Thursday, June 19Thank you for visiting

Tag: Latest Telugu News

Driving License Rules | డ్రైవింగ్‌ లైసెన్స్‌ జారీలో కీలక అప్ డేట్..

Driving License Rules | డ్రైవింగ్‌ లైసెన్స్‌ జారీలో కీలక అప్ డేట్..

Telangana
Driving License Rules | అడ్డదారిలో డ్రైవింగ్ లైసెన్సులను తీసుకోవాలనుకుంటున్నారా? అయితే అలాంటి అక్రమాలకు ఇక చెల్లవు.  అడ్డదారిలో లైసెన్స్  పొందేవారిని కట్టడి చేసేందుకు ఆర్టీఏ అధికారులు టెక్నాలజీని వినియోగించుకోనున్నారు. ఇందులో భాగంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో డ్రైవింగ్‌ లైసెన్సుల జారీ ప్రక్రియకు  ఆధునిక హంగులు జోడించారు. ప్రస్తుతం మాన్యువల్‌ పద్ధతిలో కొనసాగుతున్న పరీక్షకు స్వస్తి చెప్పి ప్రామాణికమైన ఆటోమెటిక్‌ డ్రైవింగ్‌ టెస్ట్‌ను నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. దీనివల్ల  ఇక నుంచి లైసెన్సు కోసం దరఖాస్తు చేసుకున్నవారు కచ్చితంగా ఆటోమెటిక్‌ డ్రైవింగ్‌ టెస్టు పాస్ కావాల్సిందే..  రోడ్లపై నిత్యం ఎదురయ్యే  ఇబ్బందులను ఈ కొత్త టెస్ట్‌ ట్రాక్‌పై కృత్రిమంగా కల్పిస్తారు. పరీక్షలో భాగంగా ఆ ట్రాక్‌పై వాహనాన్ని నడిపినప్పుడు కంప్యూటర్‌లో పూర్తిగా రికార్డు అవుతుంది. దీంతో అంతా కరెక్టుగా వాహనం నడిప...
కుళ్లిపోయిన మటన్‌తో బిర్యానీ.. సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్ పై కేసు

కుళ్లిపోయిన మటన్‌తో బిర్యానీ.. సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్ పై కేసు

Telangana
Taskforce Checkings : జీహెచ్ఎంసీ పరిధిలోని పలు హోటళ్లలో టాస్క్‌ఫోర్స్ అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. బుధవారం రాత్రి సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్‌లో (Secunderabad Alpha Hotel) ఆస్మికంగా సోదాలు చేయగా నాసిరకం ఆహార పదార్థాలు వినియోగిస్తున్నట్లు గుర్తించారు. కుళ్లిపోతున్న మటన్‌తో బిర్యానీ తయారు చేస్తున్నట్లు కనుగొన్నారు. ఆహార పదార్థాలను పెద్ద మొత్తంలో వండి ఫ్రిడ్జ్‌లో పెట్టి కస్టమర్లు వచ్చినపుడు దానిని వేడి చేసి అందిస్తున్నట్లు సమాచారం. అలాగే ఇక్కడ నాసిరకమైన టీ ఫౌడర్ ను వినియోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఆల్ఫా హోటల్‌లో తయారు చేసే బ్రెడ్‌, ఐస్‌క్రీమ్ డేట్ బ్యాచ్ లేకుండా ఉన్నాయని అధికారులు తేల్చారు. కిచెన్‌లో పరిసరాలు అత్యంత దారుణంగా అపరిశుభ్రంగా ఉన్నట్లు తెలిపారు. దీంతో హోటల్ కేసు నమోదు చేసి రూ.లక్ష వరకు జరిమానా విధించారు అధికారులు.Task force team has conducted inspections in...
Cabinet Meet | తెలంగాణ కేబినెట్ మీటింగ్ లో కీలక నిర్ణయాలు..

Cabinet Meet | తెలంగాణ కేబినెట్ మీటింగ్ లో కీలక నిర్ణయాలు..

Telangana
TS Cabinet Meet | హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సమక్షంలో జరిగిన రాష్ట్ర కేబినెట్ మీటింగ్ లో కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు. ఈ స‌మావేశంలో సుమారు 4 గంటలపాటు పలు ముఖ్య‌మైన‌ అంశాలపై మంత్రులు చర్చించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నేత‌ సోనియా గాంధీని ఆహ్వానించాల‌ని కేబినెట్ నిర్ణయించింది. వచ్చే సీజన్ నుంచి సన్న వడ్లపై రూ.500 బోనస్ (Rs 500 Bonus ) చెల్లించాల‌ని, అలాగే ధాన్యం కొనుగోళ్లను త్వ‌రిత‌గ‌తిన పూర్తిచేయాల‌ని ప్రభుత్వం నిర్ణ‌యించింది. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాల‌ని, కొనుగోలు ప్రక్రియ సుల‌భ‌త‌రంగా జ‌రిగేందుకు జిల్లా కలెక్టర్లు బాధ్యతలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. త‌డిసిన ధాన్యం కొనుగోలు కేబినెట్ స‌మావేశం అనంత‌రం పూర్తి వివ‌రాల‌ను మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు మీడియా...
Attack on RTC bus : ఆర్టీసీ బస్సుపై దుండగుల దాడి.. సీరియస్ అయిన ఎండీ సజ్జనార్..

Attack on RTC bus : ఆర్టీసీ బస్సుపై దుండగుల దాడి.. సీరియస్ అయిన ఎండీ సజ్జనార్..

Crime, Telangana
Attack on RTC bus | హైదరాబాద్‌ శివారులోని రాచలూరు గేట్‌ వద్ద కల్వకుర్తి డిపోనకు చెందిన TSRTC బస్సుపై గురువారం కొందరు దుండగులు ద్విచక్రవాహనాలపై  వచ్చి ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో బస్సు అద్దాలు ధ్వంసమయ్యాయి. అదృష్టవశాత్తూ బస్సులోని ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారు.అయితే ఘటనపై టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను నిత్యం సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చుతున్న తమ బస్సులపై ఎలాంటి కారణం లేకుండా దండగులు దాడులు చేయడాన్ని టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం ఏమాత్రం సహించదనిఅన్నారు. ఆర్టీసీ బస్సుపై దాడిని తాము  తీవ్రంగా పరిగణిస్తున్నామని, ఈ ఘటనపై రాచకొండ కమిషనరేట్‌ మహేశ్వరం పోలీస్‌ స్టేషన్‌లో ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు చేసినట్లు సజ్జనార్ ఎక్స్ వేదికగా వెల్లడించారు.పోలీసులు దర్యాప్తును ప్రారంభించినట్లు చెప్పారు. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఆర్టీసీ బస్...
Hindu population : 1950 నుంచి 2015 వ‌ర‌కు భారత్ లో భారీగా త‌గ్గిన హిందువుల జ‌నాభా..

Hindu population : 1950 నుంచి 2015 వ‌ర‌కు భారత్ లో భారీగా త‌గ్గిన హిందువుల జ‌నాభా..

Trending News
Hindu population : భారతదేశంలో మెజారిటీ మతం (హిందువులు) జనాభా వాటా 1950 నుంచి 2015 మధ్య భారీగా 7.8 శాతం తగ్గింది. అదే సమయంలో ముస్లింల సంఖ్య 43.15 శాతం పెరిగింది. ప్ర‌ధాన‌మంత్రి ఎక‌నామిక్ అడ్వైజ‌రీ కౌన్సిల్ పేప‌ర్ (EAC-PM) ప్ర‌కారం.. మెజారిటీ జనాభాలో తగ్గుదల నేపాల్ తోపాటు మయన్మార్‌లలో కూడా కనిపించింది. అయితే 38 ఇస్లామిక్ దేశాల్లో ముస్లింల జనాభా గ‌ణ‌నీయంగా పెరిగింది. తాజా అధ్యయనం ప్రకారం, భారతదేశంలోని పార్సీలు, జైనులు మినహా, క్రైస్తవులు, బౌద్ధులు, సిక్కులతో సహా అన్ని ఇతర మతపరమైన మైనారిటీల నిష్పత్తి వారి జనాభా వాటాలో పెరుగుదల క‌నిపించింది. ఈ కాలంలో 6.58 శాతానికి చేరుకుంది. భారత్ లో హిందూ జనాభా తగ్గుదల EAC-PM అధ్యయనం ప్రకారం, భారతదేశంలో, మెజారిటీ హిందూ జనాభా వాటా 1950 - 2015 మధ్య 7.82 శాతం తగ్గింది (84.68 శాతం నుంచి 78.06 శాతానికి). 1950లో ముస్లిం జనాభా వాటా 9.84 శాతం కాగా, 2015లో 14.09 శాతాన...
Third Phase Voting : ప్రారంభమైన మూడో దశ పోలింగ్.. బరిలో నిలిచిన అగ్ర నేతల జాబితా..

Third Phase Voting : ప్రారంభమైన మూడో దశ పోలింగ్.. బరిలో నిలిచిన అగ్ర నేతల జాబితా..

Elections
LOK SABHA ELECTION 2024 : లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో భాగంగా మూడో ద‌శ పోలింగ్ (Third Phase Voting ) మంగ‌ళ‌వారం ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని 93 లోక్‌సభ స్థానాలకు ఎన్నిక‌లు జరుగుతున్నాయి. ఈ దశలో గుజరాత్‌లోని మొత్తం 26 సీట్లు, గోవాలోని 2 సీట్లు, దాద్రాలోని 2 సీట్లు, నగర్ హవేలీ & డామన్ - డయ్యూ, అస్సాంలో 4 సీట్లు, పశ్చిమ బెంగాల్‌లో 4 సీట్లు, బీహార్‌లో 5 సీట్లు, ఛత్తీస్‌గఢ్‌లో 7 సీట్లు, మధ్యప్రదేశ్‌లో 9 సీట్లు, ఉత్తరప్రదేశ్‌లో 10 సీట్లు, మహారాష్ట్రలో 11 సీట్లు, కర్ణాటకలో 14 స్థానాల్లో పోలింగ్ ప్రారంభమైంది.కాగా మూడో దశ ఎన్నికల్లో బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, శివరాజ్ సింగ్ చౌహాన్, ఎన్సీపీ-శరద్ చంద్ర పవార్, సుప్రియా సూలే, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ సతీమణి డి...
Election 2024 | రాయ్ బ‌రేలి నుంచి రాహుల్ పోటీ?

Election 2024 | రాయ్ బ‌రేలి నుంచి రాహుల్ పోటీ?

Elections
Rae Bareli : కాంగ్రెస్ అగ్ర‌నేత‌లు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలు ఎక్క‌డి నుంచి పోటీ చేస్తార‌నే విష‌యాన్ని కాంగ్రెస్ అధిష్టానం ఇంకా తేల్చుకోలేదు. ఆ పార్టీ కంచుకోట‌లుగా చెప్పుకునే రాయ్‌బరేలీ, అమేథీ స్థానాల అభ్య‌ర్థ‌ల ఎంపిక‌పై ఇంకా తుది నిర్ణ‌యం తీసుకోలేక‌పోతోంది పార్టీ నాయ‌కత్వం. ఈ కీల‌క‌మైన రెండు స్థానాల్లో నామినేషన్లు ఎవరికి దక్కుతాయనే ఉత్కంఠ ఇంకా కొనసాగుతుండగా, ఈ సారి లోక్‌సభ ఎన్నికల్లో ప్రియాంక గాంధీ వాద్రా పోటీ చేయకపోవచ్చని, రాయ్‌బరేలీ నుంచి రాహుల్ గాంధీని కాంగ్రెస్ బరిలోకి దించే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.రాహుల్ అమేథీ (Amethi) నుంచి పోటీ చేస్తారని పెద్ద ఎత్తున ఊహాగానాలు వినిపించాయి. అయితే, ఆ సీటులో కాంగ్రెస్ దివంగత నేత షీలా కౌల్ మనవడిని పార్టీ బరిలోకి దించవచ్చని తెలుస్తోంది. జవహర్‌లాల్ నెహ్రూ కోడలు అయిన షీలా కౌల్ ఐదుసార్లు పార్లమెంటు సభ్యురాలిగా, కేంద్ర మంత్రిగా ప...
IMD Hyderabad | నిప్పుల కొలిమి నుంచి ఉపశమనం.. రెండు రోజులకు ఈ జిల్లాల్లో వర్షాలు..

IMD Hyderabad | నిప్పుల కొలిమి నుంచి ఉపశమనం.. రెండు రోజులకు ఈ జిల్లాల్లో వర్షాలు..

Telangana
హైదరాబాద్: తెలంగాణ‌లోని కొన్ని జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండ‌డంతో భారత వాతావరణ విభాగం (ఐఎండీ) హైదరాబాద్‌లో మరోసారి హీట్ వేవ్ హెచ్చరిక జారీ చేసింది. ఈనెల 20 వ‌ర‌కు తెలంగాణలోని పెద్దపల్లి, జ‌య‌శంక‌ర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో వేడిగాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ హైదరాబాద్‌ (IMD Hyderabad ) అంచనా వేసింది.ఆదివారం నుంచి వర్షాలుతెలంగాణలో ఆదివారం నుంచి వర్షాలు కురుస్తాయని ఐఎండీ హైదరాబాద్‌ అంచనా వేసింది. ఏప్రిల్ 21న కుమురం భీమ్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లె, కామారెడ్డి, మెదక్, వై.భువనగిరి, సూర్యాపేట, నల్గొండ, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. గత కొద్ది రోజులుగా ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతుండడంతో ఈ వర్షపాతం తెలంగాణ వాసులకు ఊరటనివ్వ‌నుంది. IMD హైదరాబాద్ ప్రకారం, ఉష్ణోగ్రతలు 36-40 డ...
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప‌రుగులు పెట్టే ట్రాక్ ఇదే.. వీడియో షేర్ చేసిన అశ్విని వైష్ణ‌వ్

Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప‌రుగులు పెట్టే ట్రాక్ ఇదే.. వీడియో షేర్ చేసిన అశ్విని వైష్ణ‌వ్

National
Bullet Train | దేశంలో మ‌రికొద్ది రోజుల్లోనే బుల్లెట్ రైలు దూసుకెళ్ల‌నుంది. ముంబయి-అహ్మదాబాద్‌ మార్గంలో బుల్లెట్ ట్రెయిన్ న‌డిపించేందుకు ఏర్పాట్లు చేస్తుస్తున్న విషయం తెలిసిందే. 508 కిలోమీటర్ల మధ్య ట్రాక్‌ నిర్మాణ పనులు వేగంగా కొన‌సాగుతున్నాయి. అయితే, బుల్లెట్‌ రైలు కోసం ప్రత్యేక మైన‌ ట్రాక్‌ను రైల్వేశాఖ నిర్మిస్తోంది. తొలిసారిగా ట్రాక్‌కు సంబంధించిన వీడియోను కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ (Minister Ashwini Vaishnav)ఎక్స్ వేదిక‌గా షేర్ చేశారు. గంటకు 320 కిలోమీటర్ల స్పీడ్ దేశంలోనే తొలి బ్యాలస్ట్ లెస్ ట్రాక్ (Ballastless Track ) వివ‌రాల‌ను వెల్ల‌డించారు. అహ్మ‌దాబాద్‌ -ముంబై (Gujarat-Mumbai)మధ్య నిర్మిస్తున్న ట్రాక్‌ గురించి సమాచారం అందించారు. అలాగే బుల్లెట్ రైలు దృశ్యాలను యానిమేషన్ రూపంలో చూపించారు. ‘మేక్ ఇన్ ఇండియా’ స్ఫూర్తితో నిర్మిస్తున్న ఈ ట్రాక్‌లు బ్యాలస్ట్‌లెస్‌గా ఉన్నాయని.....
Mega DSC 2024 : మెగా డిఎస్సీ.. మార్చి 4 నుంచి దరఖాస్తుల స్వీకరణ.. ఏప్రిల్ 2 వరకు ఫీజు చెల్లింపు గడువు

Mega DSC 2024 : మెగా డిఎస్సీ.. మార్చి 4 నుంచి దరఖాస్తుల స్వీకరణ.. ఏప్రిల్ 2 వరకు ఫీజు చెల్లింపు గడువు

Telangana
TS DSC Notification 2024:  నిరుద్యోగులు ఎన్నో ఏళ్లుగా  ఎదురు చూస్తున్న మెగా డిఎస్సీ నోటిఫికేషన్ (Mega DSC 2024) ఎట్టకేలకు విడుదలైంది.  గత సెప్టెంబర్‌లో విడుదలైన నోటిఫికేషన్ రద్దు చేసిన ప్రభుత్వం.. 11వేల పోస్టులతో తాజా నోటిఫికేషన్ ను విడుదల చేసింది. పాఠశాల విద్యాశాఖ అధికారులతో కలిసి ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి (CM Revanth ) గరువారం నోటిఫికేషన్ విడుదల చేశారు.తెలంగాణ డిఎస్సీ నోటిఫికేషన్‌ను DSC Notification 2024 సీఎం రేవంత్‌ రెడ్డి విడుదల చేశారు. 2023 సెప్టెంబరు 6వ తేదీన  గత ప్రభుత్వం 5,089 పోస్టులతో జారీ చేసిన నోటిఫికేషన్‌ను  రద్దు చేస్తున్నట్లు  ప్రభుత్వం ప్రకటించింది. అదనపు ఉద్యోగాలతో కలిపి కొత్తగా 11,062 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు మెగా డిఎస్సీ Mega DSC నోటిఫికేషన్ జారీ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.  గతంలో డిఎస్సీ DSC నోటిఫికేషన్‌ సమయంలో  దరఖాస్తు చేసుకున్న వారు మళ్లీ దరఖాస్త...
Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..