Home Trending News Isha Yoga Center | మహాశివరాత్రి వేడుక‌ల‌కు సిద్ధ‌మైన‌ ఈశా యోగా సెంట‌ర్‌.. ఆన్‌లైన్ లో...

Isha Yoga Center | మహాశివరాత్రి వేడుక‌ల‌కు సిద్ధ‌మైన‌ ఈశా యోగా సెంట‌ర్‌.. ఆన్‌లైన్ లో ఇలా వీక్షించండి..

0
14
Mahashivratri celebrations at Isha Yoga Center
Mahashivratri celebrations at Isha Yoga Center
Spread the love

Mahashivratri celebrations at Isha Yoga Center : త‌మిళ‌నాడు కొయంబ‌త్తూరులోని అత్యంత ప్ర‌సిద్ధ‌మైన ఈషా యోగా సెంట‌ర్‌లో మ‌హా శివ‌రాత్రి వేడుక‌లు ఘ‌నంగా జ‌రగ‌నున్నాయి. ఈశా యోగా వ్యవస్థాపకుడు సద్గురు (Sadguru) తొలిసారిగా అర్ధ‌రాత్రి మహామంత్రం’ (ఓం నమః శివాయ) దీక్షను అందిస్తారని ఈశా యోగా కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. “ఫిబ్రవరి 26, 2025న ఈశా యోగా కేంద్రంలో ఆదియోగి, సద్గురు సమక్షంలో ఈశా మహాశివరాత్రి వేడుకల్లో ప్రముఖులలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) పాల్గొన‌న‌నున్నార‌ని ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది.

అదనంగా, ఆయన “మిరాకిల్ ఆఫ్ ది మైండ్” అనే ఉచిత ధ్యాన యాప్‌ను ఆవిష్కరిస్తారు, ఇది వ్యక్తులు సరళమైన కానీ ప్రభావవంతమైన రోజువారీ అభ్యాసాన్ని నిర్మించ‌డంతో సహాయపడటానికి 7 నిమిషాల గైడెడ్ ధ్యానాన్ని అందిస్తుంది. రాత్రంతా జరిగే వేడుకలు బుధవారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు ఉదయం 6 గంటలకు ముగుస్తాయి.

Isha Yoga Center రాత్రంతా జరిగే ఈ వేడుకలో అజయ్-అతుల్, ముక్తిదాన్ గధ్వి, పారాక్స్, కాస్‌మే, సౌండ్స్ ఆఫ్ ఇషా, ఇషా సంస్కృతి వంటి ప్రఖ్యాత కళాకారులు, అద్భుతమైన ప్రదర్శనలను నిర్వ‌హించ‌నున్నారు. ఈవేడుక‌లు 12 గంటల పాటు ఆధ్యాత్మిక ప్ర‌పంచంలోకి వీక్ష‌కుల‌ను తీసుకెళ్ల‌నున్నాయి.

మ‌హాశివ‌రాత్రి వేడుక‌ల్లో భాగంగా మొదటిసారిగా, సద్గురు అర్ధరాత్రి మహామంత్రం (ఓం నమః శివాయ) దీక్షను అందిస్తారు. ఇది అంతిమ శ్రేయస్సును కలిగించే జపం. తరువాత, సద్గురు ఉదయం 3:40 గంటలకు బ్రహ్మ ముహూర్తంలో శంభో ధ్యానంలో పాల్గొనేవారికి మార్గనిర్దేశం చేస్తారు.

Isha Yoga Center : ఆన్ లైన్ లో ఇలా వీక్షించండి..

కోయంబత్తూరులో Adiyogi ప్రాంగణం వద్ద జరిగే వేడుకలకు 70 కి పైగా దేశాల నుండి సందర్శకులు హాజరవుతుండగా, 150కి పైగా దేశాల నుంచి భ‌క్తులు ఆన్‌లైన్‌లో వీక్షించ‌నున్నారు. 20కి పైగా భాషలలో ప్రత్యక్ష ప్రసారం చేయ‌నున్న ఈశా మహాశివరాత్రి వేడుకలు ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రేక్షకులను ఆకర్షిస్తాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వీక్షించబడిన ఆన్‌లైన్ ఈవెంట్‌లలో ఒకటిగా నిలిచింది.

ఈషా యోగా కేంద్రంలో జరిగే శివరాత్రి వేడుకలను ఈసారి భారతదేశం అంతటా 100 కి పైగా ప్రదేశాలలో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నరు. 250+ టీవీ ఛానెల్‌లు, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు, 100+ PVR-INOX థియేటర్‌లలో, అలాగే ZEE5, JioHotstar, Jio TV, Jio TV+ వంటి OTT ప్లాట్‌ఫారమ్‌లలో ప్రసారం అవుతుంది.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి.  అలాగే మా  గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్)ఫేస్ బుక్,  వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

🇮🇳 జాతీయ ప్రయోజనాలే పరమావధిగా.. 🇮🇳

వందేభారత్ డిజిటల్ సైన్యంలో చేరండి!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here