Sunday, February 15"Saluting the spirit of India and our glorious Constitution. Happy Republic Day 2026!"

నిమిషాంబదేవి ఆలయంలో భక్తిశ్రద్ధలతో సత్యనారాయణ స్వామి వ్రతం

Spread the love

Warangal:  వరంగల్ 16వ డివిజన్ కీర్తినగర్ హౌసింగ్ బోర్డ్ కాలనీలో గురువారం సాయంత్రం సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని(satyanarayana swamy vratham) అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. కాలనీలో కొలువుదీరిన నిమిషాంబదేవి ఆలయంలో వేదపండితులు కల్యాణ్ సమక్షంలో జరిగిన ఈ పూజా కార్యక్రమంలో కాలనీకి చెందిన మహిళలు పెద్ద ఎత్తున హాజరై వ్రతాన్ని ఆచరించారు. ఈ సందర్భంగా భక్తులు ఆలపించిన భక్తిగీతాలు అందరనీ అలరిచాయి. పూజల అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు.

కాగా నిమిషాంబదేవి ఆలయంలో శుక్రవారం సామూహిక కుంకుమ పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు కల్యాణ్ తెలిపారు. మహిళలు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని ఆయన కోరారు.

అభయాంజనేయస్వామి ఆలయంలో నేడు మహాన్నదానం

కీర్తినగర్ హౌసింగ్ బోర్డ్ కాలనీలో గల అభయాంజనేయ స్వామి ఆలయంలో గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సెప్టెంబరు 22న శుక్రవారం మధ్యాహ్నం మహాన్నదానం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు.

 


Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లోనూ సంప్రదించవచ్చు.

Whatsapp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *