
ATM Cash withdrawal : భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ATM నుంచి నగదు విత్ డ్రా పై ఇంటర్చేంజ్ ఫీజులను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఏటీఎం నగదు ఉపసంహరణలు మే 1 నుంచి మరింత ఖరీదైనవిగా మారుతాయని దూరదర్శన్ న్యూస్ నివేదిక తెలిపింది. ఈ మార్పు తరచుగా డబ్బులను డ్రా చేసుకునేందుకు ఎక్కువగా ATM లను ఉపయోగించే వారిపై ప్రభావం చూపనుంది.
ATM ఇంటర్చేంజ్ ఫీజు అంటే ఒక బ్యాంకు ATM లావాదేవీలను సులభతరం చేయడానికి మరొక బ్యాంకు చెల్లించే మొత్తం. బ్యాంకులు సాధారణంగా ఈ ఖర్చును కస్టమర్లపైకి బదిలీ చేస్తాయి. ఉదాహరణకు, ఒక ICICI బ్యాంక్ కస్టమర్ హైదరాబాద్ లోని SBI ATM నుంచి డబ్బును డ్రా చేసుకుంటే ICICI బ్యాంక్ ఒక నెలలో SBI ATMలో మూడవ లావాదేవీ తర్వాత రుసుము వసూలు చేసే అవకాశం ఉంది.
పెరుగుతున్న నిర్వహణ ఖర్చులు తమ వ్యాపారాన్ని ప్రభావితం చేస్తున్నందున అధిక Cash withdrawal ఛార్జీలను కోరుతూ వైట్-లేబుల్ ATM ఆపరేటర్ల అభ్యర్థనల మేరకు ఫీజుల సవరణ జరిగింది .
Cash withdrawal : సవరించిన ATM ఛార్జీలు
- మే 1, 2025 నుండి, ఉచిత లావాదేవీ పరిమితిని మించిపోయిన కస్టమర్లకు అధిక ఛార్జీలు విధించనున్నారు.
- నగదు ఉపసంహరణలు:ప్రతి లావాదేవీకి ₹19 (గతంలో ₹17) విధించనున్నారు.
- ఆర్థికేతర లావాదేవీలు (బ్యాలెన్స్ ఎంక్వైరీ, మినీ స్టేట్మెంట్లు వంటివి): ప్రతి లావాదేవీకి ₹7 (గతంలో ₹6)
- ఏటీఎం సేవల కోసం పెద్ద ఆర్థిక సంస్థలపై ఆధారపడే చిన్న బ్యాంకుల వినియోగదారులు ఎక్కువగా ప్రభావితమవుతారని భావిస్తున్నారు.
మీరు ఏం చేయాలి?
నగదు ఉపసంహరణలకు ఖర్చులు పెరిగిపోతున్న నేపథ్యంలో ఖాతాదారులు ప్రత్యామ్నాయంగా డిజిటల్ పేమెంట్లు చేయాలని చెబుతున్నారు.ATM ఛార్జీలు రాబోయే పెరుగుదలతో, UPI, మొబైల్ బ్యాంకింగ్, WhatsApp బ్యాంకింగ్. ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటి డిజిటల్ లావాదేవీలు వినియోగదారులకు ఆకర్షణీయంగా మారుతున్నాయి. మరోవైపు ప్రభుత్వం డిజిటల్ బ్యాంకింగ్ను ప్రోత్సహిస్తోంది.
ఆర్బిఐ ప్రకారం ఉచిత ఎటిఎం లావాదేవీలు
అక్టోబర్ 10, 2014న జారీ చేసిన RBI సర్క్యులర్ ప్రకారం, మెట్రో నగరాల్లో (ముంబై, ఢిల్లీ, చెన్నై, కోల్కతా, బెంగళూరు, హైదరాబాద్) వినియోగదారులు ఇతర బ్యాంకుల ATMలలో నెలకు మూడు ATM లావాదేవీలు ఉచితంగా చేసుకోవచ్చు.మెట్రో కాని ప్రాంతాలలో, ఈ పరిమితి నెలకు ఐదు ఉచిత లావాదేవీలుగా ఉంది.
బ్యాంకు కస్టమర్లు తరచుగా సాంకేతిక లోపాల కారణంగా ATM లావాదేవీలు ఫెయిల్ అవుతుంటాయి. ఇలాంటి సందర్భాల్లో ఉచిత లావాదేవీ పరిమితిలో లెక్కించబడతాయా అనే ఆందోళనలను లేవనెత్తుతుంది. ఆగస్టు 14, 2019 నాటి ఆర్బిఐ సర్క్యులర్ ప్రకారం, హార్డ్వేర్ లేదా సాఫ్ట్వేర్ పనిచేయకపోవడం, కమ్యూనికేషన్ లోపాలు, ATMలో నగదు లేకపోవడం లేదా రాంగ్ పిన్ ఎంట్రీ వంటి సాంకేతిక సమస్యల వల్ల జరిగే లావాదేవీలు ఫెయిల్ అయినప్పడు చెల్లుబాటు అయ్యే లావాదేవీలుగా లెక్కించబడవు. దీనివల్ల అటువంటి సందర్భాలలో ఎటువంటి ఛార్జీలు వర్తించవు.
అదనంగా, బ్యాలెన్స్ ఎంక్వైరీ, చెక్ బుక్ రిక్కెస్ట్ లు, పన్ను చెల్లింపులు, మనీ ట్రాన్స్ ఫర్, వంటి నగదు రహిత లావాదేవీలు జారీ చేసే బ్యాంకు సొంత ATMలో నిర్వహించినప్పుడు – ఉచిత లావాదేవీ పరిమితి నుండి మినహాయించబడతాయి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.