Home » Watch | దేశవ్యాప్తంగా ఎన్నికల పండుగ.. కుతుబ్ మినార్ ఎలా వెలిగిపోతుందో చూడండి..
Qutub Minar

Watch | దేశవ్యాప్తంగా ఎన్నికల పండుగ.. కుతుబ్ మినార్ ఎలా వెలిగిపోతుందో చూడండి..

Spread the love

Qutub Minar | దేశవ్యాప్తంగా ఓట్ల పండుగ ప్రారంభమైంది. ఓటింగ్ ప్రారంభం కావడంతో భారతదేశం ప్రస్తుతం ప్రజాస్వామ్య ఉత్సాహంలో మునిగిపోయింది. ఈ వేడుకల మధ్య ఢిల్లీలోని కుతుబ్ మినార్ (Qutub Minar ) “చునావ్ కా పర్వ్” (ఎన్నికల) థీమ్ కు సంబంధించి అద్భుతమైన ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంటోంది.

భారతదేశ సుసంపన్నమైన వారసత్వం, సంస్కృతికి ప్రతీక అయిన కుతుబ్ మినార్ రాత్రిపూట అద్భుతమైన రంగులతో దర్శనమిస్తుంది. ఇది ప్రజల్లో ఓటింగ్ పై స్ఫూర్తిని నింపడానికి వోటింగ్ గొప్పతనాన్ని చాటే లైటింగ్ విజువల్స్ ను ప్రదర్శిస్తున్నారు. భారత ఎన్నికల సంఘం Xకి ఒక క్లిప్‌ని పోస్ట్ చేసింది. ఓటు వేయమని ప్రజల్లో అవగాహన కల్పిస్తోంది. “కుతుబ్ మినార్ #ChunavKaParv థీమ్ అద్భుతమైన ప్రదర్శనతో జష్న్-ఎ-మత్తన్ స్ఫూర్తిని ప్రసరింపజేస్తుంది” అని ECI రాసింది. అందరం ఓట్లు వేయడం ద్వారా ఈ పండుగను జరుపుకుందాం. అని చెబుతోంది.

READ MORE  Viral Video | క్రికెట్ మ్యాచ్‌పై సంస్కృతంలో కామెంట్రీ.. సోషల్ మీడియాలో వైరల్..

ఇదిలా ఉండగా ఏప్రిల్ 26న రెండో దశ సార్వత్రిక ఎన్నికల్లో కేరళలోని మొత్తం 20, కర్ణాటకలో 14, రాజస్థాన్‌లో 13 స్థానాలకు పోలింగ్ జరిగింది. వాటితో పాటు మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లలో ఎనిమిది, మధ్యప్రదేశ్‌లో 6, అస్సాం, బీహార్‌లో ఐదు, ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్‌లో మూడు, మణిపూర్, త్రిపుర, జమ్మూకశ్మీర్‌లలో ఒక్కో నియోజకవర్గంలో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

13 రాష్ట్రాలు ఒక యూటీకి చెందిన ఓటర్లు తీవ్రమైన ఎండలను సైతం లెక్కచేయకుండా ఎన్నికల్లో ఓటు వేశారు. నూతన వధూవరుల నుంచి వృద్ధుల వరకు, గిరిజనుల నుంచి ఐటీ నిపుణులు, పీడబ్ల్యూడీలు, మహిళలు, యువకుల వరకు అందరూ ఆయా పోలింగ్ కేంద్రాల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద ఎండ వేడిమి ఉంచి ఉప‌శ‌మ‌నం కోసం ఓటర్లకు తాగునీరు, మెడికల్‌ కిట్‌లు, ఫ్యాన్లు తదితర ఏర్పాట్లు చేశారు. శాంతిభద్రతల పరిరక్షణకు పోలింగ్‌ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు.

READ MORE  Indian Street Food | ఆటోమెటిక్ గా పానిపూరీ అందించే యంత్రం.. సోషల్ మీడియాలో వైరల్..

ఫేజ్ 2లో, ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్, కాంకేర్ నియోజకవర్గాల్లోని 46 గ్రామాల ఓటర్లు సార్వత్రిక ఎన్నికల కోసం మొదటిసారిగా తమ సొంత గ్రామంలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు. ఈ నియోజకవర్గాల్లో తొలిసారిగా మొత్తం 102 కొత్త పోలింగ్ స్టేషన్లు (ఫేజ్ 1&2 ఎన్నికలు) ఏర్పాటు చేశారు.

 


Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
అత్యాధునిక హంగులతో చర్లపల్లి రైల్వే టెర్మినల్ చూశారా? దుర్గదేవి నవరాత్రి ఉత్సవాలు.. తొమ్మిది ఆలయాలు..