Samalkota Fire Accident : బాణాసంచా కేంద్రంలో పేలుడు.. 20 మంది దుర్మరణం!
కాకినాడ : కాకినాడ జిల్లా సామర్లకోట మండలంలో శనివారం మధ్యాహ్నం పెను విషాదం (Samalkota Fire Accident) చోటుచేసుకుంది. వేట్లపాలెం (Vetlapalem) పరిధిలోని గోదావరి కెనాల్ పక్కన ఉన్న ‘సూర్యశ్రీ ఫైర్ వర్క్స్’ బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో సుమారు 20 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో అత్యధికులు మహిళలే ఉండటం గమనార్హం. యుద్ధ క్షేత్రాన్ని తలపించిన ఘటనాస్థలి మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఒక్కసారిగా …