లోక్ నాయక్ జయప్రకాశ్ (LNJP) ఆసుపత్రికి తరలించారు. … Read more

Sambhajinagar | ఔరంగాబాద్ రైల్వే స్టేషన్‌కు ఛత్రపతి శంభాజీనగర్‌గా పేరు మార్పు

Sambhajinagar

మహారాష్ట్రలోని ఔరంగాబాద్ రైల్వే స్టేషన్ పేరును ఛత్రపతి సంభాజీనగర్ స్టేషన్‌ (Sambhajinagar Railway Station ) గా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని అప్పటి ప్రభుత్వం ఔరంగాబాద్ నగరాన్ని అధికారికంగా ఛత్రపతి శంభాజీనగర్‌గా పేరు మార్చింది. గతంలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పేరు మీద ఉన్న ఈ నగరానికి మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు శంభాజీ స్మార‌కార్థం ఈ పేరు పెట్టారు. పేరు మార్పును ముందుగా … Read more